తాజా వార్తలు
  • సింహాచల వైభవం, కృష్ణమయ్య పాటకు - నృసింహుని ఆటకు చెల్లు

    Apr 19, 2026 11:38 am

    జగదాచార్యులు  రామానుజుల రాక తో సింహాచల క్షేత్రానికి వైదిక వైభవం...*

    *(DNS Report: Sathya Ganesh, Cheif Reporter, visakhapatnam)*    

    *విశాఖపట్నం, ఏప్రిల్ 19, 2026 (డిఎన్ఎస్ ):* ప్రసిద్ధ  సింహాచల క్షేత్రంలో  శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి పట్ల అచంచలమైన భక్తి ఉన్న పరమ వైదికుల్లో అగ్రగణ్యులు. శ్రీ కాంతా కృష్ణమాచార్యులు ఒకరు. వారు ఎంతో విద్వత్ సంపన్నులు. కవి పండితులు. వీరు స్వామిని. కీర్తిస్తూ పాటలు పాడితే  స్వామి నృత్యం చేసేవాడు.  ప్రతీ రోజూ  ఇదే జరిగేది. దీంతో  వీరి ఖ్యాతి  ఎంతో పెరిగింది. దాంతో పాటు వీరికి కొంత  అహం కూడా పెరిగింది. దాంతో ఇతరుల పట్ల వీరి వైఖరి మారింది. 
    అదే కాలంలో కొన్నాళ్ళకి యాతీశ్వరులు, జగదాచార్యులు శ్రీ  భగవద్రామానుజాచార్యులు  ఈ క్షేత్రానికి విజయ యాత్ర చేశారు.  శ్రీ వైష్ణవ  సంప్రదాయం ప్రకారం పెద్దలు మన గ్రామానికి వస్తె వెళ్ళి వారిని దర్శించాలి.  అయితే కృష్ణమయ్య .. నేను పాడితే స్వామిని పలుకుతున్నాడు.. ఇక ఇతరులతో పనేంటి అనే కించత్ భావంతో రామానుజుల వద్ద కు వెళ్ళరు. 
    అయితే వీరి వైభవం తెలుసుకున్నా రామానుజులు అవకాశం చూసుకుని ఒకసారి తమ వద్దకు రావాల్సిందిగా కబురు పంపుతారు. తానూ రావడం కుదరదు అని తేల్చి చెప్పడం తో తమ శిష్యులతో ఒక సందేశాన్ని కృష్ణమయ్య వద్దకు పంపుతారు రామానుజులు. 

    వీరు పంపిన సందేశం : 
    1 .  రాత్రి మీ గాత్ర సమయం లో స్వామి వచ్చినప్పుడు. రామానుజులకు  మోక్షం ఉందా  అని స్వామిని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరతారు. 
    అదే ప్రశ్న ను రాత్రి సమయంలో కృష్ణమయ్యా శ్రీ వరాహ నృసింహ స్వామిని అడుగుతారు.
    దానికి స్వామి ఓ కచ్చితంగా వారికి మోక్షం ఉంది అని చెప్తారు.

    రెండవ రోజు రామానుజులు మరొక సందేహం అడగమని కోరతారు. 
    2 . కృష్ణమాచార్యులు ku మోక్షం ఉందా అని అడగమంటారు.వెంటనే కృష్ణమ య్య గట్టిగా నవ్వి.. నేను పాడితే నృసింహుడు నృత్యం చేస్తాడు.  నాకు మోక్షం  లేకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తాడు. అయినా స్వామిని అడుగుతా లే అని చెప్తారు.
    రాత్రి ఏకాంత సేవలో స్వామి వచ్చినప్పుడు. కృష్ణమాచార్యులు ఇదే ప్రశ్న ను వరాహ నృసింహుని అడుగుతారు.
    దానికి సమాధానంగా నృసింహుడు. తెలియదు అని చెప్తాడు.
    అదేంటి నేను పిలిస్తే నువ్వు వస్తున్నావు... నాకు మోక్షం లేకపోవడం  ఏంటి అని అడుగుతారు.
    దానికి నవ్వి. నువ్వు పాడుతున్నావు...  దానికి నేను నృత్యం చేస్తున్నా.  రెండింటికీ చెల్లు అంతే.
    ఇక మోక్షం సంగతి అంటావా..
    .
    నీతో సహా అందరికీ మోక్ష మార్గం చూపించేది రామానుజులే.  నీకు మోక్షం కావాలి అంటే రామానుజులు ను ఆశ్రయించమని చెప్తారు.
    దాంతో జ్ఞానోదయం కలిగి, రామానుజులు ను ఆశ్రయించి   సంప్రదాయ సేవ మరింత ఉధృతంగా చేస్తారు. స్థానికంగా చేపట్టవలసిన వైదిక క్రియలు తెలియచేసి, వారిని పర్యవేక్షించమని సూచిస్తారు.

    ఎంత విద్వత్ ఉన్నా. . .పెద్దల ఎదుట వినయంగా ఉండాలి అనే సందేశాన్ని కాంతా కృష్ణమాచార్య  వృత్తాంతం తెలియచేస్తోంది. 
     

  • చందన యాత్ర ఆన్లైన్ టికెట్లు విధానం అట్టర్ ఫ్లాప్ 

    Apr 14, 2026 11:54 pm

    *అనుభవ రాహిత్యం తో చుక్కలు చూపిస్తున్న దేవస్థానం.* 

    *భక్తుల అకౌంట్ నుంచి డబ్బులు కట్, నో టికెట్. . .* 

    *(DNS Report: Sathya Ganesh, Cheif Reporter, visakhapatnam)*    

    *విశాఖపట్నం, ఏప్రిల్ 14, 2026 (డిఎన్ఎస్ ):* అత్యంత దుర్లభమైన సింహాచల క్షేత్ర  శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న తరుణం లో ఆన్లైన్ టికెట్ విధానం ద్వారా నరకం చూపిస్తోంది దేవస్థానం. పూర్తిగా అనుభవ రాహిత్యం కొత్త వచ్చినట్టు కనిపించింది. 
    మొదటిసారిగా ఈ విధానం అమలు చేస్తున్నట్టు ప్రగల్బాలు పలికిన దేవస్థానం, మాట నిలబెట్టుకోవడంలో ఘోర వైఫల్యం చెందింది. 
    వరుసగా ఒక గంట పనిచేస్తే ఒట్టు. ఈ నెల 12 నుంచి టికెట్లు ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంటాయి అని ఈఓ జె వెంకట్రావు చెప్పడంతో భక్తులు మొబైళ్ళు, కంప్యూటర్లకే అతుక్కు పోయారు. చెప్పిన ప్రకారం 12 వ తేదీ వెబ్ సైట్  పనిచేయకపోవడంతో ఒకరోజు తర్వాత పనిచేస్తుందని సొంత మీడియా ద్వారా ప్రకటించారు. అయితే 13 వ తేదీన వెబ్ సైట్ ఓపెన్ అయ్యిన,  రోజంతా హ్యాంగ్ అవుతూనే ఉంది. ఒక సారి కేవలం ఒక్క టికెట్ మాత్రమే బుక్ అయ్యేలా పెట్టారు. బాగుంది. అయితే ఒక ఫామిలీ లో 5 గురు ఉంటె. . కేవలం ఇద్దరికీ టికెట్లు బుక్ అయినా వెంటనే వెబ్సైట్ హ్యాంగ్ అవ్వడం గమనార్హం. 
    ఆ ఒక్క రోజు మహా ఓ 50 టికెట్లు బుక్ అయి ఉంటాయి. అదే తరహా దృశ్యాలు 14 వ తేదీ కూడా జనాన్ని వెక్కిరించాయి. అయితే 14 వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో వెబ్సైట్ ఓపెన్ అయినా భక్తుల అకౌంట్ నుంచి డబ్బులు దేవస్థానానికి చేరినా, టికెట్లు ప్రింట్ అవ్వకపోవడం అత్యంత దారుణం. రెండు రోజుల పాటు వెబ్సైట్ పనిచేయలేదు. మూడవ రోజు రాత్రి వెబ్ సైట్ ఓపెన్ అయ్యి, డబ్బులు పోయి ... టికెట్ లేకపోవడం దేవస్థానం నిర్వహణ నిర్లక్ష్య వైఖరి సుస్పష్టంగా కనిపించింది. 
    రెండవ రోజు ప్రింట్ అయినా టికెట్ల పై క్యూ ఆర్ కోడ్ లు ఉన్నాయి. మూడవ రోజు అసలు టికెట్టే ప్రింట్ ( జనరేట్ ) అవ్వలేదు. దీంతో వెబ్సైట్ లో ఇచ్చిన దేవాలయం హెల్ప్లైన్ నెంబర్ 93987  34612 కు ఎన్ని సార్లు ఫోన్ చేసిన సమాధానం రాకపోవడం గమనార్హం. అసలు వీళ్ళకి టికెట్ వచ్చినట్టా లేదా అనే విషయం కూడా చెప్పే నాధుడు సింహాచలం దేవస్థానం లో లేడు. భక్తులకు విస్తృత సేవలు చేస్తున్నాం అని ప్రకటించిన జిల్లా కలెక్టర్, రెవిన్యూ యంత్రాంగం, ఇతర ప్రభుత్వ అధికారులు భక్తులకు సమాధానం చెప్పవలసి ఉంది. పైగా ముగ్గురు మంత్రులతో పర్యవేక్షణ సంఘం ఏర్పాటు చేసారు. 

     

  • సింహాచల క్షేత్రం లో చందనం తొలగింపు కార్యక్రమ విధానం ఇదే

    Apr 14, 2026 3:57 pm

    *కళ్ళకు గంతలు, వెండి బోర్ గేలు ఇవే చందనోత్తరణ పరికరాలు.*  

    *(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, visakhapatnam)*    

    *విశాఖపట్నం, ఏప్రిల్ 14, 2026 (డిఎన్ఎస్ ):* అత్యంత దుర్లభమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం చేసుకున్న వారికి జన్మరాహిత్యమే కలుగుతుంది అని సింహాచల క్షేత్ర మహాత్మ్యం తెలియచేస్తోంది. ఏడాది పాటు చందనం పూత తో కనిపించే స్వామి అసలు రూపం చూడాలి అని లక్షలాది మంది భక్తులు తపించిపోతుంటారు. 

    ఏడాది కాలం పాటు 12 మణుగుల చందనం తో అలంకారభూషితుడైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి. వైశాఖ శుద్ధ తదియ నాడు ఒక్క రోజు మాత్రమే భక్తులకు నిజరూప దర్శనం అందిస్తాడు. శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి పై ఉన్న  సుమారు 500 కిలోల చందనం తొలగింపు అంత సులభంగా జరగదు. ఎంతో  ఉత్కృష్టమైన ఈ వైదిక క్రియను నిర్వహించేందుకు ముందస్తు సంస్కార విధులు చాలా ఉంటాయి. వాటిని పూర్తి చేసిన తర్వాతే స్వామి పై ఉన్న చందనాన్ని తొలగించడం ( చందనోత్తరణ) జరుగుతుంది. ఆ వైదిక క్రియను తెలుసుకుందాం. 

    ఏకాదశి నుంచి వైదిక క్రియా విధానం మొదలు...

    వైశాఖ శుద్ధ తదియ ( ఏప్రిల్ 20 , 2026) నాడు స్వామి నిజరూప దర్శనం భక్తులకు లభించనుంది. అయితే ముందు వారం రోజుల ముందు నుంచి  వైదిక క్రియ మొదలవుతుంది. చైత్ర బహుళ ఏకాదశి నాటి ఉదయం స్వామి కి నిత్యా ఆరాధనలు ముగిసిన తదుపరి, చందనం అరగతీత కోసం తగిన మేలిమి చందన కలప, సుగంధ ద్రవ్యాలకు షోడశోపచారాలు సమర్పించి, గర్భాలయం లో స్వామి ఎదుట పెట్టి, అనుమతి తీసుకుని ఆలయం చుట్టూ ప్రదర్శన చేసి,  బేడామండపం  వద్దకు చేరుకుంటారు, అక్కడ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, జరిపి,  చందన కలప కు, అరగతీత సానపెట్ట కు హారతి ఇచ్చి, చందనం తొలి  అరగతీత ను ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు ఆరంభిస్తారు. తదుపరి, అధికారులు, ఇతరులు సైతం ఈ క్రియ లో పాల్గొంటారు. అనంతరం ఆలయ స్దాన కైంకర్య  సిబ్బంది వీటిని వారం రోజుల పాటు, అరగతీత నిర్వహిస్తారు. వారం రోజుల పాటు సుమారు 125 కిలోల ( 3 మణుగుల) చందనాన్ని సేకరించి, భండారం  లో భద్రపరుస్తారు. 

    ముందు రోజు అర్ధ రాత్రి:..  

    వైశాఖ శుద్ధ విదియ అర్ధరాత్రి ( తెల్లవారితే తృతీయ), అంటే ఈ నెల 19 రాత్రి గడిచిన తర్వాత తెల్లవారు ఝామున 1 గంట ప్రాంతంలో స్వామికి సుప్రభాతం,  విశ్వక్సేన ఆరాధన,  పుణ్యాహవచనం, ఋత్విక్  వరుణ, పంచ కలశ  ఆవాహనం, ఆరాధనం, నిర్వహిస్తారు. అనంతరం అర్హులైన, అర్చక సిబ్బంది ముఖాలకు గంటలు కట్టుకుని, వెండి బొరిగెలతో స్వామి పై ఉన్న 500 కిలోల చందనాన్ని తొలగించే ప్రక్రియ ను ( చందనోత్తరణం ) మొదలు పెడతారు. పూర్తిగా స్వామి పై ఉన్న చందనాన్ని తొలగించిన తదుపరి స్వామికి పంచామృత అభిషేకం, పంచ కలశ  అభిషేకం, స్నాపన తిరుమంజనం, విశేష అలంకారం, ఆరాధనం, సేవాకాలం, మంగళ నీరాజనం, కేవలం శీతల పానీయం  నివేదనం జరుగుతుంది. ఎటువంటి ఘన  పదార్ధం నివేదన ఉండదు. ఈ వైదిక ప్రక్రియ అంతా తెల్లవారుఝామున 3.50 నిమిషాల లోపు జరుగుతుంది. 

    తొలి దర్శనం పూసపాటి వంశస్థులకే... 

    అనంతరం తెల్లవారు ఝామున  4 గంటల ప్రాంతంలో దేవాలయ అనువంశిక ధర్మకర్తలు పూసపాటి వంశీకులకు మాత్రమే తొలి దర్శనం కల్పిస్తారు. తదుపరి ఇతర ప్రముఖులకు, సామాన్య భక్తులకు  రాత్రి 8 గంటల వరకూ స్వామి దర్శనం కల్పిస్తారు. 

    సంప్రదాయ శ్రీవైష్ణవ స్వాముల చే . . సహస్ర ఘటాభిషేకం ..

    సాయంత్రం ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన అనంతరం సంప్రదాయ పరులైన వైదిక శ్రీవైష్ణవ స్వాములు గంగాధర నుంచి మట్టి  కలశలతో  తీసుకు వచ్చిన పవిత్ర గంగాధర జలం తో స్వామికి వెయ్యి కలశలతో అభిషేకం నిర్వహిస్తారు. దీన్నే సహస్ర ఘటాభిషేకం అని పేరు. ఈ వేడుక సమయంలో గర్భాలయంలోకి ఇతరులు  ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. తదుపరి శీతల పానీయం, పళ్ళు నివేదన అనంతరం రాత్రి తిరిగి  తొలివిడత  125 మణుగుల చందనం స్వామికి అలంకరిస్తారు. ఈ అలంకరణ లో స్వామి గుమ్మడి పండు ఆకారం లో దర్శనం ఇస్తారు. 
    తిరిగి వైశాఖ పౌర్ణమి,  జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో ఒక్కో మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. దీంతో చందనయాత్ర పరిపూర్ణం అవుతుంది. 
    కొన్ని యుగాల నుంచి వేలాదిమందికి నిదర్శనాలు చూపుతున్న శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి నేటి తరానికి ప్రత్యక్ష నిదర్శనం చూపుతున్నాడు. అది గ్రహించే శక్తి మనకి ఉండాలి అంతే. .

     

Panchangam - May 9, 2026

Date :
Ruthuva :
Nakshatram :
Week :
Masam :
Amrithakalam :
Year :
Pakshamvarjam :
Samsthram :
Ayanam :
Tithi :
Durumuhratam :

Today Vizag Events - May 9, 2026

ఆంధ్ర ప్రదేశ్
view more..
రాజకీయo
view more..

వీడియోలు
International
view more..
Movie News
view more..
విశాఖ వార్తలు
అమీ. . . సుబెందు అధికారి.  వినగానే..అక్కడ సంబరాలు...

May 9, 2026 3:46 pm

*తెలుగు రాష్ట్రాల్లో స్వయం మేతావులకు గుండెపోటు వచ్చిందిట?*   

*వాళ్ళకి సందేశ్ ఖాలీ కనపడదు, ఆర్జీ కార్  మర్డర్ కనప...

view more..
Competitive Exams in India
Sports
view more..
National News
view more..