DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బెజవాడ వరద ప్రాంతాల్లో జీయర్ స్వాములచే ఆహారం పంపిణీ

*పలు ప్రాంతాల్లో ఆర్తులకు ఆహారం, వస్త్రాలు పంపిణీ*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 04, 2024 (డిఎన్ఎస్):* విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు త్రిదండి చిన్న జీయర్ స్వామి, త్రిదండి అహోబల జీయర్ స్వాములు పర్యటించారు. గత మూడు రోజులుగా వరద నీటిలో ఇబ్బందులు

పడుతున్న ప్రజలకు అవసరమైన ఆహారం, వస్త్రాలు, ఇతర సామాగ్రిని సీతానగరం లోని జీయర్ వేదపాఠశాల నిర్వాహకులు అందిస్తున్నారు. వరద ముప్పు ప్రమాదం తెలుసుకున్న జీయర్ స్వాములు విజయవాడకు చేరుకొని లోతట్టు ప్రాంతాల్లో మునిగి పోయిన ఇళ్ల వద్దకే చేరుకొని ఉదయం నుంచి రాత్రి వరకూ ఆహారం పంపిణీ చేసారు. ఇంతవరకూ ఎటువంటి సహాయం లభించని

ప్రాంతాల్లోకి వెళ్లి మరీ ప్రజలతో మాట్లాడి వారి క్షేమం తెలుసుకున్నారు. స్వామిజిలు నేరుగా తమకు సహాయం చెయ్యడానికి రావడం తో స్థానికులు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. జీయర్ స్వామి వేద పాఠశాల విద్యార్థులతో కలిసి, క్షేత్ర స్థాయి కి చేరుకున్నారు. 

సాధారణ వాహనాలు చేరుకోలేని లోతట్టు ప్రాంతాల్లో భారీ వాహనం లో

వెళ్లి మరీ ఆహార ప్యాకెట్లతో తో పాటు, పాలు, జ్యుసు, మంచినీరు, వస్త్రాలు ఒక బ్యాగ్ లో పెట్టి అందించారు. 
లోతట్టు ప్రాంతాల్లో నిరాశ్రయులైన వారి చెంతకే వెళ్లి భారీ వాహనాల వద్ద భోజన సదుపాయం ఏర్పాటు చేసారు. అనంతరం వారిని పలకరించి, క్షేమం తెలుసుకున్నారు. ఈ విధమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరూ

స్పందించి ముందుకు రావాలన్నారు. ఇబ్బంది లో ఉన్నవారికి సహాయం అందించడం ఒక్కటే లక్ష్యం అన్నారు. వారి జాతి, మతం పట్టింపు ఉండదన్నారు. ఎత్తు ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో  ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇబ్బంది కార వాతావరణం ఉందని, తద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందికార వాతావరణం తలెత్తిందన్నారు. ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు

చేస్తున్న సహాయ సహకారాలతో త్వరలోనే సాధారణ వాతావరణం ఏర్పడుతుందన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Sep 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam