DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కుంభమేళా లో ఇండియా టీవీ రిపోర్టర్ జ్యోత్న పాట్ని సేవలు భేష్

*అర్ధరాత్రి స్నాన ఘాట్ ల వద్ద టెంట్ల వద్ద ప్రజలకు అవగాహన* 

*(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం/ ప్రయాగ్ రాజ్, 31, జనవరి 2025, (డిఎన్ఎస్ ):* మహా కుంభమేళా లో వెలుగు చూస్తున్న పలు ఘటనల నేపథ్యంలో ఇండియా టీవీ జాతీయ మీడియా రిపోర్టర్ జ్యోత్న పాట్నీ చేపట్టిన బాధ్యతాయుత కవరేజ్ కు సర్వత్రా

ప్రశంసలు లభిస్తున్నాయి. కుంభమేళా లో పవిత్ర స్నానం కోసం ప్రయాగ్ రాజ్ వచ్చిన వందలాది మంది భక్తులు రోడ్ల ప్రక్కనే చిన్న టెంట్లు వేసుకుని అక్కడే పడుకున్నారు. అర్ధరాత్రి డ్యూటీ పూర్తి చేసుకుని తన క్యాంప్ కు వెళ్తున్న జ్యోత్న పాట్నీ వెంటనే ప్రతి టెంట్ లోని వారినీ నిద్ర లేపి, వారిని సురక్షితమైన ప్రదేశాలకు

వెళ్ళవలసిందిగా అవగాహన కల్పించారు. ఈ టెంట్లు భక్తులు తమ వెంట తెచుకున్నవి కావడం, పైగా చలి తీవ్రంగా ఉండడంతో అక్కడ నుంచి వాళ్ళని కదిలించే ప్రయత్నం చేసారు. మహిళలు, చిన్నారులు, వృద్దులు కూడా ఇదే ప్రైవేట్ టెంట్లలో నిద్రించడం గమనార్హం. వాళ్ళని నిద్రలేపి సమీపంలోని ప్రభుత్వ టెంట్లలోకి పంపే ప్రయత్నం చేసారు. గత మూడు ఘటనలను

వాళ్లకి వివరించి, విడిగా ఉండడం సురక్షితం కాదని, వెంటనే ఈ ప్రాంతం ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని కోరారు. వీళ్ళలో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఉచిత శిబిరాలు, రుసుము చెల్లించే శిబిరాలు ఎన్నో ఉన్నాయని, సాదు సంత్ ల ప్రవచన మండపాలు ఉన్నాయని అక్కడికి

వెళ్లాలని కోరారు. ఒక్కసారిగా భక్తులు వస్తే, మీకు రక్షణ ఉండదని తెలిపారు. స్థానిక పోలీసులకు ఈ ప్రైవేట్ టెంట్ల నుంచి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసారు. జ్యోత్న పాట్నీ చేపట్టిన ఈ అవగాహన అర్ద రాత్రి 02: 30 గంటలకు కావడం గమనార్హం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Feb 1, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam