DNS Media | Latest News, Breaking News And Update In Telugu

17 నుంచి ఏపీలో చిన్న జీయర్ స్వామి రాష్ట్ర వ్యాప్త పర్యటన 

*ఆలయాల ధ్వంసం పై చిన్న జీయర్ స్వామి సీరియస్.* 

*అందరిని కలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్త ఆధ్యాత్మిక ఉద్యమం* 
 
*హిందూ చైతన్యం కోసమే ఈ యాత్ర, అందరూ ఆహ్వానితులే* 
   
*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 04, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ గత కొన్ని

నెలలుగా వెలుగు చూస్తున్న ఆలయాల ధ్వంసం ఘటనల నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు చిన్న జీయర్ స్వామి తీవ్రంగా స్పందించారు. ఈ నెల 17 న ప్రారంభం కానున్న ఈ పర్యటన ద్వారా హిందూ సమాజాన్ని చైతన్య పరుస్తూ, రాష్ట్ర వ్యాప్త పారాయణ చేయనున్నట్టు ప్రకటించారు. పీడిత దేవాలయాలను సందర్శించి, ఆలయాల రక్షణ

విషయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, దీర్ఘ కాలిక చర్యల గురించి స్థానికులతో సలహా సంప్రదింపులు జరుగుతారు. 

హిందూ చైతన్యం కోసమే . .. 

హిందూ సమాజాన్ని మరింత జాగృతం చేసి, చైతన్యం పారించేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టు  అందరికీ వికాసతరంగిణి సంఘటన కార్యదర్శి భవాని ప్రసాద్ తెలిపారు. హిందూ

సమాజంలోని ఆధ్యాత్మిక సంప్రదాయపరులనందరినీ కలుపుకుంటూ భారీ ఎత్తున జరిగే ఈ ఆధ్యాత్మిక ఉద్యమం లో పెద్ద సంఖ్యలో హిందూ దేవాలయాల పట్ల శ్రద్ధ కలవారందరినీ ఈ యాత్రలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర వివరాలను త్వరలోనే తెలియచేస్తామని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam