Dec 29, 2025 5:28 pm
*జగదాచార్యులు చిన్న జీయర్ మంగళాశాసనం చేసిన దివ్య సన్నిధి*
*30 న ఉత్తర ద్వార దర్శనం, అధ్యయనోత్సవాలు*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం / శ్రీకాకుళం, డిసెంబర్ 29, 2025 (డిఎన్ఎస్):* సంకల్ప సిద్ది లభించే దేవాలయంగా ఖ్యాతిగాంచిన శ్రీకాకుళం లోని అరసవల్లి రోడ్ లో గల శ్రీ రమ్య తిరుమలలో ముక్కోటి ఏకాదశి కి అద్వితీయమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసారు. గత కొన్నేళ్లుగా ఎంతో శ్రద్దగా అన్ని ఉత్సవాలను శ్రీపాంచరాత్ర ఆగమ విధానంలో నిర్వహిస్తున్నట్టు అర్చకులు కరి వేణుమాధవ్ రంగనాధ్ తెలియచేసారు. ఈ నెల 30 న ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని, పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. స్వచ్చంద కార్యకర్తలు, ప్రతి భక్తునికి ప్రశాంతంగా దర్శనం లభించేలా సేవలు అందించనున్నట్టు తెలిపారు. వృద్దులు, మహిళలకు, చిన్నారులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
అధ్యయనోత్సవాలు.. ప్రబంధ పారాయణ:
వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవాన్ని పుర్సకరించుకుని శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన దివ్య ప్రబంధ తిరువాయ్ మొజి సేవాకాలం అనుసంధానం చేయడం జరుగుతుందని తెలిపారు. శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాల్లో నిర్వహించే ఈ అధ్యయనోత్సవాలు ఈ దేవాలయం సైతం నిర్వహించడం గమనార్హం. వందలాది మంది భక్తుల రాకతో ఆలయం ఈరోజున జనసందోహంగా మారుతుంది. ప్రతి శనివారం స్వామికి, శుక్రవారం అమ్మవారికి అభిషేకం, అర్చనలు జరుగుతున్నాయి. ప్రతి శ్రవణ నక్షత్రం రోజున స్వామి వారికీ తిరుకల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
జగదాచార్యులు చిన్న జీయర్ స్వామి మంగళాశాసనం...:
జగదాచార్యులు, అపరరామానుజులు గా ఖ్యాతిగాంచిన త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు ఇటీవలే ఈ ఆలయాన్ని దర్శించి శ్రీవెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి అమ్మవార్లకు మంగళాశాసనం చేయడం జరిగింది. ఆలయ ఆవిర్భావాన్ని తెలుసుకుని, అర్చకుల భక్తి, చిత్తశుద్ధికి సంతోషించారు. ఆలయ అభివృద్ధికి మరిన్ని సూచనలు చేయడం జరిగింది.
గణపతి సచ్చిదానంద స్వామి అనుగ్రహం..
అపర దత్తస్వామి స్వరూపులు మైసూరు దత్తపీఠం గురువులు గణపతి స్చచిదానంద సరస్వతి కూడా ఇటీవలే ఈ ఆలయాన్ని దర్శించడం జరిగింది.
యతీశ్వరులు ఎందరో ఎందరెందరో..
శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని దశదిశలా వైభవంగా విస్తరింపచేస్తున్న యతీశ్వరులు త్రిదండి అహోబల జీయర్ స్వామి వారు, త్రిదండి దేవనాథ జీయర్ స్వామివారు, త్రిదండి శ్రీరామచంద్ర జీయర్ స్వామివారు ఈ శ్రీరమ్య తిరుమల దేవాలయాన్ని దర్శించి, స్వామికి మంగళాశాసనం చేసారు.
శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆచార్యులు చిలకపాటి నరసింహాచార్యులు ఆలయాన్ని దర్శించి, యంత్ర ప్రతిష్ట స్వయంగా జరిపించారు.
పెద్దల అనుగ్రహంతో, భక్తుల సహకారంతో ఆలయం లో వార్షికోత్సవాలు, ధనుర్మాస వేడుకలు, అధ్యయనోత్సవాలు, వైభవంగా జరుగుతున్నాయి.
Dec 20, 2025 8:09 pm
దివ్యసాకేతం, తిరుమల, సింహాచలం, వానమామలై పీఠాల్లో..
*(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*
*విశాఖపట్నం, డిసెంబర్ 20, 2025 (డిఎన్ఎస్):* శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది ధనుర్మాసము. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో మరింత ప్రాధాన్యమైనవి అధ్యయనోత్సవాలు. వైకుంఠ ఏకాదశి కి ముందు 10 రోజులు, తర్వాత 10 రోజుల పాటు నాలాయిర దివ్య ప్రబంధం అనుసంధానం జరుగుతుంది. ముందు 10 రోజులు ఉదయం వేళల్లో పగల్ పత్తు గాను, వైకుంఠ ఏకాదశి తర్వాత 10 రోజులు రాపత్తు గానీ ఈ అధ్యయనోత్సవాలు. వేడుకలు నిర్వహిస్తుంటారు.
శ్రీరంగం, తిరువల్లిక్కేణి, కాంచీపురం, మేల్కొటే, తాడిత దక్షిణ భారత దేశ క్షేత్రాల్లోను, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శ్రీవైష్ణవ క్షేత్రాలైన తిరుమల, భద్రాచలం, సింహాచలం, శ్రీకూర్మం, తెలంగాణ సికింద్రాబాద్ లోని వానమామలై పీఠం ఆధ్వర్యవం లో నిర్వహించబడుతున్న శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో.. సహా అన్నిప్రధాన సంప్రదాయ దేవాలయాల్లో అత్యంత వైభవంగా ఈ అధ్యయనోత్సవాలు. జరుగుతాయి.
ఈ నెల 19 న ఈ అధ్యయనోత్సవాలు. మొదలయ్యాయి. వీటిలో ముదలాయిరమ్ ( పెరియాళ్వార్ తిరుమొజి), పెరియ తిరుమొజి, ఇయర్ప, తిరువాయ్ మొజి లోని 4000 తమిళ పాశురాలను రాగయుక్తంగా స్వామికి విన్నవించడం జరుగుతుంది. శ్రీరంగం లాంటి క్షేత్రాల్లో అరయర్ ఉత్సవం గా వీటిని నిర్వహిస్తారు. వైష్ణవ స్వాములు, నృత్య గానాలతో తిరువీధి ఉత్సవాలు, నిర్వహిస్తారు. ఈ క్షేత్రాల్లో ఉత్సవ పెరుమాళ్ళ పల్లకిని కేవలం వైష్ణవ స్వాములు మాత్రమే మోయడం జరుగుతుంది.
దివ్యసాకేతం లో..
పరమహంస పరివ్రాజకాచార్య, పద్మభూషణ్ పురస్కార గ్రహీత త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో భాగ్యనగరంలోని దివ్యసంకేతం లో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేదవిద్యార్థులు, అధ్యాపకులు సుస్వర గానంలో నాలాయిర దివ్య ప్రబంధం అనుసంధానం చేస్తున్నారు..
ఆంధ్ర ప్రదేశ్ . . ..
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాస పెరుమాళ్ వేంచేసిన తిరుమల, శ్రీ వరాహ లక్ష్మి నృసింహ క్షేత్రం, సింహాచలం క్షేత్రాల్లో అధ్యయనోత్సవాలు. శుక్రవారం అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.
తిరుమలలో...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జియ్యంగార్లు గోష్ఠిగానం చేస్తారు.
కాగా ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్స్వామి, తిరుమల చిన్న జీయర్స్వామి, జీయర్ మఠం వైష్ణవ స్వాములు, ఆలయ వైదిక సిబ్బంది పాల్గొన్నారు..
తెలంగాణ సికింద్రాబాద్ లోని...
వానమామలై పీఠం ఆధ్వర్యవం లో నిర్వహించబడుతున్న సికింద్రాబాద్ లోని శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో.. అధ్యయనోత్సవాలు సంప్రదాయంపరంగా మొదలయ్యాయి. వాటి వివరాలు: వైకుంఠ ఏకాదశి కు ముందు పగల్ పత్తు, తర్వాత రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి.
మొదటి రోజు : తిరుప్పల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి 1, 2
రెండవ రోజు: పెరియాళ్వార్ తిరుమొళి 3, 4, 5
మూడవ రోజు: తిరుప్పావై, నాచియార్ తిరుమొళి
నాల్గవ రోజు: పెరుమాళ్ తిరుమొళి, తిరుచంద వృత్తం
ఐదవ రోజు: తిరుమలై, తిరుప్పల్లియాగేచూచి, అమలా నధిపిరన్, కన్నినున్ సిరుతంబు
ఆరవ రోజు: తిరుమొళి 1, 2
ఏడవ రోజు: తిరుమొళి 3, 4
ఎనిమిదవ రోజు: తిరుమొళి 5, 6, 7
తొమ్మిదో రోజు: తిరుమొళి 8, 9
పదవ రోజు: తిరుమొళి 10, 11, తిరుకురుందండకం, తిరునెడున్హండకం
తదుపరి రాపత్తు ఉత్సవాలు :
మొదటి రోజు: తిరువాయిమొళి 1
రెండవ రోజు: మొదటి తిరువంతడి. తిరువాయిమొళి 2
మూడవ రోజు: రెండవ తిరువంతడి, తిరువాయిమొళి 3
నాల్గవ రోజు: మూడవ తిరువంతడి, తిరువాయిమొళి 4
ఐదవ రోజు: నాన్ముగన్ తిరువంతడి, తిరువాయిమొళి 5
ఆరవ రోజు: తిరువృత్తం, తిరువాయిమొళి 6
ఏడవ రోజు: తిరువాసిరియమ్, పెరియ తిరువంతడి, తిరువాయిమొళి 7
ఎనిమిదవ రోజు: తిరువెక్కుత్తిరిక్కై, సిరియ తిరుమడల్, తిరువాయిమొళి 8
తొమ్మిదవ రోజు: పెరియ తిరుమడల్, తిరువాయిమొళి 9
పదవ రోజు: తిరువాయిమొళి 10, రామానుస శతజయంతి, ఇయాల్ శత్రు, తిరుప్పల్లాండు
ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యమైనది నమ్మాళ్వార్ల పరమపాదోత్సవం తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. పగల్ పత్తు సందర్భముగా ప్రతి రోజు ఉదయం దేవాలయంలోను, రాపత్తు లో సాయంత్రం వేళల్లో శ్రీస్వామివారి తిరువీధి ఉత్సవములు జరుగుతాయి.
| Date : |
| Ruthuva : |
| Nakshatram : |
| Week : |
| Masam : |
| Amrithakalam : |
| Year : |
| Pakshamvarjam : |
| Samsthram : |
| Ayanam : |
| Tithi : |
| Durumuhratam : |

వాయు కాలుష్య నివారణకై ఎలక్ట్రిక్ వాహనాలు అవసరం:...
*కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య*
*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*
*అమరావతి, నవంబర్ 01, 2021 (డిఎన్ఎస్):* ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. విజయవాడలో అవేరా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ కొత్త వేరియంట్ రెట్రోసాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి వాతావరణ పరిరక్షణకు ఇచ్చిన పిలుపు మేరకు, ఆ దిశగా అవేరా సంస్థ అడుగులు వేయడం శుభపరిణామమన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ఎంచుకున్నందుకు అవేరా బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా అవేరా వ్యవస్థాపకుడు, సీఈవో డా. రమణ, కో ఫౌండర్ చాందిని చందన నాంది పలికారని వెంకయ్య నాయుడు అన్నారు. డా. రమణ మాట్లాడుతూ.. అధునాతన ఫీచర్లతో రూపొందిన రెట్రోసా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 148 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు. బ్లూటూత్ ను అనుసంధానించడం ద్వారా బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్ శాతం, వోల్టేజ్ తదితర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దేశంలోనే ఈ శ్రేణి వాహనాల్లో రెట్రోసా అత్యధిక వేగాన్ని కలిగి ఉందని చెప్పారు. అవేరా ఇప్పటికే యూరప్, ఏషియా పసిఫిక్ దేశాలకు వాహనాల ఎగుమతి చేస్తోందని వివరించారు. 2022 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 140 అవేరా పాయింట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోందని డా. రమణ పేర్కొన్నారు. కార్యక్రమంలో అవేరా ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Oct 1, 2021 2:51 pm
Oct 1, 2021 2:25 pm
Sep 30, 2021 7:44 pm
కెనడాలో - 21 à°¡à°¿à°—à±à°°à±€à°² à°…à°¤à±à°¯à°‚à°¤ కనిషà±à°Ÿ ఉషà±à°£à±‹à°—à±à°°à°¤à°²à±Â ...
Feb 14, 2020 11:41 pm
à°¬à±à°°à°¾à°‚à°ªà±à°Ÿà°¾à°¨à± / విశాఖపటà±à°¨à°‚, à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 14, 2020 (à°¡à°¿à°Žà°¨à±à°Žà°¸à±) : ఉతà±à°¤à°° అమెరికా à°–à°‚à°¡à°‚ లోని కెనడాలో à°—à°² à°¬à±à°°à°¾à°‚à°ªà±à°Ÿà°¾à°¨à± (రాజధాని టొరంటో కౠసమీపంలోనే ) నగరం లో à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 14 ఉదయం 6 à°—à°‚à°Ÿà°² సమయానికే à°…à°¤à±à°¯à°‚à°¤ కనిషà±à°Ÿ ఉషà±à°£à±‹à°—à±à°°à°¤à°²à± -21 à°¡à°¿à°—à±à°°à±€à°²à± నమోదౠచేసà±à°•ోవడం తో నగరం మంచà±à°ªà°°à±à°µà°¤à°¾à°²à°¤à±‹ à°®à±à°¨à°¿à°—ిపోయింది. తెలà±à°—ౠరాషà±à°Ÿà±à°°à°¾à°²à°•ౠచెందిన à°à°¾à°°à°¤à±€à°¯à±à°²à± à°…à°§à°¿à°• శతం ఉండే à°ˆ నగర వీధà±à°²à°¨à±à°¨à±€ మంచౠఖండాలతో నిండి పోవడం తో à°¸à±à°¥à°¾à°¨à°¿à°• à°ªà±à°°à°à±à°¤à±à°µ సిబà±à°¬à°‚ది వీటిని తొలగించే పనిలో పడింది. ఇళà±à°²à°²à±à°²à±‹à°¨à°¿ à°•à±à°³à°¾à°¯à°¿à°²à±à°²à±‹ నీళà±à°²à± సైతం మంచà±à°—à°¾ మారిపోవడం గమనారà±à°¹à°‚. à°ˆ à°•à±à°°à°®à°‚ లో జనజీవన à°¸à±à°°à°µà°‚తి à°•à°¿ ఆటంకం à°à°°à±à°ªà°¡à°¿à°‚ది. విధà±à°²à°•à±, కళాశాలలకౠవెళà±à°²à±‡à°µà°¾à°°à± à°à°¾à°°à±€ à°Žà°¤à±à°¤à±à°¨ ఉనà±à°¨à°¿ à°¦à±à°¸à±à°¤à±à°²à± à°§à°°à°¿à°¸à±à°¤à±‡ గానే ఇంటి à°¨à±à°‚à°šà°¿ కాలౠబయట పెటà±à°Ÿà±† పరిసà±à°¥à°¿à°¤à°¿ లేదà±. వరà±à°·à°‚ à°•à±à°°à°¿à°¨à°Ÿà±à°Ÿà±à°—à°¾ మంచౠà°à°•ధాటిగా పడà±à°¤à±à°‚à°¡à°¡à°‚ గమనారà±à°¹à°‚. ఇళà±à°² బయట పారà±à°•ింగౠచేసే కారà±à°²à± సైతం హిమపాతాలà±à°²à±‹ కూరà±à°•ౠపోతà±à°‚à°¡à°¡à°‚ గమనారà±à°¹à°‚. మైదాన à°ªà±à°°à°¾à°‚తాలà±à°²à±‹ à°à°¾à°°à±€à°—à°¾ à°•à±à°°à°¿à°¸à°¿à°¨ మంచౠపలౠఆకారాలౠదరà±à°¶à°¨à°®à°¿à°¸à±à°¤à±‹à°‚ది.
అయితే à°à°¾à°°à°¤à±€à°¯ వాతావరణానికి పూరà±à°¤à°¿à°—à°¾ à°à°¿à°¨à±à°¨à°‚à°—à°¾ ఉండే ఉషà±à°£à±‹à°—à±à°°à°¤à°²à± కావడంతో à°Žà°•à±à°•à±à°µ మంది à°à°¾à°°à°¤à±€à°¯à±à°²à± à°ˆ సమయంలోనే ఇకà±à°•డకౠచేరà±à°•à±à°¨à±‡ à°ªà±à°°à°¯à°¤à±à°¨à°‚ చేసà±à°¤à±à°‚టారà±.
వివాదాస్పదంగా విధుశేఖర భారతి ఆంధ్ర ప్రదేశ్ యా...
Mar 14, 2026 2:09 pm
శ్రీశైలంలో లీగల్ నోటీసులు, తిరుమలలో ఛత్రం వివాదం.
క్షేత్ర నియమాల ఉల్లంఘనపై మండిపడ్డ గోవిందానంద సరస్వతి
...
Mar 2, 2026 9:20 pm
Feb 19, 2026 10:50 am
Feb 13, 2026 5:51 pm
Jul 31, 2020 8:26 am
Feb 15, 2020 8:11 am
Feb 13, 2020 9:47 pm

Jan 6, 2026 8:58 pm
*గౌరీ రామ్మోహన్ కు సంగీత భారతి పురస్కారం,*
*ఆకట్టుకున్న సద్గురు శ్రీ త్యాగరాజ సప్తస్వరాలంకృతం*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, జనవరి 06, 2026 (డిఎన్ఎస్):* సద్గురు త్యరగరాజా స్వామి 179 ఆరాధనోత్సవాలు విశాఖపట్నం లో మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్, విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సంయుక్త నిర్వహణలో ఏడూ రోజుల పాటు ఈ ఆరాధనోత్సవాలు జరుగనున్నట్టు నిర్వాహక కమిటీ కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ డిఎన్ఎస్ మీడియా కు తెలిపారు. మంగళవారం సాయంత్రం జరిగిన ప్రారంభోత్సవ సభలో ప్రముఖ సంగీత విస్వాసురాలు డా. గౌరీ రామ్మోహన్ కు సంగీత భారతి పురస్కారం అందించారు. అనంతరం వీణా విద్వంసురాలు డా. మాధురి దేవి నిర్వహణలో, శిష్య బృందం చే సద్గురు శ్రీ త్యాగరాజ సప్తస్వరాలంకృతం సంగీత కచేరి నిర్వహించారు.
ఈ సందర్భంగా జి ఆర్ కె ప్రసాద్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా జరుపుతున్న త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఈ ఏడాది సంవత్సరం జనవరి 6 నుంచి 12 వరకూ విశాఖపట్నం లోని మద్దిలపాలెం లో గల కళాభారతి వేదికగా జరుగుతున్నట్టు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా "సంగీత కళాభారతి" ఎం. జలజాక్షి విచ్చేశారన్నారు.
ఈ సంగీత కళాభారతి పురస్కారం ను ఇంతవరకూ ఐ వి ఎల్ శాస్త్రి, డాక్టర్ పంతుల రమ, ఎం.ఎస్.ఎన్ మూర్తి, వంకాయల వెంకటరమణమూర్తి, అరుంధతి సర్కార్, శ్రీమతి ఎం . .జలజాక్షి, గురువిళ్ల అప్పన్న లకు అందించామన్నారు.
ఈ పురస్కారం లో భాగంగా నూతన పట్టు వస్త్రాలు, 10 వేల రూపాయల చెక్కును అందజేశారు.
కార్యక్రమం లో కళాభారతి అధ్యక్షులు మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ కళాభారతి సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకం తో పాటు అన్ని కళలు పోషించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఈ రోజు నుంచి ఏడు రోజులు పాటు జరిగే ఈ వేడుకలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో నగర వాసులు పాల్గొనాలని కోరారు.
బుధవారం ఉదయం వందలాది మంది సంగీత కళాకారులచే తిరువీధి ఉత్సవం జరుగుతుందని, అనంతరం కళాభారతి వేదిక పై త్యాగరాజ ఘన పంచరత్న కీర్తనలు సుమారు 200 మంది కళాకారులూ ఆలపించడం జరుగుతుందన్నారు. వీరి తో పాటు వీణలు, వైలన్, మృదంగం, విద్వాంసులు కచేరి లో పాల్గొనున్నారు. అనంతరం సన్నాయి వాద్యం తో సంగీత కచేరీలు మొదలవుతాయన్నారు. వర్ధమాన కళాకారులూ, నిపుణులు, నిష్ణాతులు ఇలా వివిధ విభాగాల్లో తమ సంగీత కచేరీలను ప్రదర్శించన్నట్టు తెలిపారు. ఈ వేదికకు వచ్చే ప్రతి ఒకరికి భోజన ప్రసాద ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఆఖరి రోజు 12వ తారీఖున రాత్రి 8:30కు హనుమంతుత్సవం, హనుమాన్ చాలీసా, 108 వడల మాల పంచముఖ ఆంజనేయ స్వామి సమర్పణ, చతుర్వేద పారాయణ, మంత్రపుష్పం తో ఏడు రోజులు కార్యక్రమం ముగిస్తుందని చెప్పారు.
ప్రత్యేకంగా తొమ్మిదో తారీఖున రాత్రి 8:30 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుందని కూడా తెలియజేశారు.
కార్యక్రమం లో పంతుల గోపాలరావు, మల్లిక్ దంపతులు, పైడా కృష్ణ ప్రసాద్, సుసర్ల రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.