DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జివిఎంసి నిర్లక్ష్యంతో అధ్వాన స్థితిలోకి సుందరనందనాలు 

*నిధుల లేమితో అడుగంటిపోతున్న విశాఖ లోని పార్కులు* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 11, 2020  (డి ఎన్ ఎస్):* దేశంలోనే అత్యంత సుందర నగరంగా విశాఖ ను తీర్చిదిద్దాలి అని ప్రతి చోట్ల ఆర్భాటంగా ప్రచారం చేసుకునే గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్

ఉన్నతాధికారుల నిర్లక్ష్య కారణంగా విశాఖలోని సుందరనందనాలు అష్ట దరిద్రంగా మారుతున్నాయి.  ఆధునికీకరణ, సుందరీకరణ పేరుతొ కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి మెహర్బానీ ప్రకటించుకునే జి వి ఎం సి అధికారులకు నగరంలోని పార్కులు గతి ఏమాత్రం పట్టడం లేదు. ఆసియాలోనే అత్యంత అందమైన కోలనీగా పేరు పొందిన ఎంవిపి కోలనీలోని సెక్టార్ 2

లో గల పార్కులు అధికారుల కారణంగా చిన్న పాటి అటవీ ప్రాంతంగా మారిపోతున్నాయి. దీనికి నిదర్శనమే ఒక పార్కు లోని బెంచీల్లో సైతం పెద్ద సైజు పిచ్చి మొక్కలు పెరగడం, ఆటవస్తువులు సైతం కీకారణ్యంలో మునిగిపోవడం. వాకింగ్ చెయ్యాల్సిన పాటు లు అస్తవ్యస్తంగా మారడం. 
వీటిని పరిశుభ్రం చెయ్యాల్సిన కార్పొరేషన్ సిబ్బంది అస్సలు ఈ

సెక్టార్ లో పార్కులు ఉన్నాయనే విషయమే మరిచిపోయారు. ఉదయాన్ని నగర పర్యటన చేసే జివిఎంసి కమిషనర్ సైతం ఈ పార్క్ పై ద్రుష్టి సరిన్చాలేదనే విమర్శలు స్థానికుల నుంచి వెలువడుతున్నాయి. ఈ చిన్నపాటి కీకారణ్యం కారణంగా మనుషులు సంచరించవల్సిన ఈ పార్కుల్లో పందులు, కుక్కలు, ఇతర జంతుజాలాలు తిరుగడుతున్నాయని స్థానికులు ఆవేదన

చెందుతున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam