తాజా వార్తలు
  • సింహాచలం క్షేత్రం లో ప్రబంధం పోస్ట్ లేకపోడానికి వాళ్లే కారణమా?

    May 20, 2026 2:56 pm

    *గుళ్లో అర్చనల్లో పాంచరాత్రం, దివ్య ప్రబంధం వినిపించాలి* 

    *వేదపాఠశాలలో ఆ రెండు కోర్సులు లేవు?  గుళ్లో వాటి పోస్టులు లేవు?* 

    *ఈవో కు, ఆచార్యులకు  భాద్యత లేదు, పాఠశాలకు గుర్తింపు లేదు* 

    (DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

    *విశాఖపట్నం, మే 20, 2026 (డిఎన్ఎస్ ):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచలం క్షేత్రం లో వెలసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం శ్రీవైష్ణవ శ్రీపాంచరాత్ర ఆగమం విధానం లో నడుస్తుంది. ఈ దేవాలయంలో నిత్యం పాంచరాత్రం ఆగమం ప్రకారం అర్చనలు జరగాలి. నాలాయిర దివ్య ప్రబంధం విన్నపాలు జరగాలి. ఈ పారాయణాలు చేసేందుకు కొన్ని దశాబ్దాల క్రితం వరకూ రెగ్యులర్ విధానం లో శ్రీవైష్ణవ పండితులను నియమించేవారు. అయితే దాదాపు మూడు దశాబ్దాలుగా సింహాచల క్షేత్రంలో నాలాయిర దివ్య ప్రబంధ పండితులు కాంట్రాక్టు విధానం లో రోజువారీ వేతనం ఇచ్చే విధంగా తీసుకు వస్తున్నారు. తప్పితే  పూర్తి స్థాయి పండితులను నియమించడం లేదు. అయితే గతంలో వీటికోసం ప్రభుత్వం నియామక ప్రకటన కూడా ఇచ్చింది. అయితే  వీటి కి తగిన సూచనలు చేయవలసిన ఆచార్యులు, నాటి అర్చకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ పోస్టులను రద్దు చేసి, వేదం కేటగిరి లోకి మార్చేశారు. 

    ఆచార్యులు,  అర్చకులు కారణమా ?
    సింహాచల క్షేత్రం లో రెగ్యులర్ అధ్యాపకులు, పారాయణదారుల పోస్ట్ ల నియామకం కొన్ని దశాబ్దాలుగా జరగకుండా నిలిచిపోడానికి ప్రధాన కారణం ఆచార్యులు,  అర్చకులు ఆధిపత్య పోరే కారణం అంటూ వైదిక సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పడికే కొన్నేళ్లుగా  రోజువారీ వేతనం విధానం లో పనిచేస్తున్న వాళ్లలో ఎక్కువమందికి పూర్తి అర్హతలు ఉన్నాయి. అయినప్పడికి వీళ్ళకి నియామకం వస్తే దేవస్థానం లో తమ ఆధిపత్యం తగ్గిపోతుంది అన్న కారణంతో ఆ ఇద్దరూ ఈ పోస్ట్ లను అడ్డుకున్నారని ప్రచారం విస్తృతంగా సాగుతోంది. పైగా వీరిలో అర్చకులుగా ఉన్నవారు గతం లో సొంత వ్యవహారాల కోసం అమెరికా వెళ్లి రావడం తో పై కారణానికి మరింత బలం పెరిగింది. ఇటీవల కోర్టు ఇచ్చిన సూచనల ప్రకారం విదేశాలకు వెళ్లిన వాళ్ళు గర్భాలయంలో అర్చనలు చెయ్యరాదు అనే నిబంధన పై వైదిక సిబ్బంది పట్టుపడుతున్నారు. అయితే అతనికి ఉన్నతాధికారుల వద్ద ఉన్న పరపతి కారణంగా ఈ తాత్కాలిక రోజువారీ వైదికులను రెగ్యులర్ నియమాకాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు ఆచార్యులు, అర్చకులు అడ్డకుంటున్నారన్న అభియోగాలకు నిదర్శనాలు కనపడుతున్నాయి. 
    గత కొన్నేళ్లుగా వీరిద్దరూ సింహాచల క్షేత్రం లో  పూర్తిగా వైదిక ఆచారాలను తుంగలోకి తొక్కి తాము చెప్పినట్టే అర్చనలు చెయ్యాలి అని శాసిస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ళు పెట్టె నిబంధనలు ఇతర వైష్ణవ స్వాములకే తప్ప, తాము పాటించవలసిన అవసరం లేదని బహిరంగంగానే వ్యక్తమవుతోంది. దీనికి నిదర్శనమే ఇటీవలే జరిగిన చందన యాత్ర రోజు రాత్రి నాటి సహస్ర ఘటాభిషేకం లో వైష్ణవ స్వాములందరూ కచ్చితంగా ఓపనం, శిఖా తో ఉండాలి అనే నిబంధన పెట్టారు. వీరు మాత్రం పూర్తి జుట్టు, గెడ్డం తో ఉండడం గమనార్హం. ఇదే ప్రశ్నించిన కొందరు వైష్ణవ స్వాములను ఆలయం నుంచి వెంటనే బయటకు పంపేశారు. 

    వైదిక విషయాల్లో పూర్తి అధికారం కల్గిన ఆచార్యులు తనదైన శైలిలో చెప్పిన ప్రతి విషయానికి అధికారులు తానతందానా అంటూ తలూపడం జరుగుతోంది. 

    వీళ్ళ ప్రతాపంతోనే వేదపాఠశాల కుంటూ పడిందా ?  

    గతంలో వందలాది మంది పండితులు శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం పరిధిలోని వేదపాఠశాలలో చేరి, ఉన్నత విద్యావంతులు అయ్యారు. ఇక్కడ ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వ వేదం తో పాటు, శైవాగమం, పాంచరాత్ర ఆగమం, స్మార్తం, సహా ఇతర కోర్సులను నేర్పించేవారు. అయితే కొండపై ఇద్దరు పెద్దల అధికార ప్రభావంతో ఈ పాఠశాల లో గత ఐదేళ్లుగా శ్రీ పాంచరాత్ర కోర్సు మూతపడింది.  అంతకు ముందు 35 ఏళ్లుగా నాలాయిర దివ్య ప్రబంధం కోర్సు మూతపడింది. అసలు సింహాచల క్షేత్ర దేవాలయానికి ఆయువు పట్టులైన ఈ రెండు కోర్సులనూ మూసివేయడానికి వీళ్ళకి హక్కు ఎవరు ఇచ్చారు అని వైదికులు ప్రశ్నిస్తున్నారు. ఈ పాఠశాల గురించి ఎక్కడా ప్రచారం చెయ్యరు, అసలు ఇక్కడ వేదపాఠశాల ఉంది అనే విషయం కూడా చాలామందికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. 
    ఇటీవల సింహాచల దేవస్థానం విడుదల చేసిన వేదపాఠశాల ప్రవేశ ప్రకటన ప్రత్యక్ష నిదర్శనం గా నిలిచింది. దీనిలో వేదం, స్మార్తం, శైవ ఆగమం కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులకు ఆహ్వానం అని ఇచ్చారు. దీనిలో పాంచరాత్రం గానీ, దివ్యప్రబంధం గానీ లేవు. 

    దేవాలయానికి మూలబిందువైన పాచరాత్రం, దివ్య ప్రబంధం నేర్పించేందుకు అసలు అధ్యాపకులే వేదపాఠశాలలో లేరు. వాళ్ళ నియామకం కూడా అనవసరం అని కొండపై పెద్దలు తీర్మానించినట్టు సమాచారం. కొంతమంది వైదికులు ఇప్పడికే విద్యార్హతలు పొంది, వయసు మీరిపోవడంతో ఆందోళనలో ఉన్నారు. దేవస్థానంలో పాంచరాత్రం, దివ్య ప్రబంధం విభాగాల్లో పూర్తి స్థాయి వైదికులను నియమించినట్టయితే. .. దేవాలయంలో పాటు, వేదపాఠశాల లో విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది.  

    ఈ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు లేదు.

    అన్నింటి కంటే మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే సింహాచల క్షేత్రం లో ఉన్న వేద, స్మార్త ఆగమ పాఠశాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లేదు. ఇక్కడ చేరిన విద్యార్థులు ప్రభుత్వ జాబితా లో ఈ పాఠశాల విద్యార్థులుగా ఉండరు. అయినా కూడా దేవస్థానం కార్యనిర్వహణ అధికారులకు గానీ, దేవస్థానం వైదిక ఆచార్యులకు గానీ, పాఠశాల నిర్వాహక అధ్యాపకులకు గానీ పట్టింపు లేక పోవడం గమనార్హం. 

    ఇదే ఒక సాధారణ పాఠశాలకు ప్రభుత్వ  గుర్తింపు  లేకపోతె వెంటనే ఆ స్కూల్ ను మూసేయిస్తారు అధికారులు. మరి అలాంటిది దశాబ్దాల తరబడి  ప్రభుత్వ గుర్తింపు లేకుండా సింహాచలం వేద పాఠశాల ఎలా నడుస్తోంది? 

    గతం లో ఇక్కడ చదివిన విద్యార్థులు ఇతర సంస్థల నుంచి ప్రభుత్వ పరీక్షలు ప్రవేశ, వర, ప్రవర,  వంటి పరీక్షలకు హాజరై వ్యక్తిగతంగా వ్రాసేవారు. అలా వచ్చిన సర్టిఫికెట్లతొ వివిధ దేవస్థానాల్లో ఉద్యోగాల్లో చేరారు తప్ప, సింహాచల దేవస్థానం ఆగమ పాఠశాల వాళ్ళ కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. 
    పాఠశాలకు గుర్తింపు లేనప్పుడు ఇక్కడ విద్యార్థులను ఎలా చేరుస్తారు. కనీసం 20 మంది కూడా విద్యార్థులు లేకుండా ఒక వేద పాఠశాలను ఎలా నిర్వహిస్తున్నారో సింహాచల దేవస్థానము ఈఓ కె తెలియాలి.  

     

  • హిందూ దేవాలయాలను దోచుకోడానికేనా ట్రస్టీలను వేసింది?

    May 17, 2026 3:59 pm

    *గుడి జిల్లా తో సంబంధమే లేనివాళ్ళు బోర్డు లో సభ్యులా?*

    *ఈ ట్రస్టీ ల్లో ఎంతమంది కి ఆ గుడి చరిత్ర తెలుసును?* 

    (DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

    *విశాఖపట్నం, మే 17, 2026 (డిఎన్ఎస్ ):* గత వారం రోజులుగా రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డు లను నియమిస్తున్నారు. అయితే ఈ ట్రస్ట్ బోర్డులు ఆయా దేవాలయాల ఆదాయాన్ని దోచుకోడానికేనా అనే అనుమానం భక్తుల్లోనూ, ఆయా రాజకీయ పార్టీల్లోనూ కూడా కలుగుతోంది. ప్రస్తుతం జరిగిన నియామకాలను చూస్తే. . విశాఖపట్నం నగరం లోని  సింహాచల క్షేత్రం లోని శ్రీ వరాహ లక్ష్మి దేవస్థానం లో ట్రస్ట్ బోర్డు నియామకం జరిగింది. ఈ బోర్డులో కేవలం విశాఖపట్నం నుంచి కొందరు ఉండగా, టెక్కలి, అరకు, పుంగనూరు, నరసారావు పెట, అనపర్తి, చీపురుపల్లి, ఎస్ కోట ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.  ఈ బోర్డు కు అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు చైర్మన్ గా ఉన్నారు. వీళ్లల్లో ధార్మిక సంప్రదాయం పట్ల గానీ, సింహాచల క్షేత్ర వైభవం, చరిత్ర గురించి గానీ దమ్మిడీ కూడా తెలిసిన వాళ్ళు లేరు. వీళ్లంతా కేవలం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కోటాలో ఈ బోర్డు లోకి చొరబడిన వాళ్ళే తప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాల  ద్వారా సమాజ సేవ చేసిన కోటాలో కాదు.  

    ఒక దేవాలయానికి ట్రస్ట్ బోర్డు నియమించేది, కేవలం ఆ దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి పరిచేందుకే తప్ప, ఆ గుడి ద్వారా వచ్చే ఆదాయాన్ని దోచుకుని, పంచుకోడానికి కాదు. ఇంతవరకూ ఎన్నో ట్రస్ట్ బోర్డు లు నియామకాలు జరిగాయి. అసలు ఈ బోర్డులు ఈ దేవాలయ అభివృద్ధి కి ఏ మేరకు సలహాలు సూచనలు ఇచ్చారు? 

    ఈ దేవాలయం గ్రేడ్ టాప్ క్యాటగిరి లో ఉంది. ఆదాయం కూడా ఆశించిన స్థాయి కి మించి ఉంది. హుండీ ల్లోనూ, భక్తుల నుంచి భారీ మొత్తంలోనూ విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి దేవాలయాలకు బోర్డు లు లేకపోయినంత మాత్రాన ఆ దేవాలయాలు నడవడం లేదా?  ఈ దేవాలయానికి అసలు బోర్డు అవసరం ఏమాత్రం లేదు. 

    లక్షలాది ఎకరాలు ఆస్తులు ఉన్న సింహాచలం గుడి కి గతం లో ఎన్నో బోర్డు లు ఉండగానే వేల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి. వాటి ని కాపాడాలి అనే ఇంగితం కూడా నాటి సభ్యుల్లో లేకపోవడం గమనార్హం. ఇప్పడికి ఎన్నో భూములు కోర్టుల పరిధిలోనే ఉన్నాయి.  ఇలా ఇష్టానుసారంగా దేవాలయ ఆస్తులను విడిచిపెట్టేసిన వాళ్ళు బోర్డు లో ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అనే అభిప్రాయం భక్తుల్లో ఉంది. 

    ఈ ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో ఎంతమందికి భక్తి భావం ఉంది. అసలు ఎంతమందికి ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న చరిత్ర ఉంది. ఉత్సవాల సమయంలో టికెట్లు పొందడం, ఈ బోర్డు పదవి ఆధారంగా వ్యాపారాలు పెంచుకోవడం పైనే దృష్టి ఉంటుంది తప్ప, భక్తులకు మెరుగైన సేవలు చెయ్యాలి అనే భావన ఏ కోశానా ఉండదు. 
    గతంలో పోస్ట్ లు పొందినవాళ్లు దేవాలయాన్ని ఇబ్బడిముబ్బడిగా వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కాంట్రాక్టు లు పేరుతొ వాటాలు కూడా పొందిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి దుర్ఘటనలు గమనించిన అనువంశిక ధర్మకర్త  ఈ దేవాలయానికి ఎటువంటి బోర్డు లు వేయవద్దని గతం లోనే తెలియచేసారు. అయితే ఈ ఏడాది మాత్రం బోర్డు వెయ్యడం జరిగింది. వీళ్లల్లో ఎంతమంది హిందువులు?  ఎంతమంది సెక్కులర్ పేరుతొ ఇతరమతాలను అందలం ఎక్కించుకుంటున్నారు. అసలు వీళ్ళ జీవన శైలి ఎలా ఉందొ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 

    సింహాచల క్షేత్ర దేవాలయం లో జరిగే పూజలు  ఏ విధానం లో జరుగుతాయో కూడా తెలియని వాళ్ళు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉంటె. .. ఆ గుడి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో. . . నియామకాలు చేసినవాళ్లకే తెలియాలి. 

  • దేవస్థాన ట్రస్టీలుగా ఎంపికైన విప్రులకు అభినందనలు: పూడిపెద్ది శర్మ

    May 16, 2026 1:06 pm

    *సంప్రదాయ వైభవ సారధులకు శుభాకాంక్షలు : DNS Media*

    (DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

    *విశాఖపట్నం, మే 16, 2026 (డిఎన్ఎస్ ):* మహా విశాఖపట్నం పరిధిలోని ప్రధాన దేవాలయాల కమిటీల్లో ట్రస్టీలుగా నియమితులైన బ్రాహ్మణ ప్రముఖులకు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మఠ్ మందిర్ ప్రముఖ్  పూడిపెద్ది శర్మ అభినందనలు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు అయినా శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం లో ప్రత్యేక ఆహ్వానితులుగా వేదుల దక్షిణామూర్తి ( భారతీయ జనతా పార్టీ, విశాఖపట్నం ), సుసరాపు గణపతి శర్మ ( తెలుగుదేశం, విజయనగరం), ఇసుక కొండ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ట్రస్టీ గా  వేదుల హనుమంత రావు ( తెలుగుదేశం, విశాఖపట్నం), శ్రీ కనక మహాలక్ష్మి  అమ్మవారి దేవస్థానం ట్రస్టీ గా రాపర్తి శైలజ ( మాజీ కార్పొరేటర్, తెలుగుదేశం), శ్రీ దుర్గాలమ్మ దేవస్థానం ట్రస్టీ గా   సత్యవోలు ఆనంద రావు ( తెలుగుదేశం ) తదితరులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడం హర్షణీయమన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం లో ప్రతినిధులుగా వీరు ఆయా దేవస్థానాల్లో సంప్రదాయ కార్యక్రమాలను మరింతగా అభివృద్ధి పరిచేందుకు కృషి చెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా వీరందరికి హార్దిక శుభాకాంక్షలు పూడిపెద్ది శర్మ తెలియచేసారు. 

    సంప్రదాయ వైభవ సారధులకు : DNS Media  

    సనాతన సంప్రదాయ వైభవాన్ని మరింత గా పరిరక్షించేందుకు బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రతినిధులకు వివిధ దేవాలయాల నూతన కమిటీల్లో సభ్యులుగా నియమించడం పట్ల  DNS Media ధార్మిక న్యూస్ సంస్థ  అభినందనలు తెలియచేస్తోంది. ఇటీవల కాలం లో సనాతన ధర్మం పై కొందరు ధూర్తులు, సంఘ విద్రోహ శక్తులు అవాకులు చెవాకులు ప్రేలుతున్న సందర్బంలో  దేవాలయాలను మరింత పటిష్టం చెయ్యడం కోసం వీరు కృషి చెయ్యగలరు అని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.   

Panchangam - May 25, 2026

Date :
Ruthuva :
Nakshatram :
Week :
Masam :
Amrithakalam :
Year :
Pakshamvarjam :
Samsthram :
Ayanam :
Tithi :
Durumuhratam :

Today Vizag Events - May 25, 2026

ఆంధ్ర ప్రదేశ్
view more..
రాజకీయo
view more..

వీడియోలు
International
view more..
Movie News
view more..
విశాఖ వార్తలు
వెంకన్న కు ఏడు శనివారాల ముడుపుల దీక్ష తో సకల కా...

May 24, 2026 10:20 pm

*అద్భుతాలు సృష్టిస్తున్న అరసవల్లి శ్రీ రమ్య తిరుమల ఆలయం* 

(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

*...

view more..
Competitive Exams in India
Sports
view more..
National News
view more..