DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వారణాసిలో మోడీ కోసం 50 మంది, 5 లక్షల మెజారిటీ దిశగా టార్గెట్

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*వారణాసి / విశాఖపట్నం, జూన్ 01, 2024 (డి ఎన్ ఎస్):* అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన వారణాసి లోక్ సభ ఎన్నిక ను బీజేపీ శ్రేణులు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాయి. ఈ స్థానం నుంచి సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల బరిలో ఉండడంతో దేశంలోనే అత్యంత మెజారిటీ వచ్చే విధంగా గత ఐదేళ్లుగా

శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నిక కోసం 50 మందితో కూడిన పోల్ మేనేజింగ్ టీమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మొత్తం బృందాన్ని సునీల్ సంజయ్ న్సల్ నడిపిస్తున్నారు. 5 లక్షలకు పైగా మజిరోటీ సాధించడమే లక్ష్యంగా పార్టీ క్యాడర్ కృషి చేస్తోంది. వారణాసి లో మొత్తం 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వివిధ ప్రాంతాలకు, భాషలకు చెందిన వాళ్ళు

అధికంగా ఉన్నారు. అక్కడ 60 శాతం ఓటింగ్ మించి నమోదు కాకపోవడం శోచనీయం. శనివారం జరుగుతున్నా చివరి దశ ఎన్నికల్లో వారణాసి కూడా ఉండడం గమనార్హం. 
వారణాసి లో 2000 కి పైగా ఆశ్రమాలు ఉండగా, వృద్ధాశ్రమాలు, గురుకులాలు వందల సంఖ్యలో ఉన్నాయి
గత రెండు సార్లు ఇదే స్థానం నుంచి మోడీ లోక్ సభకు ఎన్నికయ్యారు. 2014 లో 3 లక్షల  71 వేల 784 మెజారిటీ

లభించింది. 2019 లో 4 లక్షల  79 వేల 505 మెజారిటీ లభించింది.
ఈ పర్యాయం 5 లక్షలకు మించి మెజారిటీ వచ్చే విధంగా 50 మంది బృందం ప్రతి ప్రాంతంలోనూ పర్యటిస్తూ, ఆయా భాషలు మాట్లాడే వారితో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. గత పదేళ్ల కాలంలో మోడీ ఈ దేశానికి చేసిన సేవను, క్షేత్ర స్థాయిలో వారణాసి ని అభివృద్ధి పరిచిన విధానం, ప్రజలకు

అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. 
 ఓటింగ్ శాతం పెంచేందుకు మరింత శ్రమించారు. ఇక్కడ నోటా కు సైతం ఎక్కువగానే ఓట్లు పడుతున్నాయి. 2014 లో నోటాకు 2 వేలు, 2019 లో 4 వేలుకు పైగా నోటా ఓట్లు నమోదు అయ్యాయి. ఈ సారి వీటి శాతం తగ్గించే ప్రయత్నం లో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నిక జరుగుతున్నా తరుణంలో నరేంద్ర మోడీ

కన్యాకుమారి ప్రాంతంలో ధ్యాన దీక్ష చేపట్టడం ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Sep 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam