DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*లండన్ లో లక్షల జీతం వదిలి, సనాతన ప్రచారం కోసం సన్యాసం* *మహా కుంభ్ లో ముగ్గురి యువ సాధ్వీ భారతుల అంతరంగం*

*మహా కుంభ్ లో ముగ్గురి యువ సాధ్వీ భారతుల అంతరంగం*

*(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार)*
 
*విశాఖపట్నం/ ప్రయాగ్ రాజ్, 29, జనవరి 2025, (డిఎన్ఎస్ ):* ప్రస్తుతం సగటు యువత లక్ష్యం చదువు కాగానే లక్షల రూపాయల జీతం తో ఉద్యోగం, ఆపై విదేశీ యానం. ఆ తర్వాత పెళ్లి, తదుపరి జీవితం. అయితే అతి చిన్న వయసులోనే నెలకు 5 లక్షలకు పైగా జీతం వచ్చే

ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టి సనాతన హిందూ ధర్మం కోసం సన్యాసం తీసుకోవడం ఎవ్వరూ చెయ్యని సాహసం. 
మహాకుంభ మేళ లో ఎన్నో అనూహ్య సంఘటనలు ఎదురుచూస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రముఖుల కోసం వెతుకుతున్న కొన్ని ధార్మిక మీడియా కెమెరాలకు ముగ్గురు యువ సాధ్వులు దర్శనమిచ్చారు. వారిని పలకరిస్తే ఒళ్ళు

పులకరించే అంశాలు తెలిపారు. ముగ్గురు లండన్ నుంచి భారత్ కు వచ్చారు. వారంతా ఉన్నత చదువులు, పిహెచ్ది లు పూర్తి చేసిన వారే. పైగా అంతర్జాతీయ సంస్థల్లో నెలకు రూ. 5 లక్షలు పైగా జీతం వస్తున్నా ఉద్యోగాలు చేసిన వారే. అయితే సనాతన ధర్మ ప్రచారం కోసం తమ ఆస్థి, అంతస్తు, సామాన్య లౌకిక జీవితాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టేసారు. వారే

సాధ్వి ప్రజ్ఞ భారతి, డా. సాధ్వి గాబ్రియల్, డా. సాధ్వి అవాక్షి భారతి. గురు మాత అశుతోష్ ఆమ్వి  శిష్యరికం చేస్తూ, వారి అనుగ్రహానికి ప్రభావితులై, సన్యాసం దీక్ష స్వీకరించారు. ఉన్నత విద్యావంతులైన, తమ కుటుంబాలను విడిచి పెట్టి, స్వయం పిండ ప్రదానం చేసుకుని, సన్యాస దీక్ష ను ఆశ్రయించారు. ఇది జరిగి సుమారు 7 సంవత్సరాలు దాటింది.

దేశ విదేశాల్లో సనాతన ధర్మం ప్రచారం చేస్తూ, యువతను చైతన్యవంతుల్ని చేస్తున్నారు.  

సాద్వి ప్రజ్ఞ భారతి : ఈమె  ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్ పూర్తి చేసి, కంపెనీ సెక్రటరీ లో ఉత్తీర్ణులై ( సీఎస్ ) చేసి, గూగుల్ సంస్థలో లో రెండున్నరేళ్లు పాటు ఉన్నత ఉద్యోగం కూడా చేసారు. తదుపరి గురు మాత అశుతోష్ ఆమ్వి  ను దర్శించడం,

అనుగ్రహం పొందడం, సన్యాస దీక్ష స్వీకరణ కూడా జరిగింది. ఇది జరిగి 7 ఏళ్ళ జరిగింది. నాటి నుంచి ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా సాగిస్తున్నారు. గురు మాత అశుతోష్ ఆమ్వి  అనుగ్రహంతో లౌకిక జీవితం నుంచి విడివడి, అనంత బ్రహ్మాండ స్వరూపాన్ని దర్శనం చేసుకోగలిగామని తెలియచేస్తున్నారు.

డా. గ్రాబ్రియల్: ఈమె లండన్ నుంచి బయాలజీ లో

పీహెడీ పూర్తి చేసి, గురు మాత అశుతోష్ ఆమ్వి  ద్వారా సన్యాసం తీసుకున్నారు. నెలకు రూ. 5 లక్షల జీతం వస్తున్నా ఉద్యోగాన్ని తృణప్రాయంగా విడిచి పెట్టి, సన్యాసం తీసుకున్నారు.

డా. అవాక్షి సాధ్వి భారతి: ఈమె యుకె నుంచి మహాకుంభ మేళ కు వచ్చారు. సైకాలజీ సహా రెండు విభాగాల్లో పీహెడీ చేశారు. రూ. 6 లక్షల జీతం వస్తున్న ఉద్యోగాన్ని

విడిచిపెట్టేసారు. 

ఉన్నత విద్యావంతులైన సంస్కారం లో అత్యంత వినయంగా ఆచార్య మార్గదర్శకాల్లో నడుస్తూ ధర్మ ప్రచారం చేస్తూ మహా కుంభ మేళ లో పాల్గొనేందుకు ప్రయాగ్ రాజ్ కు చేరుకున్నారు. ఇంతకూ ముందు అయోధ్య రామ మందిర్ నిర్మాణం కోసం దేశ విదేశాల్లో విస్తృత ప్రచారం చేసారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 13, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam