తాజా వార్తలు
  • ప్రయాగ రాజ్ లో భారీ ట్రాఫిక్ జాం, రంగం లోకి యోగి మహారాజ్

    Feb 11, 2025 3:40 pm

    వారణాసి, అయోధ్యలో భారీ రద్దీ, కిక్కిరిసిన ఆలయాలు 

    *(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

    విశాఖ పట్నం / ప్రయాగ రాజ్, ఫిబ్రవరి 11,2025 (డి ఎన్ ఎస్) : ప్రయాగ రాజ్ లో కుంభ మేళా కోసం వస్తున్న అశేష భక్త జనం వివిధ వాహనాలు పెరగడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక్కసారిగా జన సంచారం పెరగడం తో కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అవ్వడంతో రెండు నగరాల మధ్య వారధిగా మారిపోయింది. 
    కుంభ మేళ స్నానం అనంతరం ప్రయాగ రాజ్ నుంచి భక్తులు వారణాసి, అయోధ్య క్షేత్రాలను దర్శించేందుకు వెళ్తుండడంతో ఆ నగరాలూ కూడా భారీ భక్త జన సంద్రంగా మారిపోయాయి. ఆలయాల ప్రాంతాల్లోని వీధులు భక్తులు విడిచిన పాదరక్షణతో గుట్టలు గా నిండిపోయాయి. 

    ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ హుటాహుటిన రంగం లోకి దిగారు. 
    ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రయాగ రాజ్ లో ప్రవేశం లేదు. నేటి నుంచి  ప్రయాగ రాజ్ వెళ్ళే మార్గాల్లో వన్ వే అమలు చేస్తున్నారు.
    ప్రస్తుతం అన్ని స్నాన ఘాట్ ల వద్ద మరింత కఠిన ఆంక్షలు విధించారు.  సెక్టార్లలో ఉన్న జనం, పురోహిత సంఘాల సభ్యులను అక్కడే ఉండవలసింది గా సూచించారు. ఘాట్ ల వద్ద జన సంచారం పెరగడంతో భారీ ఎత్తున బారికేడ్లు నిర్మించారు. 
    ఒక సెక్టార్ నుంచి మరో సెక్టార్ కి వెళ్ళడానికి మార్గం మూసివేత. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండాలి.
    మహా కుంభ కు వచ్చే ప్రతి ఒక్కరూ నదీ స్నానం ప్రశాంతంగా చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

    రోడ్డు మార్గంలో వచ్చేవాళ్ళు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణం వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్గమధ్యలో మంచి నీళ్లు, ఆహారం, టాయిలెట్ లు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేనందున, తగు సూచనలు చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకు రావద్దని తెలియచేస్తున్నారు. విలువైన ఆభరణాలు వేసుకుని రావద్దని, కేవలం పవిత్ర స్నానం చెయ్యడం కోసం, పితృ కార్యాలు జరుపుకోడానికి మాత్రమే కుంభ మేళాకి రావాలని, ఇక్కడ బస చేసే ఆలోచన వద్దన్నారు.  
     

  • కుంభమేళా రైళ్లలో వెళ్ళేవాళ్ళు మీ ఆహార ఏర్పాట్లు చేసుకోండి

    Feb 6, 2025 5:57 pm

    *రైళ్లల్లో పాంట్రీ లు లేవు, స్టేషనల్లో నీళ్లు కూడా లేవు.*

    *(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

    *విశాఖపట్నం, 06, ఫిబ్రవరి 2025, (డిఎన్ఎస్ ):* కుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు స్పెషల్ రైళ్లు ఎక్కుతున్నారా? అయితే మీ ఏర్పాట్లు మీరే చేసుకోవాల్సి యుంది. విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైళ్లు విశాఖ నుంచి 8588 నెంబర్ తో రైలు విశాఖపట్నం నుంచి ఫిబ్రవరి 4 వ తేదీ రాత్రి 10 : 40 గంటలకు బయలు దేరింది. భువనేశ్వర్ దాటిన తర్వాత వచ్చే రైల్వే స్టేషన్లలో కనీసం మనిషి కూడా కనపడే అవకాశమే లేదు. ఝరాసిగూడ, డెంకెనాల్, ఝార్సా దాకా స్టేషన్లలో కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో లేవు. కాఫీ, టీలు, అమ్మేవాళ్ళు కూడా ఉండరు. సుమారు ఒకటిన్నర రోజులు ( 40 గంటల ) ప్రయాణం చెయ్యవలసిన ఈ రైళ్లల్లో ప్రయాణించేవాళ్ళు మీ వెంట మీకు అవసరమయ్యే మంచినీళ్లు, ఆహార తినుబండరాలు తప్పనిసరిగా తీసుకు వెళ్ళవలసి ఉంటుంది. ప్రయాగ రాజ్ కు 20 కిమీ ల ముందు ప్రయాగరాజ్ చొకి స్టేషన్లో దిగవలసి ఉంటుంది. అక్కడ మాత్రమే మంచి నీళ్లు దొరికే అవకాశం ఉంది. 
    మీ ఏర్పాట్లు మీరు చేసుకోకుండా వెళ్తే నానా అవస్థలు పడడం ఖాయం. ప్రస్తుతం 8588 నెంబర్ రైల్లో విశాఖ నుంచి ఫిబ్రవరి 4 న మీడియా ప్రతినిధులు ప్రయాగ వెళ్లడం జరిగింది. అక్కడ రైల్లో ఎదురైనా సందర్భాలను ప్రయాణికుల ఆవేదన తెలుసుకోవడం జరిగింది. 

    సుమారు 40 గంటలు ప్రయాణం చెయ్యవలసిన రైల్లో కనీసం పాంట్రీ సదుపాయం చెయ్యకపోవడం రైల్వే శాఖా నిర్లక్ష్యానికి నిదర్శనం అని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఒక్కో టికెట్టు కు భారీ ఎత్తున రేట్లు పెంచి మరి అమ్ముతున్నారు. అలాంటిది రైల్లోనే ఆహార ఏర్పాట్లు చెయ్యవలసిన భాద్యత కూడా రైల్వే శాఖ పాటించక పోవడం గమనార్హం. 
    టికెట్లు మాత్రం తత్కాల్, ప్రీమియం తత్కాల్ పేరిట పదిరెట్లు పైగా డబ్బులు గుంజుతున్నారు. రైళ్లల్లో ఆమాత్రం సదుపాయం చేయలేరా అంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. 

  • విశాఖ డివిజన్ తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే అధికారిక ప్రకటన 

    Feb 5, 2025 1:39 pm

    *(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

    *విశాఖపట్నం, 05, ఫిబ్రవరి 2025, (డిఎన్ఎస్ ):* విశాఖ వాసుల చిరకాల డిమాండ్ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ నేడు అన్ని అధికారిక అనుమతులు, పరిధులపై అధికారిక ప్రకటన విడుదలయ్యింది. బుధవారం భారత రైల్వే శాఖా విడుదల చేసిన అత్యవసర ప్రకటన లో పూర్తి వివరాలను ప్రకటించింది. 
    ఫిబ్రవరి  28. 2019 నాడు నాటి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం లో పాక్షిక సవరణలు చేస్తూ బుధవారం అధికారిక విడుదల చేసింది. 

    ప్రస్తుత వాల్తేర్ డివిజన్ ను విశాఖపట్నం డివిజన్ గా మారుస్తూ  కొంత సవరణ చేసారు. ఈ డివిజన్ పరిధిలో స్టేషన్ల మధ్య పలాస - విశాఖపట్నం - దువ్వాడ, కూనేరు - విజయనగరం,
    నౌపడ జం - పర్లాకిమిడి, బొబ్బిలి జం. సాలూరు, సింహాచలం నార్త్
    దువ్వాడ బైపాస్, వదలపూడి దువ్వాడ మరియు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్
    జగ్గాయపాలెం (సుమారు 410 కి.మీ), కొత్త పరిధిలో వాల్టెయిర్ డివిజన్‌గా కొనసాగుతుంది
    సౌత్ కోస్ట్ రైల్వే. దీనికి విశాఖపట్నం డివిజన్‌గా నామకరణం చేయనున్నారు. 

    ఈ వాల్టెయిర్ డివిజన్‌లోని మిగిలిన భాగం కొత్తవలస బచేలి/కిరండూల్, కూనేరు - తేరువాలి జంక్షన్, సింగపూర్ రోడ్, - కోరాపుట్ జంక్షన్, పర్లాకిమిడి - గుణుపూర్ (సుమారు 680 కి.మీ), తూర్పు పరిధిలోని రాయగడ వద్ద ప్రధాన కార్యాలయంతో కొత్త డివిజన్‌గా మార్చబడుతుంది  
    దక్షిణ కోస్ట్ రైల్వే పరిధిలో : విశాఖపట్నం ( సవరించిన పాత వాల్తేర్ భాగం), విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉంటాయి. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు నేటి వరకూ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నాయి. 

    దక్షిణ మధ్య రైల్వే (SCR): మిగిలిన డివిజన్లు సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లతో దక్షిణ మధ్య రైల్వే కొనసాగుతుంది. 
    ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR): ఖుర్దా రోడ్, సంబల్పూర్, రాయగడ (కొత్త డివిజన్) లతో తూర్పు కోస్తా రైల్వే కొనసాగుతుంది. 

     

Panchangam - Apr 2, 2025

Date :
Ruthuva :
Nakshatram :
Week :
Masam :
Amrithakalam :
Year :
Pakshamvarjam :
Samsthram :
Ayanam :
Tithi :
Durumuhratam :

Today Vizag Events - Apr 2, 2025

ఆంధ్ర ప్రదేశ్
వాయు కాలుష్య నివారణకై ఎలక్ట్రిక్ వాహనాలు అవసరం:...

Nov 2, 2021 10:08 am

*కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య*

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, నవంబర్ 01,  2021 (డిఎన్ఎస్):* ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. విజయవాడలో అవేరా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ కొత్త వేరియంట్ రెట్రోసాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి వాతావరణ పరిరక్షణకు ఇచ్చిన పిలుపు మేరకు, ఆ దిశగా అవేరా సంస్థ అడుగులు వేయడం శుభపరిణామమన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ఎంచుకున్నందుకు అవేరా బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా అవేరా వ్యవస్థాపకుడు, సీఈవో డా. రమణ, కో ఫౌండర్ చాందిని చందన నాంది పలికారని వెంకయ్య నాయుడు అన్నారు. డా. రమణ మాట్లాడుతూ.. అధునాతన ఫీచర్లతో రూపొందిన రెట్రోసా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 148 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు. బ్లూటూత్ ను అనుసంధానించడం ద్వారా బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్ శాతం, వోల్టేజ్ తదితర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దేశంలోనే ఈ శ్రేణి వాహనాల్లో రెట్రోసా అత్యధిక వేగాన్ని కలిగి ఉందని చెప్పారు. అవేరా ఇప్పటికే యూరప్, ఏషియా పసిఫిక్ దేశాలకు వాహనాల ఎగుమతి చేస్తోందని వివరించారు. 2022 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 140 అవేరా పాయింట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోందని డా. రమణ పేర్కొన్నారు. కార్యక్రమంలో అవేరా ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

view more..
రాజకీయo
view more..

వీడియోలు
International
కెనడాలో - 21 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు ...

Feb 14, 2020 11:41 pm

హిమ పర్వతాల నడుమ మధ్య జనజీవనం. . 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . .

బ్రాంప్టాన్ / విశాఖపట్నం, ఫిబ్రవరి 14, 2020 (డిఎన్‌ఎస్‌) : ఉత్తర అమెరికా à°–à°‚à°¡à°‚ లోని కెనడాలో à°—à°² బ్రాంప్టాన్ (రాజధాని టొరంటో కు సమీపంలోనే ) నగరం లో ఫిబ్రవరి 14 ఉదయం 6 à°—à°‚à°Ÿà°² సమయానికే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు -21 డిగ్రీలు నమోదు చేసుకోవడం తో నగరం మంచుపర్వతాలతో మునిగిపోయింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన భారతీయులు అధిక శతం ఉండే à°ˆ నగర వీధులన్నీ మంచు ఖండాలతో నిండి పోవడం తో స్థానిక ప్రభుత్వ సిబ్బంది వీటిని తొలగించే పనిలో పడింది. ఇళ్లల్లోని కుళాయిల్లో నీళ్లు సైతం మంచుగా మారిపోవడం గమనార్హం. à°ˆ క్రమం లో జనజీవన స్రవంతి à°•à°¿ ఆటంకం ఏర్పడింది. విధులకు, కళాశాలలకు వెళ్లేవారు భారీ ఎత్తున ఉన్ని దుస్తులు ధరిస్తే గానే ఇంటి నుంచి కాలు బయట పెట్టె పరిస్థితి లేదు.  à°µà°°à±à°·à°‚ కురినట్టుగా మంచు ఏకధాటిగా పడుతుండడం గమనార్హం. ఇళ్ల బయట పార్కింగ్ చేసే కార్లు సైతం హిమపాతాల్లో కూరుకు పోతుండడం గమనార్హం. మైదాన ప్రాంతాల్లో భారీగా కురిసిన మంచు పలు ఆకారాలు దర్శనమిస్తోంది. 
అయితే భారతీయ వాతావరణానికి పూర్తిగా భిన్నంగా ఉండే ఉష్ణోగ్రతలు కావడంతో ఎక్కువ మంది భారతీయులు à°ˆ సమయంలోనే ఇక్కడకు చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు. 

...

view more..
Movie News
a...

Dec 16, 2024 4:24 pm

a

view more..
విశాఖ వార్తలు
సింహగిరి పై పెళ్లి మండప కాంట్రాక్టర్ కు దేవాద...

Mar 3, 2025 12:37 pm

*సింహాచలంలో రోడ్డు బ్లాక్ చేసి అడ్డంగా పెళ్లి మండపాల నిర్మాణం*

*గాడి తప్పిన దేవాదాయ శాఖ, భక్తుల ఇబ్బందులు గాలికి* 

view more..
Competitive Exams in India
Sports
x

Dec 16, 2024 4:08 pm

x

view more..