తాజా వార్తలు
  • వెంకన్న కు ఏడు శనివారాల ముడుపుల దీక్ష తో సకల కార్యసిద్ధి

    May 24, 2026 10:20 pm

    *అద్భుతాలు సృష్టిస్తున్న అరసవల్లి శ్రీ రమ్య తిరుమల ఆలయం* 

    (DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

    *విశాఖపట్నం, మే 24, 2026 (డిఎన్ఎస్ ):* మానవ ప్రయత్నం ఎంత ఉన్నా పరమాత్ముని అనుగ్రహం లేకుంటే ఆశించిన ఫలితాలు అంతసులభంగా లభించవు.  స్వామి అనుగ్రహం పొందేందుకు అత్యంత సులభమైన విధానం శరణు వేడడమే.  అలా శరణు వేడిన భక్తులకు మంచిఫలితాలు అందిస్తున్న దేవాలయం లోని శ్రీ రమ్య తిరుమల శ్రీనివాసుడు. శ్రీకాకుళం పట్టణం లోని అరసవల్లి లో గల శ్రీ రమ్య తిరుమల దేవాలయం లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో కలిసి వేంచేసిన శ్రీ వేంకటేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు.  కుటుంబ సమస్యలు, సంతాన లేమి, విద్య లో ఉన్నతి, వ్యాపారంలో అభివృద్ధి, ఆస్తి తగాదాలు, కోర్టు తగాదాలు, మానసిక సమస్యలు తదితర కష్టాల నుంచి ఉపశమనం అందిస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం స్వామికి కట్టే ముడుపులు.  ఎంతో నిరాశ తో ఈ ఆలయానికి వస్తున్న భక్తులు శనివారం దీక్షల తదుపరి వారి ఆనందానికి అంతులేకుండా ఉంది. 

    ఏడు శనివారాలు దీక్ష:

    ఏదైనా ఒక లక్ష్య సాధన కోసం సాగించే దీక్షే ఈ ఏడు శనివారాలు దీక్ష. నువ్వే తప్ప ఇత: పరంబు ఎరుగ  అన్న రీతిలో స్వామిపట్ల శరణాగతి వెడితే. . ఫలితం తప్పనిసరిగా లభిస్తుంది అనేందుకు వందలాది మంది భక్తులే నిదర్శనం.

    ఒక మంచి సంకల్పంతో ఆలయానికి వచ్చిన భక్తులు శనివారం స్వామి దర్శనం చేసుకుని, అర్చక స్వాములు చెప్పే సంకల్పంతో స్వామిని స్వయంగా అర్చించి, అనంతరం ఆలయంలోనే ముడుపులు కట్టడం జరుగుతుంది. ఆ రోజు ఉపవాసం చేసి, స్వామి పట్ల తదేక దీక్ష తో ఉండాల్సి ఉంటుంది. తదుపరి ఆరు శనివారాలు పాటు సాయంత్రం వేళల్లో ఆలయంలోనే శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, తదుపరి నిర్వహించే సామూహిక సహస్రనామ అర్చనలో పాల్గొనడం జరుగుతుంది. ఈ ముడుపులు అన్ని ఆలయంలో స్వామి ఎదుటే ఉంచడం జరుగుతుంది. ప్రతి భక్తుని ముడుపును ఒక క్రమ పద్దతిలో విడిగా పెట్టడం జరుగుతుంది. ఈ ఏడూ వారాల పాటు ఎటువంటి అపశ్రుతి ఆలోచనలు చెయ్యరాదు.  శ్రద్దగా ఈ దీక్ష పూర్తి అయిన తదుపరి ఆలయంలోనే దీక్ష విరమణ చేయవలసి ఉంటుంది.  
    ఇప్పడికే వందలాది మంది భక్తులు ఈ దీక్ష స్వీకారం చేయడం, తదుపరి సత్ఫాలితాలు పొందడం జరిగింది.  

    వివరాల కొరకు :  
    ఈ దీక్ష వివరాలు పొందేందుకు, ఇతర వివరాల కొరకు ఆలయ ప్రధాన అర్చకులు కరి వేణుమాధవ్ రంగనాధ్ ను 9440061940 నెంబర్ లో సంప్రదించవచ్చును. 

    ఆలయానికి చేరుకోవడం ఎలా?
    శ్రీకాకుళం బస్సు స్టాండ్ నుంచి అసరసవల్లి వెళ్లే మార్గం లో శ్రీ రమ్య తిరుమల దేవాలయం రోడ్డు ప్రక్కనే ఉంటుంది. బస్సు స్టాండ్ నుంచి ఆటోలు విరివిగా ఉంటాయి. 

  • దివ్య ప్రబంధం పాఠం - 1.2,  తిరువాయ్ మోజి 1 వ పత్తు 2 వ దశకం

    May 24, 2026 10:48 am

    https://youtu.be/1Ls9CSSw514

    *దివ్య ప్రబంధం ప్రతీ  పాశురం పదవిభజన తో పాటూ నేర్చుకుందాం*  

    *Learn Tiruvay Mojhi - 1.2,  1 st Pattu, 2 nd Dasakham Pada Vibhajana, recitation* 

    *దివ్య ప్రబంధం పాఠం - 1.2,  తిరువాయ్ మోజి 1 వ పత్తు 2 వ దశకం*

    నిర్వహణ: SV Info Services, Visakhapatnam,    

    Pls Subscribe , Share & Like *DnsDivineLive*

  • సింహాచలం భూముల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత, విహెచ్ హర్షం

    May 22, 2026 3:48 pm

    *అడవివరంలో చర్చ్ కూడా కూల్చండి: రాష్ట్ర ప్రముఖ్ పూడిపెద్ది* 

    *DNS వార్త కు స్పందనగా అక్రమ కట్టడాల కూల్చివేత*

    (DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

    *విశాఖపట్నం, మే 22, 2026 (డిఎన్ఎస్ ):* సింహాచలం దేవస్థానం భూముల కబ్జా పై DNS మీడియా లో గురువారం వచ్చిన కథనం పై దేవస్థానం అధికారాలు స్పందించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచలం క్షేత్రం లో వెలసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం కు చెందిన భూములు ఇతరులు కబ్జా చేస్తున్న అధికారులు కళ్ళు మూసుకు కూర్చున్నారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అర్చక, పురోహిత్, మఠ్ మందిర్  ప్రముఖ్ పూడిపెద్ది శర్మ పోరాటం చేస్తున్నారు. అయన పోరాట ఫలితంగా శుక్రవారం దేవస్థానం అధికారులు, అక్రమంగా దేవస్థానం భూముల్లో నిర్మించిన కట్టడాలను కూల్చి వేశారు.  సింహాచలం కొండకు దగ్గరలోనే ఉన్న విరాట్ నగర్ లో ప్రధాన కూడలి దగ్గరే ఉన్న దేవస్థానం భూమిలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను శుక్రవారం పొలిసు సిబ్బంది సహకారం తో కూల్చేశారు. ఈ చర్య పట్ల పూడిపెద్ది శర్మ హర్షం వ్యక్తం చేసారు. 
    అదే విధంగా  అడవివరం ఎస్ సి కొలని లో దేవస్థానం భూమిలో ఏకంగా చర్చ్ నిర్మాణం చేసి, ఎటువంటి సిగ్గు లేకుండా చర్చ్ కార్యాలపాలతో పాటు గా, మతమార్పిళ్లు సైతం యధావిధిగా చేస్తున్నారని శర్మ మండిపడ్డారు. ఈ స్థానం లో ఇంటి కోసం అనుమతి తీసుకుని, చర్చ్ ని అక్రమం గా నడుపుతున్నారని తెలిపారు. దీని పై కూడా అధికారులు విచారణ జరిపి, తక్షణం చర్చ్ ను కూల్చివేయాలని డిమాండ్ చేసారు. 

Panchangam - Jun 6, 2026

Date :
Ruthuva :
Nakshatram :
Week :
Masam :
Amrithakalam :
Year :
Pakshamvarjam :
Samsthram :
Ayanam :
Tithi :
Durumuhratam :

Today Vizag Events - Jun 6, 2026

ఆంధ్ర ప్రదేశ్
view more..
రాజకీయo
view more..

వీడియోలు
International
view more..
Movie News
view more..
విశాఖ వార్తలు
ఏఐడిఎంకె కోసం  అన్నామలై ని బయటకు తన్నితగిలేశా...

Jun 6, 2026 5:09 pm

అన్నామలై పోతే పార్టీ కి దమ్మిడీ నష్టం లేదు : bjp 

గతం లో తమిళనాట భారీ క్యాడర్ ఉండేది కదా ఇప్పుడుపోడానికి?   

view more..
Competitive Exams in India
Sports
view more..
National News
view more..