DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్తదానం చెయ్యండి నలుగురి ప్రాణాలు కాపాడండి  

రక్తదాన శిభిరం ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మాన

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 18, 2019 (డిఎన్‌ఎస్‌):

అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి నలుగురికి ప్రాణదానం చేయవచ్చని శ్రీకాకుళం ఎమ్మెల్యే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఆదివారం నగరం

లోని  à°°à±†à°¡à± క్రాస్ రక్తనిధి కేంద్రం వద్ద మెగా రక్తదాన శిభిరాన్ని అయన ప్రారంభించారు.  à°¸à°¿à°¨à°¿à°¨à°Ÿà±à°¡à±, చిరంజీవి జన్మదిన వేడుకలను (ఆగస్టు 22 ) పురస్కరించుకుని à°…à°–à°¿à°² భారత

చిరంజీవి యువత నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరు స్వచ్చంధంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని

ఆయన పిలుపునిచ్చారు. 

రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని మరింత ఉత్సాహంగా జీవించవచ్చన్నారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి

చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున రక్తం కొరత ఉందని రక్తనిధి నిర్వాహకులు చెబుతున్నారని ఈ నేపధ్యంలో యువజనులు,మహిళలు అన్ని వర్గాల వారు

ముందుకురావాలన్నారు. చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్చంధంగా రక్తదానం చేసారు. 

à°ˆ సందర్బంగా  à°°à±†à°¡à± క్రాస్ శ్రీకాకుళం కేంద్ర చైర్మన్

పి.జగన్మోహన్ రావు రక్తనిధి నిర్వహణలో ఎదుర్కొంటున్న  à°¸à°®à°¸à±à°¯à°²à°¨à± వివరించారు.  à°µà±€à°Ÿà°¿ పరిష్కారానికి కృషి చేస్తానని ధర్మాన హామీ ఇచ్చారు. à°ˆ కార్యక్రమంలో తాను

భాగస్వామ్యులు కావడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు.

à°ˆ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు  à°¤à±ˆà°•à±à°µà°¾à°‚డో శ్రీను, మాజీ మున్సిపల్ చైర్మన్లు అంధవరపు వరం,

à°Žà°‚.వి.పద్మావతి, మాజీ వైస్ చైర్మన్ చల్లా అలివేలు మంగ, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.    

 

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam