తాజా వార్తలు
  • దేవస్థాన ట్రస్టీలుగా ఎంపికైన విప్రులకు అభినందనలు: పూడిపెద్ది శర్మ

    May 16, 2026 1:06 pm

    *సంప్రదాయ వైభవ సారధులకు శుభాకాంక్షలు : DNS Media*

    (DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

    *విశాఖపట్నం, మే 16, 2026 (డిఎన్ఎస్ ):* మహా విశాఖపట్నం పరిధిలోని ప్రధాన దేవాలయాల కమిటీల్లో ట్రస్టీలుగా నియమితులైన బ్రాహ్మణ ప్రముఖులకు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మఠ్ మందిర్ ప్రముఖ్  పూడిపెద్ది శర్మ అభినందనలు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు అయినా శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం లో ప్రత్యేక ఆహ్వానితులుగా వేదుల దక్షిణామూర్తి ( భారతీయ జనతా పార్టీ, విశాఖపట్నం ), సుసరాపు గణపతి శర్మ ( తెలుగుదేశం, విజయనగరం), ఇసుక కొండ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ట్రస్టీ గా  వేదుల హనుమంత రావు ( తెలుగుదేశం, విశాఖపట్నం), శ్రీ కనక మహాలక్ష్మి  అమ్మవారి దేవస్థానం ట్రస్టీ గా రాపర్తి శైలజ ( మాజీ కార్పొరేటర్, తెలుగుదేశం), శ్రీ దుర్గాలమ్మ దేవస్థానం ట్రస్టీ గా   సత్యవోలు ఆనంద రావు ( తెలుగుదేశం ) తదితరులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడం హర్షణీయమన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం లో ప్రతినిధులుగా వీరు ఆయా దేవస్థానాల్లో సంప్రదాయ కార్యక్రమాలను మరింతగా అభివృద్ధి పరిచేందుకు కృషి చెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా వీరందరికి హార్దిక శుభాకాంక్షలు పూడిపెద్ది శర్మ తెలియచేసారు. 

    సంప్రదాయ వైభవ సారధులకు : DNS Media  

    సనాతన సంప్రదాయ వైభవాన్ని మరింత గా పరిరక్షించేందుకు బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రతినిధులకు వివిధ దేవాలయాల నూతన కమిటీల్లో సభ్యులుగా నియమించడం పట్ల  DNS Media ధార్మిక న్యూస్ సంస్థ  అభినందనలు తెలియచేస్తోంది. ఇటీవల కాలం లో సనాతన ధర్మం పై కొందరు ధూర్తులు, సంఘ విద్రోహ శక్తులు అవాకులు చెవాకులు ప్రేలుతున్న సందర్బంలో  దేవాలయాలను మరింత పటిష్టం చెయ్యడం కోసం వీరు కృషి చెయ్యగలరు అని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.   

  • 1967 లో ఇందిరా చెప్తే లేవని నోళ్లు, మోడీ చెప్తే ఎందుకు ఏడుస్తున్నాయి?

    May 12, 2026 1:43 pm

    *దేశ ఆర్ధిక భద్రతా కోసమే. . బంగారం కొనవద్దు ప్రధాని పిలుపు...*

    (DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

    *విశాఖపట్నం, మే 12, 2026 (డిఎన్ఎస్ ):* ఒక ఏడాది పాటు బంగారం కొనవద్దు అని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇవ్వగానే. . .దేశం లోని వ్యతిరేకశక్తులన్నీ నోరు పట్టుకుని విరుచుకు పడ్డాయి .  అంతర్జాతీయ ఆంక్షల పరిస్థితుల నేపథ్యంలో ఒక ఏడాది పాటు మనం జాగ్రత్తగా ఉండాలి అని మోడీ తెలియచేసారు. అయితే ఈ దేశంలో ఉంటూ.. ఈ దేశం లో తింటూ.. ఈ దేశ అభివృద్ధి కోసం ప్రధాని ఇచ్చిన పిలుపు ను మాత్రం అత్యంత దారుణంగా విమర్శిస్తున్నాయి.  ఇప్పుడు మోడిని విమర్శిస్తున్న ఖాన్ గ్రెస్,  కమ్యుని(కి)ష్టులు, 1967 జూన్ 6 నాడు ఇదే పిలుపు ఇచ్చిన నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ని ఎందుకు ప్రశ్నించలేదు. అప్పుడు గొర్రెల్లా తలూపిన వీళ్ళకి ఇప్పుడు పరిస్థితి తెలియదా. .  ఏదో పెద్ద రోజుకో కేజీ  బంగారం కొనే మొహాలు వీళ్ళూనూ.. 

    అసలు ప్రధాని ఇచ్చిన పిలుపు ఎందుకు?
    పశ్చిమ దేశాల మధ్య జరుగుతున్నా యుద్ధ వాతావరణం నేపథ్యంలో అమెరికా బంగారం దిగుమతులపై అధిక పన్నులు విధించి, భారత్ పై అదనపు భారాన్ని మోపింది. అదే నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ తదితర ఇంధన ఉత్పత్తులపై అరబ్ దేశాలు పన్నులు మోత  మ్రోగిస్తున్నాయి. వీటన్నింటీ నీ భారత్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ మారకం పైనే జరుగుతాయి. 
    వీటిని కొంతకాలం తగ్గించుకుంటే. . డాలర్ మారకం తగ్గుతుంది. భారత్ పై ఆర్ధిక భారం తగ్గుతుంది. అనవసరం గా బంగారం కొనడం వల్ల  భారత ధనం  డాలర్ల రూపంలో అమెరికాకు చేరుతుంది. పెట్రో ఉత్పత్తులు కొనడం వల్ల  ధనం  డాలర్ల రూపంలో అరబ్ దేశాలకు చేరుతుంది. వీటిని కొన్నాళ్ళు తగ్గించడం వలన , భారత్ నుంచి వెళ్లే డాలర్ల సంఖ్యా తగ్గుతుంది. భారత్ విలువ అమెరికాకు, అరబ్ దేశాలకు తెలుస్తుంది. అని భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ మాటపై  ఖాన్ గ్రెస్, కమ్యుని (కి)ష్టులు నోటికి వచ్చిన విమర్శలు పేలుతున్నాయి. 
    సరిగ్గా ఇలాంటి పరిస్థితులే 1967 లో వచ్చ్చాయి. జూన్ 6 , 1967 న  నాటి భారత దేశ  ప్రధాన మంత్రి ఇందిరా బంగారం కొనవద్దు అని  ప్రజలకు పిలుపు ఇచ్చారు. అదే విషయాన్నీ, హిందూ దినపత్రిక ప్రధాన వార్తగా ప్రచురించింది. 

    బంగారం కొనవద్దు, ప్రజలకు ఇందిర 1967 లో పిలుపు; 

    'జాతీయ క్రమశిక్షణ' పాటించాలని విన్నపం విదేశీ మారక ద్రవ్యం పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉంది:  ఏ రూపంలోనూ బంగారం కొనవద్దని, దేశంలో బంగారు వినియోగం విషయంలో  "జాతీయ క్రమశిక్షణ" పాటించాలని ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నేడు ప్రజలకు హృదయపూర్వక విన్నపం చేశారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిలో భాగంగానే ఈ విన్నపం చేశారు. 

    అందులో  విమర్శకుల నుంచి  ఒక్క విమర్శ కూడా లేదు.  పైగా అన్ని వర్గాలూ ఈ ప్రకటనను  పూర్తిగా సమర్ధించాయి.. మరి అదే పరిస్థితులు ఉన్న నేడు అదే భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కొంతకాలం  బంగారం కొనవద్దు అని పిలుపు ఇస్తే. . .నేటి పత్రికల్లో స్వయం ప్రకటిత  మేతావులు, విమర్శకులు అనేక ప్రేలాపనలు  ప్రేలుతున్నారు. పైగా దిక్కుమాలిన సోషల్ మీడియా లో దారుణంగా దూషణలు కూడా మొదలు పెట్టేశాయి.  

    అదే పరిస్థితులు - -  ప్రధాని ఒక ప్రకటన ఇస్తే. . .సమర్ధించిన విమర్శకులు,  అలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని అదే ప్రకటన చేస్తే. . .
    అసలు సొంతంగా పనిచేసి దమ్మిడీ కూడా సంపాదించలేని చవటలు, దేశ విద్రోహ శక్తులు విదిలించే  ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడుతున్న వాళ్ళు నోటికి వచ్చిన ప్రేలాపనలు చేస్తున్నారు అంటే. . . ఈ విమర్శకుల వెనుక ఉన్న దేశ విద్రోహ శక్తులను అరెస్ట్ చేసి, విచారణ జరపవలసిన అవసరం ఉంది అని జాతీయ వాదులు అభిప్రాయపడుతున్నారు. 

  • కమ్యూనిస్ట్ లు, ఖాన్ గ్రెస్ లు బీజేపీ కి , మోడీ కి ధన్యవాదాలు చెప్పాలి

    May 10, 2026 5:49 pm

    *15 ఏళ్లుగా టిఎంసీ గూండాల కబ్జా లో సిపిఎం, ఖాన్ గ్రెస్ ల పార్టీ ఆఫీసులు* 

    *ఒక్కొక్కటిగా నేడు స్వాధీనం అవుతున్న సంఘటనలు*

    (DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

    *విశాఖపట్నం, మే 10, 2026 (డిఎన్ఎస్ ):* పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అధికారం లోకి రావడం పట్ల సనాతన హిందూ, బీజేపీ వర్గాల కంటే కమ్యూనిస్ట్ లు, ఖాన్ గ్రెస్ లు ఎక్కువగా సంతోషపడుతున్నట్టు తెలుస్తోంది. సూర్ఫణఖ పరిపాలనలో గత  15 ఏళ్ళ నుంచి సిపిఎం, ఖాన్ గ్రెస్ పార్టీ ల కార్యాలయాలను త్రిణమూల్ ఖాన్ గ్రెస్ గూండాలు కబ్జా చేయడం జరిగింది. ఈ 15 ఏళ్ళ ల్లో కనీసం ఈ ఆఫీసుల  గుమ్మం లోకి కూడా ఈ రెండు పార్టీల వాళ్ళు అడుగు కూడా పెట్టలేకపోవడం అత్యంత దారుణం. ఒక్కసారిగా ప్రజల్లో ప్రజా ఉద్యమం రావడం, భారతీయ జనతా పార్టీ అధికారం లోకి రావడం తో ప్రతిపక్ష పార్టీలైనా కమ్యూనిస్ట్ లు, ఖాన్ గ్రెస్ పార్టీల సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. 15 ఏళ్లుగా టిఎంసి గూండాల కబ్జాలో ఉన్న తమ పార్టీ కార్యాలయాలను ఉత్సాహంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంబరాలు పశ్చిమ బెంగాల్ మొత్తం కనపడింది. గతం లో ఇదే ఖాన్  గ్రెస్, కమ్యూనిస్ట్ ల పాలనలో హిందువులు ప్రత్యక్ష నరకం అనుభవించిన విషయం తెలిసిందే. ఇలాంటి వాళ్ళకే నరకం చూపించారంటే టిఎంసీ  పరిపాలన లో ఎన్ని అకృత్యాలు జరిగాయో తెలుస్తోంది.  

    పార్టీల అభిమతం వేరు అయినా, వాళ్ళు గెలవడం వల్లనే వీళ్ళ పార్టీ కార్యాలయాల్లోకి అడుగు పెట్టగలిగాం అని ఆఫ్ ది రికార్డు లో తెలియచేస్తున్నారు. ఇన్నాళ్లు రాక్షస పాలనలో ఎన్నో అవస్థలు పడ్డామని, కనీసం తమ పార్టీ అభ్యర్థులకు ప్రచారం కూడా చెయ్యలేని దుస్థితి లో ఉన్నామని తెలియచేస్తున్నాయి. నేటి ప్రజా ఉద్యమం పశ్చిమ బెంగాల్ భవితకు తొలిబాటగా అందరూ అభివర్ణిస్తున్నాయి. 

Panchangam - May 23, 2026

Date :
Ruthuva :
Nakshatram :
Week :
Masam :
Amrithakalam :
Year :
Pakshamvarjam :
Samsthram :
Ayanam :
Tithi :
Durumuhratam :

Today Vizag Events - May 23, 2026

ఆంధ్ర ప్రదేశ్
view more..
రాజకీయo
view more..

వీడియోలు
International
view more..
Movie News
view more..
విశాఖ వార్తలు
సింహాచలం భూముల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత, వ...

May 22, 2026 3:48 pm

*అడవివరంలో చర్చ్ కూడా కూల్చండి: రాష్ట్ర ప్రముఖ్ పూడిపెద్ది* 

*DNS వార్త కు స్పందనగా అక్రమ కట్టడాల కూల్చివేత*

view more..
Competitive Exams in India
Sports
view more..
National News
view more..