Jun 3, 2026 10:14 pm
*మోడీ వెనుక 6 ఏళ్ళ అజ్ఞాతవాసం తర్వాత ఉజ్వల భవిత*
*విష ప్రచారం పై పెయిడ్ మీడియా కు పళ్ళు రాలాయా?*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, జూన్ 03, 2026 (డిఎన్ఎస్ ):* ఒక్క సారి ఆగు.. . తమిళ నాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై కు బీజేపీ అధిష్ఠానం సూచన.
ఒక వ్యక్తి సామర్ధ్యాన్ని తెలుసుకోవడానికి ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఒక వ్యవస్థను నిర్వహించవలసిన వ్యక్తి సామర్ధ్యాన్ని పరీక్షించేందుకు ఇంకెన్నో పరీక్షలు ఉంటాయి. అలాంటి పరీక్షలను ఎన్నో సమర్ధవంతంగా దాటుకుని వచ్చిన వ్యక్తి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. అతని ఎంపిక అంత సులభం కాలేదు.
మోడీ వెనుక 6 ఏళ్ళ అజ్ఞాత వాసం తో పాటు గడ్డుకాలం కూడా ఉంది. 1995 - 96 ఒకానొక సమయంలో మోడీ ని గుజరాత్ లోకి అడుగుపెట్టకూడదు అని రాష్ట్రం నుంచి బయటకు పంపేశారు. ఆ సమయంలో ఢిల్లీ లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఒక చిన్న గదిలో ముగ్గురితో గది పంచుకోవలసి వచ్చినా, ఏనాడూ అసహనం చూపలేదు. పార్టీ నిర్ణయించిన నిర్దేశాన్ని మారు మాట్లాడకుండా ఆమోదించారు కనుకనే 2001 లో తిరిగి గుజరాత్ కు పంపవలసి వచ్చింది. అదే రాష్ట్రానికి 12 ఏళ్ళ కాలం ముఖ్యమంత్రిగా కూడా పనిచేయగలిగారు. అయన కి పార్టీ పట్ల ఉన్న నమ్మకం ఆధారంగా మోడీ ని మూడు పర్యాయాలు దేశ ప్రధానమంత్రిగా నియమించగలిగింది. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి దేశ అత్యున్నత హోదా లోకి చేరుకోవడం అంతసులభం కాదు. ఎంతో కఠోర శ్రమ ఉంది.
అదేవిధంగా పార్టీ లో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్లంతా ఎన్నో అవమానాలు ఎదుర్కొని, పడి లేచిన కెరటాలు లాంటివాళ్లు. విద్యార్థి స్థాయి ఉద్యమం నుంచి జీవితాలను మొదలు పెట్టినవారే.
ఇక తమిళ నాడు పూర్వ ఐపీఎస్ అధికారి కుప్పుస్వామి అన్నామలై పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఉద్యోగం నుంచి స్వచ్చంద విరమణ చేసి, నేరుగా పార్టీ లో చేరిన వారు. ఆరేళ్ళ కాలంలో అయన పనితీరు కు ఫలితంగా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. అయితే రెండేళ్ల కాలం తర్వాత పదవి నుంచి తొలగించింది. తదుపరి పార్టీ ఇచ్చిన నిర్ణయాన్ని అన్నామలై పూర్తిగా పాటించారా? అంటే అనుమానమే. తమిళనాడులో బీజేపీ భూస్థాపితం అయినా స్థితి నుంచి 13 % ఓటు బ్యాంకు వచ్చేందుకు అన్నామలై కృషి కారణం. అయినప్పటికీ చట్టసభల్లో సీట్లు సాధించలేకపోయారు. అయితే రాజకీయాల్లో ఎన్నో సమీకరణాలు ఉంటాయి. కొన్ని సార్లు అవి మంచి ఫలితం చూపించవచ్చు. మరొకసారి విఫలం కావచ్చూ.
కొన్ని కారణాల వల్ల సమర్థులైన నాయకులను సైతం ప్రక్కన పెట్టవలసి రావచ్చు. అన్నామలై విషయంలోనూ అదే జరిగింది. ఇతను అసమర్ధుడు అని ప్రక్కన పెట్టలేదు, ఎన్డీఏ కూటమి పార్టీల డిమాండ్ కారణంగా తమిళనాడు ఎన్నికల్లో అన్నామలై ను ప్రక్కన పెట్టడం జరిగింది. అయితే. . ఈ కూటమి వల్ల బీజేపీ కి ఒరిగిందేమీ లేకపోగా ఉన్న 4 ఎమ్మెల్యే సీట్లను సైతం కోల్పోయింది.
ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీ చేరుకున్న అన్నామలై, పార్టీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ తో భేటీ అవ్వడంతోనే కుహనా వాదులు, బీజేపీ వ్యతిరేకులు, పెయిడ్ మీడియా అవాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేసేసారు. అన్నామలై బీజేపీ కి రాజీనామా చేసేస్తున్నారు అంటూ వాళ్ళ అనుకూల మీడియా ఛానెళ్లలో నానా గోల చేశాయి. అయితే అన్నామలై హోమ్ శాఖామంత్రి అమిత్ షా ను కూడా కలిసి మాట్లాడైన ఫొటోల్లో ఇద్దరూ నవ్వుతూ, ఉల్లాసంగా ఉన్నట్టుగా కనపడడంతో ప్రతిపక్షాలు ఖంగు తిన్నాయి. మూడు రోజుల పాటు జరిగిన పెయిడ్ మీడియా హంగామా కు బీజేపీ చర్యలతో ముగింపు పడింది.
May 26, 2026 2:00 pm
*ధన బలమే పార్టీ పదవికి అర్హతా? పనిచేసేవాడికి పనిచేసేవాడికి గుర్తింపు ఉండదా ?*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, మే 26, 2026 (డిఎన్ఎస్ ):* గత రెండు వారాలుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న బొద్దింకలు విపక్షం వే అనుకునే సామాన్య జనానికి జ్ఞానోదయం కల్గించే సందర్భాలు వెలుగు చూస్తున్నాయి.
ఇలాంటి బొద్దింకలను అడ్డుకోవాలంటే. .. భారతీయ జనతా పార్టీ లో దేశవ్యాప్తంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. దశాబ్దాల తరబడి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని నిర్లక్ష్యం చేసి, ధనబలం ఉన్నవాళ్ళకి పార్టీ పదవులు ఇస్తే జరిగే పరిణామమే ఇది.
మోడీ విజయ విహారాన్ని అడ్డుకునేందుకే:
దేశ విదేశాల్లో భారత దేశ ఖ్యాతి ని ఇనుమడింపచేసేందుకు అవిశ్రాంత కృషి చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ విజయవిహారాన్ని అడ్డుకునేందుకు వెలుగులోకి వచ్చిందే బొద్దింకలు జనతా పార్టీ. ఇది కేవలం తాటాకు చప్పుళ్ళు చెయ్యడానికి, యువతను తప్పుదారి పట్టించేందుకు ప్రతిపక్ష పార్టీలు మొదలు పెట్టాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీని వెనుక దేశ విద్రోహ శక్తులు, విదేశీ విధ్వంస శక్తులతో పాటు, లపాకిస్తాన్ ఉగ్రవాద శక్తులు ఉన్నాయనే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. అయితే. . ఇంతవరకూ ఇది కేవలం సోషల్ మీడియా కు మాత్రమే పరిమితం అయ్యింది. దీన్ని కార్యాచరణ రూపం లోకి తీసుకు వచ్చే సత్తా విపక్షాలకు లేదంటూ అధికార కూటమి తెలియచేస్తోంది.
విపక్షాలకు అంత సత్తా ఉందా? :
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ప్రస్తుత నేతల్లో అగ్రస్థానం లో ఉన్న నరేంద్ర మోడీ ని గద్దె దింపే సత్తా విపక్షాలకు లేదు అనేది ఏనాడో తేలిపోయింది. అందుకే విదేశీ విద్రోహ శక్తులు, ఉగ్రవాద శక్తులతో చేతులు కలిపి, భారత దేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు విపక్షాలు చేతులు కలిపి బొద్దింకలుగా ఒక్క చోట చేరినట్టు ఘాటైన విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే వీళ్ళ తో పాటు కొన్ని స్వపక్ష శక్తులు కూడా ఈ బొద్దింకలకు సహకరిస్తున్నాయా అనే అనుమానాలూ లేకపోలేదు. మోడీ హవా ను తగ్గించేందుకు విపక్షాలు పంపిన వేగులు కూడా ప్రస్తుత పదవుల్లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
అధ్యక్ష మార్పులే నేల నాకించేసాయి..:
ప్రధానంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్, అస్సోమ్ మినహా తమిళ్ నాడు, కేరళ సహా మిగిలిన చోట్ల పార్టీ ఆతీ గతీ లేకుండా పోయింది. దీనికి కారణం స్థానికంగా పార్టీలో జరిగిన కుట్రలు, కుతంత్రాలు అనే నమ్మకం ప్రజల్లోనే బలంగా ప్రచారంలోకి వెళ్ళింది. ముఖ్యంగా తమిళ నాడు లో కొందరు ధూర్తుల చెప్పుడు మాటలు విని రాష్ట్ర అధ్యక్ష పదవి ని మార్చడం తో బీజేపీ ఘోరంగా దెబ్బతింది అనే విషయం బట్టబయలు అయ్యింది. అయినప్పటికీ పార్టీ అధిష్టానం లో ఎటువంటి మార్పు రాకపోవడంతో పాటు, క్షేత్ర స్థాయి లో పనిచేసే సామాన్య కార్యకర్తలకు సైతం ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వక పోవడం క్యాడర్ లో కూడా అసహనాన్ని పెంచింది.
అదే విధంగా తెలంగాణ లో సైతం పార్టీ ని అస్తవ్యస్తం చేస్తూ అధ్యక్ష పదవిని మార్చడం తో క్యాడర్ లో అసహనం పెరిగిపోయింది. తద్వారా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోగా, ఓటు బ్యాంకు సైతం ఇతర పార్టీలకు తరలిపోయింది. దీంతో తెలంగాణ లో బీజేపీ తలా ఎత్తుకునే స్థితి లేకుండా అయ్యింది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ బ్రతికే ఉందొ లేక భూ స్థాపితం అయ్యిందో వాళ్ళకే తెలియకుండా పోయింది. కనీసం ఒక వార్డ్ స్థాయి లో కూడా గెలవలేని అనామకుల చేతిలో పార్టీ పగ్గాలు పెట్టడంతో పార్టీ ని పూర్తిగా నేల నాకించేశారు. పేరుకే కూటమి ప్రభుత్వం లో ఉన్నాం అనే మాటే తప్ప, ప్రధాన పార్టీ కి తోక పార్టీ లాగా మారిపోయింది అనేది సగటు కార్యకర్తల అభిప్రాయం. దశాబ్దాల తరబడి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవ్వరూ ప్రస్తుతం పార్టీ పదవుల్లో లేకపోవడం గమనార్హం. ధనబలం ఉన్నవాళ్ళకి మాత్రమే పార్టీ లో పదవులు లభిస్తాయి అనే మాట ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ కార్యకర్తల్లో బలంగా నాటుకు పోయింది.
దశాబ్దాలు కష్టపడి పనిచేసినా, తగిన గుర్తింపు లేకుండా, అనామకులుగా ఉన్న వాళ్ళల్లో నిరాశ, నిస్పృహ పేరుకుపోయి ఉన్నాయి.
ఇలాంటి తరుణంలో అసహనం కల్గిన స్వపక్షం వాళ్ళు సైతం బొద్దింకలు గుంపు ను అడ్డుకునే ప్రయత్నం చేయరు అనేది తెలిసిన విషయమే. ఇది పూర్తిగా స్వయం కృతాపరాధమే.
త్రిప్పి కొట్టే నాధుడే కరువు :
విదేశీ విద్రోహ శక్తుల సహకారం తో మొదలైన బొద్దింకలు విహారానికి అడ్డుకట్ట వేయవలసిన భాద్యత బీజేపీ లోని నిబద్దత కల్గిన ప్రతి కార్యకర్తకూ ఉంది. అయితే పార్టీ నియమాల ప్రకారం పార్టీ పదవుల్లో ఉన్నవారే సామాజిక మాధ్యమాల్లో గానీ, ప్రసార మాధ్యమాల్లో గానీ వ్యాఖ్యానించడాలు, విమర్శించి, అడ్డుకట్ట వెయ్యడాలు చెయ్యాలి. ప్రస్తుతం పదవుల్లో ఉన్నవాళ్ళకి అది చేతగాదు, పైగా ధనబలం తో పదవిలోకి వచ్చినవాడు, తిరిగి సంపాదించేందుకు చూస్తాడు తప్ప, పార్టీ పరువు, ప్రతిష్టల కోసం ఏమి ఆలోచిస్తాడు అనేది సగటు కార్యకర్తల అభిప్రాయం.
| Date : |
| Ruthuva : |
| Nakshatram : |
| Week : |
| Masam : |
| Amrithakalam : |
| Year : |
| Pakshamvarjam : |
| Samsthram : |
| Ayanam : |
| Tithi : |
| Durumuhratam : |

భారత రత్న పీవీ కి అర్చక, పురోహిత బ్రాహ్మణ సంఘం ...
Jun 28, 2026 10:27 pm
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
విశాఖపట్నం, 28 జూన్ 2026 (DNS ): భారత దేశాన్ని అట్టడుగు స్థాయి నుంచి ఆర్ధిక ప...
Jun 28, 2026 6:24 pm
Jun 23, 2026 4:49 pm
Jun 7, 2026 3:54 pm

Jun 6, 2026 5:09 pm
అన్నామలై పోతే పార్టీ కి దమ్మిడీ నష్టం లేదు : bjp
గతం లో తమిళనాట భారీ క్యాడర్ ఉండేది కదా ఇప్పుడుపోడానికి?
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, జూన్ 05, 2026 (డిఎన్ఎస్ ):* ఏ ఐ డీఎంకే తో పొత్తు కోసం అత్యంత ప్రజాదరణ కల్గిన యువ ఐపీఎస్ కె. అన్నామలై ను పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ తన్ని తగిలేసిందా ? అంటే అవుననే తెలుస్తోంది. పైగా అన్నామలై పార్టీ నుంచి బయటకు పోయినా మాకు ఎటువంటి నష్టం లేదు అంటూ బీజేపీ ప్రకటించింది. తమిళనాడు లో ఇంతకూ ముందు బీజేపీ కి భారీ క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్నట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చింది. కనీసం జండా మోసేవాడు కూడా లేని పార్టీ లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీ తిరోగమనం కాక మరేమి అవుతుంది.
ఈ నిర్ణయం 2025 లోనే నిర్ణయం అయిపొయింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎఇ డీఎంకే తో పొత్తుకు సిద్దపడింది. అక్కడ నుంచే అన్నామలై కి బీజేపీ కుట్ర మొదలయ్యింది. కేవలం 2 % ఓట్లు మాత్రమే ఉన్న తమిళనాడు లో బీజేపీ కి 13 % కి ఓటు బ్యాంకు పెంచడంతో అన్నామలై పై ఏఐడీమెకే తో పాటు, స్థానిక బీజేపీ నేతల్లో సైతం ఈర్ష్య పెరిగిపోయింది. భారీ ప్రజాదరణ ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా పార్టీ నుంచి బయటకు తన్ని తగిలిస్తే. . ఈ పడే నాలుగు ఓట్లు కూడా పడవు అనే ఉద్దేశం తో ముందుగా అన్నామలై ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. దీనికి కారణం ఏఐడీఎంకే , పొత్తుకోసం అది పెట్టిన మొదటి కండిషన్ అన్నామలై ని బీజేపీ నుంచి తప్పించాలి. ఎక్కడా టికెట్ ఇవ్వకూడదు, అతనికి ఎటువంటి పదవి ఇవ్వకూడదు. ఏ ఐ డిమెకే తో మత్తులో ఉన్న బీజేపీ వీటన్నింటికీ ఒప్పేసుకుని, అన్నామలై ని పూర్తిగా డమ్మీ ని చేసేసింది. దీంతో ఎన్ని లక్ష్యాలతో పనిచేద్దామని బీజేపీ లోకి వచ్చిన అన్నామలై కి పూర్తి భంగపాటు ఎదురయ్యింది. దీంతో 2025 లోనే రాజీనామా చెయ్యాలని నిర్ణయం తీసుకున్న అన్నామలై ని ఎన్నికల వరకూ ఆగమని అమిత్ షా కోరడం తో అధిష్ఠానం పై గౌరవం తో జూన్ 2026 వరకూ వేచియున్నారు.
ఓటమి పాలైన నాయ్ నార్ ఎందుకు రాజీనామా చెయ్యలేదు?
ఏ ఐ డి ఎంకే తో కలిసి పోటీ చెయ్యడానికి పూర్తి కారణమైన ప్రస్తుత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాయ్ నార్ నాగేంద్రన్ ఎందుకు రాజీనామా చెయ్యలేదు అని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళ స్వార్ధ కూటమి వల్ల 4 సీట్లు ఉన్న బీజేపీ ఈ కూటమి వల్ల 1 సీటుకు మాత్రమే పరిమితం అయ్యింది. దీని కి పూర్తి భాద్యత నాగేంద్రన్ దే . 13 % ఓటు బ్యాంకు సాధించి పార్టీ క్యాడర్ పెంచిన అన్నామలై ను పార్టీ నుంచి బయటకు తన్ని తగిలేసి, పూర్తి ఓటమి కి కారణమైన నాగేంద్రన్ ను అందలం ఎక్కించిన ఘనత బీజేపీ అధిష్టానం దే.
ఇన్ని అవమానాలు మౌనంగా భరించిన అన్నామలై ఆఖరి అస్త్రంగా ఢిల్లీ కి వెళ్లి పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ , అమిత్ షా లను కలిసి మాట్లాడిన తర్వాత కూడా ఎటువంటి మార్పు లేకపోవడంతో ఇక రాజీనామా కు సిద్ధపడ్డారు.
పొమ్మన లేక పొగబెట్టడం అంటే ఇదే .
పార్టీలకు అతీతంగా అభిమానులు.
ఢిల్లీ లో పార్టీ కి రాజీనామా చేసి, తిరిగి చెన్నై కి వచ్చిన అన్నామలై కు విమానాశ్రయం లో పార్టీలకు అతీతంగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అతని జన్మదినం సందర్భంగా జూన్ 5 న ఒక భారీ ప్రకటన చేసారు. క్షేత్ర స్థాయి లో ప్రజలని కలుసుకుని, సమస్యలను తెలుసుకుని, పరిష్కార మార్గాలు చూపించనున్నట్టు తెలిపారు. వెంటనే ఈయన ప్రకటించిన సంస్థ లో 10 లక్షలకు పైగా సభ్యులు చేరడం జరిగింది. దీనిలో యువత, మహిళలు, మేధావులు, బీజేపీ లో భంగపడ్డ అభిమానులు భారీ సంఖ్యలో చేరుతుండడం గమనార్హం.
స్వయంకృతాపరాధం :
తమిళ నాడు ఫైర్ బ్రాండ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామా చెయ్యడం తో తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని, భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అతి తక్కువ సమయంలో లక్షలాది మంది అభిమానాన్ని పొందిన అన్నామలై అభిమాన ఫాలోయింగ్ ఎలా ఉందొ చూసిన తర్వాత కూడా బీజేపీ తీసుకున్న నిర్ణయం తప్పు అనే భావన ఢిల్లీ అధిష్టానం లో ఏ కోశానా కనపడడం లేదు. అస్సలు తమిళనాడు లో పార్టీ జండా మోసేవాడే లేకపోయినా బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తోంది. అతను బయటకు పోతున్నా కనీసం తీసుకోవాల్సిన భాద్యత చేపట్టలేక పోవడం అధికార మదం కనపడుతోంది. 18 రాష్ట్రాల్లో పార్టీ అధికారం లో ఉంది కేంద్రంలో ప్రభుత్వానికి ఏమాత్రం ఢోకా లేదు అనే భావన అధిష్ఠానం పెద్దల్లో బలంగా నాటుకుపోయింది. అయితే అన్నామలై విషయంలో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ ని పాతాళానికి తొక్కేసేలా ఉందని సామాన్య కార్యకర్తలకు తెలిసింది, పార్టీ అగ్రనేతలకు తెలియలేదు.
అయితే తమిళనాడు లో బీజేపీ అనేది ఒకటి బ్రతికి ఉంది అని ప్రపంచానికి తెలియచేసింది మాత్రం అన్నామలై నే అనేది అక్షర సత్యం.
బీజేపీ ద్వారా సమాజానికి మంచి కార్యక్రమాలు చెయ్యాలి అనే సంకల్పంతో ఒక సుదీర్ఘ ప్రణాళిక తో పార్టీలోకి వెళ్లిన అన్నామలై కి పూర్తిగా ఆశాభంగం కల్గింది.