DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సోలార్ పవర్ తో విద్యుత్ బిల్లులకు చెక్: రాజమండ్రి ఎంపీ భరత్

*పోలవరం ప్రధాన కాల్వ గట్లపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు* 

*సీలేరు నుంచి పగో జిల్లాకు కొత్త లైన్ ప్రతిపాదన :* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 04, 2020 (డిఎన్ఎస్):* సోలార్ విద్యుత్ ద్వారా విద్యుత్ చార్జీల భారం తగ్గే విధంగా దృష్టి సారించాలని, ప్రభుత్వ ఖాళీ

స్థలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని రాజ మహేంద్ర వరం ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గా నీ భరత్ రామ్ ట్రాన్స్ కో అధికారులకు సూచించారు. సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి కొత్త లైన్ ఏర్పాటు, పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్ సబ్ స్టేషన్లు, విద్యుత్ సమస్యల పరిష్కారం పై

పశ్చిమగోదావరి జిల్లా ఎస్ ఈ జనార్ధన రావు, ఈ ఈ శ్యామ్ బాబు తదితర అధికారులతో సమీక్షించారు. ఎంపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించి , భూసేకరణ తదితర అంశాలను గౌ. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసు కెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. 460 కేవీ విద్యుత్ లోయర్ సీలేరు నుండి

వస్తుంది కాబట్టి 2వ లైన్ వేయాలనే ప్రతిపాదన పై చర్చించారు. నూతన సాంకేతిక విధానంలో హై ఓల్టేజ్ డిస్ట్రిబ్యూటరికి సంబందించి చర్చించారు. 210 మెగావాట్ల రెండు లైన్లు కు సంబంధించి ఎస్ ఈ జనార్ధన రావు వివరించారు. కొత్తగా నిర్మించే 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు పై వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు లో ఏర్పాటైన

పారిశ్రామిక వాడ ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పారిశ్రామికంగా ఏర్పాటు చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలకు కూడా దోహద పడుతుందనీ ఎంపీ భరత్ రామ్ సూచించారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ, చాలా చోట్ల
సమాంతరంగా వెళ్లే తాడిపూడి కాల్వ గట్లపై సోలార్ పవర్ ప్లాంట్ లను ఏర్పాటు చేసే దిశగా గౌ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి

దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని ఎంపీ భరత్ రామ్ చెప్పారు. చాలా చోట్ల బండ్ భూములు, మట్టి కోసం సేకరించిన డంపింగ్ యార్డ్ భూముల్లో నూ వృధా గా వున్న భూములను సోలార్ విద్యుత్ ప్లాంట్ లకు వినియోగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందనీ వివరించారు. ఇరిగేషన్ కాల్వ గట్లపై సోలార్ విద్యుత్ ప్లాంట్ లు ఏర్పాటు చేసేందుకు, అదే విధంగా సోలార్

పార్క్ లను ఏర్పాటు చేసేందుకు ముఖ్య మంత్రి దృష్టికి తెచ్చేందుకు కృషి చేస్తాననీ ఎంపీ భరత్ రామ్ చెప్పారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ, తాడిపూడి కాల్వ గట్లపై సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే దాదాపు 1000 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగవచ్చని ఎంపీ భరత్ రామ్ చర్చించారు. సోలార్ విద్యుత్ ను అభివృద్ధి చేసుకోగలిగితే

విద్యుత్ చార్జీల భారాన్ని అధిగమించ డమే కాకుండా గ్రిడ్ కూడా అనుసంధానం చేసి ఆదాయం పొందే అవకాశం వుందని ఎంపీ భరత్ రామ్ అన్నారు. 
దీనికి తోడు ఎక్కడికక్కడ అనువైన ప్రదేశాలను సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు గా మార్చుకొగలితే విద్యుత్ ను ఆదా తో పాటు చౌకగా సోలార్ విద్యుత్ ను అందుకోవడం జరుగుతుందని ఆ దిశగా అధికారులు

సోలార్ విద్యుత్ పై కూడా దృష్టి సారించాలన్నారు. ఎక్కడికక్కడ పారిశ్రామిక స్థాయిలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయగలిగితే ఉద్యోగ అవకాశాలతో పాటు, జీడీపీ వృద్ధిరేటు పెరిగేందుకు కూడా దోహద పడుతుందని, డొమెస్టిక్ విద్యుత్ చార్జీల భారాన్ని అధిగమించగల మని ఎంపీ భరత్ రామ్ విద్యుత్ అధికారులతో చర్చించారు. పశ్చిమ

గోదావరి జిల్లాలో విద్యుత్ అభివృద్ధి పై తగు సూచనలు, సలహా ఇస్తూ అధికారులతో మాట్లాడారు. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే లతో అధికారులు ఎప్పటికపుడు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Sep 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam