DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవంబర్ 29 నుంచి విశాఖ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో

*(DNS Report: Ganesh Reddy, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 14, 2024 (డిఎన్ఎస్):* క్రెడాయ్ పదవ ప్రాపర్టీ షో నవంబర్ 29వ తేదీ శుక్రవారం నుంచి డిసెంబర్ 1వ తేదీ ఆదివారం వరకు ఎంవిపి కాలని అప్పుఘర్ రోడ్ గాదిరాజు ప్యాలెస్ లో ఘనంగా నిర్వహిస్తామని క్రెడాయ్ ప్రెసిడెంట్ వి.ధర్మేందర్ తెలిపారు. శనివారం స్థానిక హోటల్లో

ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖలో ఇంతవరకు తొమ్మిది క్రెడాయ్ షోలు విజయవంతంగా నిర్వహించా మన్నారు. దేశంలో రెండో అతి పెద్ద ఉపాది రంగం అయిన రియల్ ఎస్టేట్ వినియోగదారులు, వ్యాపారులకు వేదిక గా ఈ ఎక్స్పో నిలుస్తుం దన్నారు. చైర్మన్ కేఎస్ఆర్కే రాజు మాట్లాడుతూ వినియోగదారులకు వ్యాపారులకు వారధి గా నిలిచే

ఈ  ఎక్స్పో లో ప్రముఖ నిర్మాణరంగ సంస్థలన్నీ ఫాల్గొంటాయన్నారు. తమ సంస్థ సభ్యుల వద్ద కొనుగోలు చేసే ఫ్లాట్లు నాణ్యంగా వుంటాయని పేరు ప్రఖ్యాతులున్నా యన్నారు. విజయ వాడ వరద బాధితులకు తమ సంస్థ నగర శాఖ తరపున 10 లక్షలు, రాష్ట్ర శాఖ తరఫున 50 లక్షలు రూపాయలను విరాళంగా అందచేశా మన్నారు. ప్రజలకు తమ స్వంత ఇంటి కల నెరవేర్చడానికి ఈ

ఎక్స్పో ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. విఎంఆర్డిఎ పరిధిలో మార్కెట్ లోకి వస్తున్న లే అవుట్ ల గురించి వినియోగ దారులకు పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. ఫ్లాట్లు, విల్లాలు తదితర ప్రాజెక్టుల గురించి కూడా సమగ్ర సమాచారం సందర్శకులకు అందుబాటులో ఉంచుతా మన్నారు. ఈ ప్రాపర్టీ షో సందర్శకులకు డ్రా ద్వారా పలు బహుమతులు అందచేస్తా

మన్నారు. ఈ ఎక్స్పో కన్వీనర్ సిహెచ్ గోవింద రాజు మాట్లాడుతూ, ఈ ఎక్స్పో లో  భవన నిర్మాణ రంగంలో వచ్చిన నూతన సాంకేతిక పోకడలు, ఆధునిక నిర్మాణ సామాగ్రి, వినియోగదారులకు బ్యాంక్ ఋణ సదుపాయాలు తదితర అంశాలు ఉంటాయన్నారు. ఈ ఎక్ష్పోలో సుమారు వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఎక్స్పో టైటిల్ స్పాన్సర్ గా ఎస్ బి ఐ

వ్యవహరిస్తుం దన్నారు. సిఎస్ఆర్ క్రింద అపోలో హాస్పిటల్ వారు ఒక స్టాల్ ఏర్పాటు చేస్తా రన్నారు. మాజీ చైర్మన్ బీ.శ్రీనివాస రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 20 చాప్టర్ లు వున్నాయన్నారు. గత పదేళ్లుగా భారత బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్బిఐ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోం దన్నారు. ఇసుక సరఫరా సులభతరం చేస్తే నిర్మాణ రంగ పరిశ్రమకు

మంచి వెసులుబాటు కలుగు తుందన్నారు. ఎస్.బీ.ఐ.డిజీఎం పంకజ్ కుమార్ మాట్లాడుతూ,  దేశంలో రెండో అతిపెద్ద ఉపాధి రంగం అయిన రియల్ ఎస్టేట్ రంగం మీద పలు పరిశ్రమలు ప్రత్యక్ష, పరోక్షంగా ఆధారపడి దేశాభి వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అనంతరం క్రెడాయ్ ఎక్స్పో బ్రోచర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ సభ్యులు, ఎస్బిఐ

సిబ్బంది పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Sep 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam