DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనవరి 29 న  మౌని అమావాస్య, మహా కుంభ్ లో అద్భుతం ఘట్టం

*10 కోట్లకు పైగా భక్తులతో పోటెత్తనున్న ప్రయాగ్ రాజ్* 

*విశాఖపట్నం/ ప్రయాగ్ రాజ్, 28, జనవరి 2025, ( డి ఎన్ ఎస్ ):* మౌని అమావాస్య, అత్యంత పవిత్రమైన రోజుగా కుంభ మేళ లో వ్యవహరిస్తుంటారు. వేలాది మంది సాధకులకు సాధువులుగా, దీక్ష అనుగ్రహించే రోజు ఇది. జనవరి నెల 29 వ తేదీ బుధవారం మహా కుంభ మేళ స్నానం ఘాట్ ల్లో పవిత్ర స్నానం

చేసేందుకు సుమారు 10 కోట్లమందికి పైగా భక్తులు హాజరు కానున్నట్టు సమాచారం. ఇప్పడికే 15 కోట్లకు పైగా భక్తులు స్నానాదికాలు పూర్తి చేసుకున్నట్టు అధికారిక సమాచారం. 
13 అఖాడాలకు చెందిన నాగ సాధువులు వేలసంఖ్యలో చేరుకున్నారు. పీఠాధిపతులు అక్కడే బస చేసి, ప్రతి నిత్యం పూజాదికాలు, జప తపాలు ఆచరిస్తున్నారు. వీరి శిష్యుల్లో సాధన

చేసిన వారికి సన్యాసం దీక్ష ఇవ్వడం జరిగేది ఈ మౌని అమావాస్య రోజునే. దీన్ని సాధకులు ఎంతో పవిత్రం గా భావిస్తారు. మంత్ర సాధకులు కూడా ఈ రోజున తమ మంత్రశక్తిని పెంచుకునేందుకు మహా కుంభ మేళ ఘాట్ లకు చేరుకుంటున్నారు. గతించిన పెద్దలకు పితృ కార్యాలు ఆ రోజున చేస్తే వెయ్యి రేట్లు ఫలితం వస్తుందనే విశ్వాసం కూడా ఉంది. దీంతో అదే

రోజున పెద్ద సంఖ్యలో స్నాన ఘాట్ ల వద్ద పెద్దలకు పిండ ప్రదానం చేయనున్నారు. 
పవిత్ర త్రివేణి సంగమం గంగా, యమునా, సరస్వతి సంగమ స్థలి లో ఇప్పడికే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం చేసింది. జనవరి 13 న మొదలైన ఈ కుంభ మేళ ఫిబ్రవరి 26 మహా శివరాత్రి నాడు ముగుస్తుంది. ఆఖరి రోజున మరింత ఎక్కువమంది వచ్చే అవకాశం

ఉన్నందున మరింత భద్రతా సిబ్బందిని వివిధ రాష్ట్రాల నుంచి తీసుకు వస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 13, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam