DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చవితి మండపం పెడితే ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతా:

*మీ ఉద్యోగాలు కూడా పీకిస్తా: భాగ్యనగరంలో ప్రత్యక్ష వార్నింగ్* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 01, 2024 (డిఎన్ఎస్):* మా వీధిలో వినాయక చవితి మండపం పెడితే కొలని వాసులపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్న ఘటనలకు హిందూ సంఘాలు

మండిపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగరం లో బడంగ్ పేట లోని  వీధుల్లో ఓ కొలని వాసులు గత కొన్నేళ్లుగా వినాయక చవితి మండపాలు పెట్టి వైభవంగా ఉత్సవాలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆ కోలనీలో ఒక ఇల్లు కొన్న పవన్ జైన్ అనే వ్యక్తి ఈ మండపాన్ని పెడితే మాకు చికాకు, ఇక్కడ పెట్టడానికి వీల్లేదు అని చెప్పాడు. కేవలం

తొమ్మిది రోజులేనని, ప్రతి సారి ఇక్కడే మండపం పెడుతున్నామని నిర్వాహకులు చెప్పడం తో మండిపడి, కులం పేరుతొ దూషించారని  మీ అందరిపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో రాష్ట్రీయ వానర సేన సభ్యులు , ఇతర హిందూ సంఘాలు అతనితో ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. తానూ ఈ కొలని లో నివాసం లేనని, అయినా సరే మా

ఇంటి దగ్గర వినాయక మండపం పెడితే కేసు కచ్చితంగా కొలని వాసులందరిపై పెడతానని చెప్పాడు. ఎందరు నచ్చ చెప్పినా ససేమిరా అనడంతో రాష్ట్రీయ వానర సేన జాతీయ అధ్యక్షులు నామ్ రామ్ రెడ్డి, ఇతర సభ్యులు, బడంగ్ పేట వాసులు పవన్ జైన్ పై మీర్ పేట  పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇతని పేరు చూస్తే హిందూ సంప్రదాయం లో ఉంది, మరి వినాయక మండపానికి

అడ్డు ఎందుకు చెప్తున్నారు అని అడిగితె మాట దాటెయ్యడం జరిగిందని హిందూ సంఘాలు తెలియచేస్తున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Sep 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam