DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అల్లు రామలింగయ్య పలు రంగాల్లో ప్రావీణ్యులు, చిరంజీవి

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, అక్టోబర్ 01, 2021 (డిఎన్ఎస్):* అల్లు రామలింగయ్య పలు రంగాల్లో ప్రావీణ్యులు అని,  సినీ నటుడు చిరంజీవి అన్నారు. శుక్రవారం నగరంలోని అల్లురామలింగయ్య హోమియో వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అల్లు రామలింగయ్య గారి శత జయంతి ఉత్సవాల

సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా అయన అల్లు విగ్రహాన్ని ఆవిష్కకరించారు. ఆయన మాట్లాడుతూ   తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, తన తొలి సినిమా పునాది రాళ్ళు తర్వాత ప్రాణం ఖరీదు, మనఊరి పాండవులు  ఇక్కడే నటించానన్నారు. అల్లు రామలింగయ్యతో గురుశిష్యుల

అనుబంధం ఉందన్నారు. ఆయన స్పూర్తి ప్రదాత అని, తెలియక హోమియో పతి ని ఉమాపతిగా పలికేవాడ్ని అయితే.. మనఊరి పాండవులు చిత్రం లోనే నాకు అల్లు రామలింగయ్య పరిచయం కల్గిందన్నారు.  అప్పుడే నన్ను వలలో (అల్లుడుగా ) వేసుకున్నారనిపిస్తోందన్నారు. వానాకాల చదువులు చదివిన రామలింగయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన అనుకుంటే

ఏదైనా,సాధించేవారన్నారు. నిత్యవిద్యార్ధిగా అల్లు గారు వుండేవారని, హోమియో పతి అల్లుగారితోనే కాదు మా అమ్మగారితోనే నాకు అలవాటు ఉందన్నారు. అల్లు రామలింగయ్య  హోమియో మాత్రలివ్వడానికి అనేక ప్రశ్నలు వేసి మందిచ్చేవారన్నారు.  గ్యాంగ్రెన్ వ్యాధులను కూడా రామలింగయ్యగారు నయం చేసేవారని, హొమియోపతిలో ఏ రోగానికి అయినా మందు

వుంటుందన్నారు. నా ఇంట్లో అందరమూ హోమియోపతి ఇప్పటికీ వాడుతూనే వుంటామన్నారు. 

ఈ కాలేజీ అభివృద్ధి కి నా సొంత డబ్బులు ఇవ్వలేదని, నా రాజ్యసభ నిధుల నుంచి రూ. 2 కోట్లు ఇచ్చానంతేనన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 5, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam