DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహాకుంబ్ పై విదేశీ టీవీల్లో వార్తలు హోరెత్తిపోతున్నాయి.

*విదేశీ టీవీల దృష్టి కుంభమేళాపై, తెలుగు టీవీల దృష్టి పూసలు అమ్మి పై* 

*విశాఖపట్నం / ప్రయాగ్ రాజ్, 23 జనవరి 2025, ( డి ఎన్ ఎస్ ):*  144 ఏళ్లకు ఒక్కసారి జరిగే మహా కుంభమేళపై విదేశీ మీడియా ఛానెళ్లలో అద్భుతమైన వార్తలు హోరెత్తిపోతున్నాయి. నాగ సాధువులు, అఘోరాలు, వాళ్ళ తపో సాధన, విజ్ఞానం, గత వైభవం, గంగానది ప్రాధాన్యత,

అంతర్వాహినిగా ఉన్న సరస్వతి, తదితర అంశాలపై గంటల గంటల సమయం చర్చలు సాగుతూనే ఉన్నాయి. బిబిసి, న్యూస్ ఆస్ట్రేలియా, డియు, రాయిటర్స్, సింగపూర్ న్యూస్, ఇలా 
ఆఖరికి పొరుగు దేశం పాకిస్తాన్ లో కూడా టీవీ చానెళ్లు ఈ మహా కుంభమేళా పై ఆసక్తి కనపరుస్తూనే ఉన్నాయి. 
భారత్ లో ముఖ్యంగా తెలుగు టీవీ న్యూస్ ఛానెళ్లకు మాత్రం మహా

కుంభమేళా ఒక గ్రామ జాతరగానే కనపడుతోంది. అక్కడ పూసలు అమ్ముకునే  అమ్మి కళ్ళు ఇలా ఉన్నాయి, సినిమా లోకి తీసుకు వెళ్ళాలి, ఓ మోడల్ దీక్ష తీసుకుంది, ఆమె ఏయే సినిమాల్లో చేసింది. ఓ సాధువు చెయ్యి పైకెత్తి గోళ్లు పెంచుకున్నారు... ఇలా అనవసరమైన అంశాలపై రోజుల తరబడి చెత్త ను ప్రసారం చేస్తున్న ఉన్నాయి. 

మహా కుంభ  మేళ

ప్రాధాన్యత ఏంటి? అనేది ఈ తెలుగు టీవీ చానెళ్లకు గానీ, యూట్యూబ్ బఫ్యూన్లకు గానీ తెలియక పోవడం కాదు శోచనీయం. వేల సంవత్సరాల పురాణం వైభవం కల్గిన సనాతన ధర్మం పుట్టిన భారత్ లో కనీస పరిజ్ఞానం లేని సంస్థలు, వ్యక్తులు మీడియా రంగం లో ఉన్నారంటూ ఘాటైన విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జీవించి ఉన్న సామాన్య మానవుడు మళ్ళీ తన

జీవితంలో ఇలాంటి కుంభ మేళ వైభవాన్ని చూడలేదు. అలాంటి మహోన్నత యజ్ఞాన్ని కవరేజ్ చెయ్యడానికి ఈ టీవీలకు చేతకాలేదు అంటే వీళ్ళని అసలు జాబితానుంచే తొలగించాలి అనే సీనియర్ పాత్రికీయులు సోషల్ మాధ్యమం గానీ ఘాటైన విమర్శలు చేసారంటే. . తెలుగు టీవీ చానెళ్లు యే స్థాయికి దిగజారిపోయాయో తెలుస్తోంది. 
ఈ నెల 29 న మౌని అమావాస్య. ఈ

రోజున కుంభమేళా లో స్నానాదికాలు చేసేందుకు కనీసం 10 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా. దీన్ని కవరేజ్ చేసేందుకు అంతర్జాతీయ మీడియా అదనపు బృందం ఇప్పడికే కుంభమేళాకు చేరుకుంది. సోషల్ మీడియా పేరుతొ కొందరు దుండగులు చేస్తున్న పైత్యానికి నాగ సాధువులకు పట్టరాని కోపం సైతం వచ్చింది. 

వీళ్ళందరికీ తోడు హేతువాద

సంఘాల పేరుతొ కొందరు హిందూ వ్యతిరేక రాక్షసులు కుంభమేళాలో తమ వంతు పైత్యాన్ని సాగించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుంభ మేళ పూర్తిగా హిందువులు జరుపుకునే యజ్ఞం. దీనికి హేతువాదులు సంబంధం ఏంటి ? ఈ రాక్షసులు కుంభమేళాలో ఒక దుకాణం పెట్టి, కుంభ మేళ ఒక మూర్ఖత్వం, వచ్చిన వాళ్లంతా మూర్ఖులు అంటూ కరపత్రాలు పంచడమే కాక,

మైకుల్లో కూడా దుష్ప్రచారం చేయడాన్ని నాగ సాధువులు స్వయంగా చూసి, ఆ రాక్షసులను పోలీసులకు పట్టించడం గమనార్హం. ఈ సంఘటన కూడా కొందరు సోషల్ మీడియా ల్లో పోస్ట్ చెయ్యడం గమనార్హం. 
మొత్తం ప్రపంచం లోని అందరి దృష్టి కుంభమేళా పై ఉంటె. .. చేతగాని తెలుగు మీడియా సంస్థల దృష్టి ఓ పూసలమ్మి పై ఉండడం గమనార్హం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 13, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam