Jun 6, 2025 6:34 pm
యూట్యూబర్ల లపాకి యాత్రకు ట్రావెల్ ఏజెంట్ల పాత్రే కీలకమా?
*వందలాది స్లీపర్ సెల్స్ ను లపాకిస్తాన్ కి పంపిన హిడింబ ఈ నౌషాబా*
(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)
విశాఖపట్నం , 6 జూన్ , 2025 (డి ఎన్ ఎస్): గత నెల్లో కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు చేసిన మారణకాండ అనంతరం భారత దేశ నిఘా సంస్థ జరుపుతున్న ఏరివేతలో దేశ ద్రోహులు గుట్టలు గుట్టలుగా బయటకు వస్తున్నారు. వీళ్లల్లో అధిక శాతం ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవాళ్లు, నేరుగా పాకిస్తాన్ వెళ్లి వచ్చినవాళ్లు ఇలా ఎందరో బయట పడుతున్నారు. వీళ్ళందరికీ తెరవెనుక సహాయం చేసేవాళ్లు గురించి వెలికి తీతలో లాహోర్ ట్రావెల్ ఏజెన్సీ నుంచే భారత్ వ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ సంస్థ నిర్వాహకురాలు ఒక మహిళా కావడం గమనార్హం. ఇన్నాళ్లు అదుపులోకి తీసుకున్న నిందితులు, వారి సహచరులు, ఇలా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన వాళ్లకి వీసా ఏర్పాట్లు ఈమె చేసినట్టు సమాచారం.
భారత ఇన్ఫ్లూయెన్సర్లు పాకిస్థాన్లో ప్రయాణించేందుకు సాయం చేసిన వాళ్ళు ఎవరు అని విచారణ చేస్తున్న సమయంలో మేడం ఎన్ పేరు తెలిసింది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కింద పనిచేస్తూ లాహోర్లో ‘జైయానా ట్రావెల్ అండ్ టూరిజం’ పేరుతో ఓ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న వ్యక్తిని నోషాబా షెహ్జాద్గా గుర్తించారు.
ఇటీవల అరెస్ట్ అయిన భారత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను విచారిస్తున్నప్పుడు ఈ విషయం బయటపడింది. భారత యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా మరెంతోమంది పాక్ సందర్శించేందుకు ఆమె సాయం చేసినట్టు తెలిసింది. గత ఆరు నెలల్లో భారత్ నుంచి 3 వేల మంది పౌరులు, 1500 ప్రవాస భారతీయులు పాకిస్థాన్ సందర్శించేందుకు ఆమె సాయం చేసినట్టు గుర్తించారు. వాళ్లకి పాక్ వెళ్ళడానికి వీసా ఇప్పించిన ఈమె, వాళ్ళని ఐఎస్ఐ గూఢచారులుగా, స్లీపర్ సేల్స్ గాను ఉపయోగించుకోవడానికి కూడా పునాది వేసిందని బహిర్గతం అయ్యింది.
ఈమె భర్త రిటైర్డ్ పాకిస్థాన్ సివిల్ సర్వీసెస్ అధికారి. ఈమె చాలా మంది భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పాక్ సైన్యం, ఐఎస్ఐ లకు పరిచయం చేసిందని, భారత్లో నివసిస్తున్న హిందువులు, సిక్కులను ఆకర్షిస్తుందని చెబుతున్నారు
ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంతోనూ ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఆమె కోరుకున్న వ్యక్తికి చిటికెలో వీసా లభించేది. పాక్ రాయబార కార్యాలయంలో వీసా అధికారిగా పనిచేసిన ఐఎస్ఐ ఆపరేటివ్ డానిష్ అలియాస్ ఎహ్సాన్-ఉర్-రెహ్మాన్తోనూ ఆమెకు సంబంధాలున్నాయి.
ఆమె ఇటీవల ఢిల్లీతోపాటు, మరిన్ని నగరాల్లో కొంతమంది ట్రావెల్ ఏజెంట్లను నియమించింది. వారంతా ఇప్పుడు ఆమె కంపెనీని బాగా ప్రమోట్ చేస్తున్నారు. స్థానిక యువత ను ఆకర్షించేందుకు మనీ, మగువ ఎరా చూపి ఇలా చెయ్యకూడని పనులు చేస్తూ తన పనులు కానిస్తునంట్టు విచారణ లో తెలిసింది.
త్వరలోనే భారత్ లోని ఈమె కార్యాచరణను పరిశీలించి, అనంతరం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈమెకు భారత్ లో సహకారం చేసిన వాళ్లపై కూడా నిఘా వర్గాల దృష్టి ఉంది.
Jun 5, 2025 8:58 pm
*Sandeep Mathur, 1 st GM for South Coast Raiwaly Vizag*
*ఉత్తరాంధ్ర కు ప్రధాని మోడీ బహుమతి సౌత్ కోస్ట్ రైల్వే జోన్*
*విశాఖ రైల్వే జోన్ మొదటి జీఎం గా సందీప్ మాథుర్ నియామకం*
*(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, 5 జూన్ , 2025 (డి ఎన్ ఎస్):* ఈ నెల 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ రానున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ తన రాక కంటే ముందే ఉత్తరాంధ్ర వాసులకు బంగారు బహుమతి అందించారు.
కొన్నేళ్ల పాటు రైల్వే కష్టాలు అనుభవించిన విశాఖ ప్రాంత వాసుల చిరకాల కల ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు తో తీరనుంది. ఈ జోన్ కు మొట్టమొదటి జనరల్ మేనేజర్ గా సీనియర్ ఐఆర్ ఎస్ ఎస్ ఈ అధికారి సందీప్ మాథుర్ ను నియమిస్తూ గురువారం ఆదేశాలు వెలువడ్డాయి.
వాస్తవానికి ఈ జోన్ ప్రకటన 2014 లోనే ప్రకటించినా అది అమలు లోకి రావడానికి దాదాపు దశాబ్ద కాలం పట్టింది. నేడు అన్ని అవరోధాలు, బాలారిష్టాలు దాటుకుని తోలి అడుగు వేస్తోంది.
ఇటు కేంద్రం, అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ జోన్ ఏర్పాటు ను సంపూర్ణ విజయం చేకూర్చేందుకు అన్ని విధాలా నిష్ణాతులైన అధికారి విశాఖ కు పంపుతున్నారు.
సందీప్ మాథుర్ 1988 బ్యాచ్ కు చెందిన భారతీయ రైల్వే సర్వీస్ అధికారి. 1967 మార్చ్ 16 న పుట్టిన ఈయన 1990 లో శిక్షణ పూర్తి చేసుకుని రైల్వే విధుల్లో చేరారు.
ఈయన రైల్వే బోర్డు పరిధి లో సిగ్నల్ సర్వీస్ ఇంజనీర్స్ విభాగానికి అత్యున్నత నిర్వహణ అధికారి ( హెచ్ ఏ జి) హోదాలో విధులు నిర్వహిస్తున్నారు.
ఈయన భారతీయ రైల్వేల యొక్క విస్తారమైన సిగ్నలింగ్ మరియు టెలికమ్యూనికేషన్ లో మౌలిక సదుపాయాలను నిర్వహించే విభాగం ఇది. ప్రాథమికంగా సాంకేతిక-నిర్వాహక స్వభావం కలిగి ఉంటుంది. సిగ్నలింగ్ సూత్రాలు మరియు ఆపరేటింగ్ నియమాలు అమలు అవుతాయి. సందీప్ఈ మాథుర్ కు ఈ విభాగం లో విస్తారమైన అనుభవం ఉంది.
సందీప్ మాథుర్ రాక కోసం ఉత్తరాంధ్ర వాసులు ఎదురుచూస్తున్నారు.
Date : |
Ruthuva : |
Nakshatram : |
Week : |
Masam : |
Amrithakalam : |
Year : |
Pakshamvarjam : |
Samsthram : |
Ayanam : |
Tithi : |
Durumuhratam : |
*కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య*
*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*
*అమరావతి, నవంబర్ 01, 2021 (డిఎన్ఎస్):* ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. విజయవాడలో అవేరా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ కొత్త వేరియంట్ రెట్రోసాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి వాతావరణ పరిరక్షణకు ఇచ్చిన పిలుపు మేరకు, ఆ దిశగా అవేరా సంస్థ అడుగులు వేయడం శుభపరిణామమన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ఎంచుకున్నందుకు అవేరా బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా అవేరా వ్యవస్థాపకుడు, సీఈవో డా. రమణ, కో ఫౌండర్ చాందిని చందన నాంది పలికారని వెంకయ్య నాయుడు అన్నారు. డా. రమణ మాట్లాడుతూ.. అధునాతన ఫీచర్లతో రూపొందిన రెట్రోసా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 148 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు. బ్లూటూత్ ను అనుసంధానించడం ద్వారా బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్ శాతం, వోల్టేజ్ తదితర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దేశంలోనే ఈ శ్రేణి వాహనాల్లో రెట్రోసా అత్యధిక వేగాన్ని కలిగి ఉందని చెప్పారు. అవేరా ఇప్పటికే యూరప్, ఏషియా పసిఫిక్ దేశాలకు వాహనాల ఎగుమతి చేస్తోందని వివరించారు. 2022 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 140 అవేరా పాయింట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోందని డా. రమణ పేర్కొన్నారు. కార్యక్రమంలో అవేరా ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Oct 1, 2021 2:51 pm
Oct 1, 2021 2:25 pm
Sep 30, 2021 7:44 pm
Feb 14, 2020 11:41 pm
à°¬à±à°°à°¾à°‚à°ªà±à°Ÿà°¾à°¨à± / విశాఖపటà±à°¨à°‚, à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 14, 2020 (à°¡à°¿à°Žà°¨à±à°Žà°¸à±) : ఉతà±à°¤à°° అమెరికా à°–à°‚à°¡à°‚ లోని కెనడాలో à°—à°² à°¬à±à°°à°¾à°‚à°ªà±à°Ÿà°¾à°¨à± (రాజధాని టొరంటో కౠసమీపంలోనే ) నగరం లో à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 14 ఉదయం 6 à°—à°‚à°Ÿà°² సమయానికే à°…à°¤à±à°¯à°‚à°¤ కనిషà±à°Ÿ ఉషà±à°£à±‹à°—à±à°°à°¤à°²à± -21 à°¡à°¿à°—à±à°°à±€à°²à± నమోదౠచేసà±à°•ోవడం తో నగరం మంచà±à°ªà°°à±à°µà°¤à°¾à°²à°¤à±‹ à°®à±à°¨à°¿à°—ిపోయింది. తెలà±à°—ౠరాషà±à°Ÿà±à°°à°¾à°²à°•ౠచెందిన à°à°¾à°°à°¤à±€à°¯à±à°²à± à°…à°§à°¿à°• శతం ఉండే à°ˆ నగర వీధà±à°²à°¨à±à°¨à±€ మంచౠఖండాలతో నిండి పోవడం తో à°¸à±à°¥à°¾à°¨à°¿à°• à°ªà±à°°à°à±à°¤à±à°µ సిబà±à°¬à°‚ది వీటిని తొలగించే పనిలో పడింది. ఇళà±à°²à°²à±à°²à±‹à°¨à°¿ à°•à±à°³à°¾à°¯à°¿à°²à±à°²à±‹ నీళà±à°²à± సైతం మంచà±à°—à°¾ మారిపోవడం గమనారà±à°¹à°‚. à°ˆ à°•à±à°°à°®à°‚ లో జనజీవన à°¸à±à°°à°µà°‚తి à°•à°¿ ఆటంకం à°à°°à±à°ªà°¡à°¿à°‚ది. విధà±à°²à°•à±, కళాశాలలకౠవెళà±à°²à±‡à°µà°¾à°°à± à°à°¾à°°à±€ à°Žà°¤à±à°¤à±à°¨ ఉనà±à°¨à°¿ à°¦à±à°¸à±à°¤à±à°²à± à°§à°°à°¿à°¸à±à°¤à±‡ గానే ఇంటి à°¨à±à°‚à°šà°¿ కాలౠబయట పెటà±à°Ÿà±† పరిసà±à°¥à°¿à°¤à°¿ లేదà±. వరà±à°·à°‚ à°•à±à°°à°¿à°¨à°Ÿà±à°Ÿà±à°—à°¾ మంచౠà°à°•ధాటిగా పడà±à°¤à±à°‚à°¡à°¡à°‚ గమనారà±à°¹à°‚. ఇళà±à°² బయట పారà±à°•ింగౠచేసే కారà±à°²à± సైతం హిమపాతాలà±à°²à±‹ కూరà±à°•ౠపోతà±à°‚à°¡à°¡à°‚ గమనారà±à°¹à°‚. మైదాన à°ªà±à°°à°¾à°‚తాలà±à°²à±‹ à°à°¾à°°à±€à°—à°¾ à°•à±à°°à°¿à°¸à°¿à°¨ మంచౠపలౠఆకారాలౠదరà±à°¶à°¨à°®à°¿à°¸à±à°¤à±‹à°‚ది.
అయితే à°à°¾à°°à°¤à±€à°¯ వాతావరణానికి పూరà±à°¤à°¿à°—à°¾ à°à°¿à°¨à±à°¨à°‚à°—à°¾ ఉండే ఉషà±à°£à±‹à°—à±à°°à°¤à°²à± కావడంతో à°Žà°•à±à°•à±à°µ మంది à°à°¾à°°à°¤à±€à°¯à±à°²à± à°ˆ సమయంలోనే ఇకà±à°•డకౠచేరà±à°•à±à°¨à±‡ à°ªà±à°°à°¯à°¤à±à°¨à°‚ చేసà±à°¤à±à°‚టారà±.
Jun 13, 2025 5:49 pm
*రూ. 45 లక్షల విలువైన సామాగ్రి మంటల్లో మాడిపోయాయి*
*(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్న...
Jun 10, 2025 1:22 pm
Jun 8, 2025 3:51 pm
Jun 7, 2025 2:33 pm
Jul 31, 2020 8:26 am
Feb 15, 2020 8:11 am
Feb 13, 2020 9:47 pm
Jun 6, 2025 11:21 pm
*(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం / న్యూఢిల్లీ , 6 జూన్ , 2025 (డి ఎన్ ఎస్):* భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక సలహా మండలి (EAC-PM) ఛైర్మన్ గా గుంటూరు జిల్లా వాసి ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సూర్యదేవర మహేంద్ర దేవ్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తుమ్మపూడికి చెందిన మహేంద్ర దేవ్ ప్రముఖ ఆర్థికవేత్త . ప్రస్తుతం అయన యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ డైరెక్టర్ (వైస్-ఛాన్సలర్) గాను, కేంద్ర వ్యవసాయ ఉత్పత్తి ధరల నిర్ణయ కమిటీ ఛైర్మన్గా పనిచేశారు.
1988లో ముంబైలోని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన కెరీర్ను ప్రారంభించి, 1998 వరకు 10 సంవత్సరాలు అక్కడే పనిచేశారు.
ఆ తర్వాత, జర్మనీలోని బాన్ విశ్వవిద్యాలయంలో 4 నెలల స్వల్ప కాలం పాటు విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1998 నుండి 2008 వరకు, హైదరాబాద్లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్కు డైరెక్టర్గా ఉన్నారు.
ప్రొఫెసర్ దేవ్ 2008లో వ్యవసాయ మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్ ఛైర్మన్గా నియమితులయ్యారు మరియు ఆగస్టు 2010 వరకు అక్కడ పనిచేశారు. 2013లో, ఆయన జాతీయ గణాంక కమిషన్, గణాంకాల మంత్రిత్వ శాఖ, కార్యక్రమాల అమలులో సభ్యుడిగా నియమితులయ్యారు, అక్కడ ఆయన 2016 వరకు పనిచేశారు. అదే సమయంలో, ఆయన 2019 వరకు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ బోర్డు సభ్యుడిగా ఉన్నారు.
ప్రైవేట్ రంగంలో, ప్రొఫెసర్ మహేంద్ర దేవ్ 2013 నుండి 2021 వరకు కోటక్ మహీంద్రా బ్యాంక్కు మరియు 2021 నుండి జూన్ 5, 2025 వరకు యాక్సిస్ బ్యాంక్కు స్వతంత్ర డైరెక్టర్గా పనిచేశారు.
తెలుగు వ్యక్తి ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ గా నియమితులవ్వడం తెలుగు వారందరికీ గర్వకారణమని, దేశ ఆర్ధిక వ్యవస్థ పటిష్టత కు మరింత మెరుగైన సూచనలు లభిస్తాయని అభిప్రాయపడుతున్నారు.