DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైరస్‌ రాకుండా ముందు జాగ్రత్తలు అవసరం: అభిషిక్త్‌ కిషోర్‌

*ప్రయివేట్ ఆసుపత్రుల తనిఖీలో రాజమండ్రి నగర కమిషనర్* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 05, 2020 (డిఎన్ఎస్):* రాష్ట్ర ప్రభుత్వం కరోన వైరస్‌ నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలే ముఖ్యమని, ప్రజలు అందుకు

అనుగుణంగా నడుచుకోవాలని 
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి జిల్లాలోని పలు ప్రైవేటు కోవిడ్‌`19 ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న సేవాలు తదితర అంశాలపై తనిఖీలు

చేసేందుకు నియమించిన జిల్లా ఉన్నతస్థాయి అధికారులు శనివారం రాజమహేంద్రవరం నగరంలోని పలు ఆసుపత్రులను తనిఖీలు చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌కు నగరంలోని సాయి ఆసుపత్రి, రాజు న్యూరో ఆసుపత్రి, శ్రీలత ఆసుపత్రి, యూనివర్శల్‌ ఆసుపత్రి, డెల్టా ఆసుపత్రి, నవీన్‌ ఆసుపత్రి బాధ్యతలను అప్పగించారు.  దీంతో

కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, ఇతర అధికారులతో కలిసి శనివారం నగరంలోని రాజు న్యూరో ఆసుపత్రిని తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కోవిడ్‌`19 ఆసుపత్రుల ఏర్పాటు సందర్భంగా నిర్ధేశించిన అంశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారా? లేదా? అనే అంశాలపై ఆయన ఆరా తీశారు. ఆర్‌ఎస్‌ న్యూరో ఆసుపత్రికి జిల్లా వైద్యాధికారి ఇచ్చిన

రిజిష్ట్రేసన్‌ సర్టిఫికెట్‌ ఉందా? ఆసుపత్రి ఉన్న భవనానికి ప్లాన్‌ అప్రూవల్‌ ఉందా? లేదా? అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఒసి ఉందా? లేదా? ఆసుపత్రిలో ఉన్న వైద్యుల సంఖ్యతోపాటు, నర్సులకు సంబంధించిన వివరాలు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. రోగుల యొక్క క్షేమాలను ఎప్పటికప్పుడు వారి వారి బంధువులకు సమాచారాన్ని తెలియచేసేందుకు

అవసరమైన హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశారా? లేదా? అనే వివరాలను సంబంధిత ఆసుపత్రి యాజమాన్యం నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న 50 పడకల్లో కరోన వైరస్‌తో ఉన్న రోగులకు అందిస్తున్న ఆహారం, మందులు, వైద్యుల యొక్క సేవాలు ఎలావున్నాయి? వంటి అంశాలపై ఆయన రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో

మాట్లాడుతూ కరోన వైరస్‌ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వాటికి తోడుగా ప్రజలు కూడా అవసరమైన జాగ్రత్తలను పాటించాలన్నారు. వైరస్‌ వచ్చిన తరువాత తీసుకునే జాగ్రత్తలు కంటే వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు మరింతగా

దృష్టి సారించాలని అన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ప్రైవేటు కోవిడ్‌`19 ఆసుపత్రులను తనిఖీలు చేస్తున్నామని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆసుపత్రిలో సౌకర్యాలు ఉన్నాయా? లేవా? అనే అంశాలపై ఆరా తీసినట్లు తెలిపారు. ఈ పర్యటనలో అదనపు డిఎం అండ్‌ హెచ్‌ఒ కోమల, అదనపు కమిషనర్‌ ఎన్‌వివి సత్యనారాయణ, ఆసుపత్రి వైద్యులు

బలబద్ర వెంకటరాజు, డాక్టర్‌ సునీత, నోడల్‌ ఆఫీసర్‌ సత్యవేణి, నగరపాలక సంస్థ అదనపు వైద్యాధికారి ఎంవిఆర్‌ మూర్తి, సీఈఒ చద్రమౌలి, మేనేజర్‌ పి.రాజ్‌కుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ బాపిరాజు, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Sep 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam