DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రహ్మాండ నాయకునికి పుషాలతో బ్రహ్మరధం 

వైభవంగా శ్రీనివాసునికి పుష్పయాగం - పులకించిన తిరుమల

పుష్పాధిదేవుడు ''పుల్లుడు'' ఆవాహన :. . .

వేడుకగా స్నపన తిరుమంజనం : . . .

వైభవంగా పుష్పాల

ఊరేగింపు : . . .

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి) : . . .

తిరుపతి, నవంబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌): పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమ‌వారం పుష్పయాగ మహోత్సవం à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ

మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.

         à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿

బ్రహ్మూెత్సవాల్లో అర్చకుల వల్లగానీ, ఉద్యోగుల వల్లగానీ, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు. 

          à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ ఆలయంలోని

సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మధ్యాహ్నం 1.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నులపండుగగా

జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టువస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె,

మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా

వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. 

పుష్పాధిదేవుడు ''పుల్లుడు'' ఆవాహన :. . .

        à°ªà±à°·à±à°ªà°¾à°²à°•à±

అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. అనంతరం

స్వామివారు తన దేవేరులతో కలిసి బంగారు తిరుచ్చిని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించడంతో శ్రీవారి

పుష్పయాగం నేత్రపర్వంగా ముగిసింది.

        à°…నంతరం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో à°Ž.వి.à°§‌ర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత

కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం

నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి పునరుద్ధరించి నిర్వహిస్తున్నదన్నారు. పుష్పయాగానికి మొత్తం 8 టన్నుల పుష్పాలు,

పత్రాలను దాతలు అందించిన‌ట్లు తెలిపారు. à°¤‌మిళ‌నాడు నుండి 5 à°Ÿ‌న్నులు, à°•‌ర్ణాట‌à°• నుండి 2 à°Ÿ‌న్నులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి à°•‌లిపి à°’à°• à°Ÿ‌న్ను

పుష్పాలు, à°ª‌త్రాలను దాతలు విరాళంగా అందించార‌న్నారు.

వేడుకగా స్నపన తిరుమంజనం : . . .

         à°ªà±à°·à±à°ªà°¯à°¾à°—à°‚ సందర్భంగా ఉదయం 9.00 నుంచి 11.00 à°—à°‚à°Ÿà°² వరకు స్వామి,

అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో అభిషేకం చేసి చివరగా

చందనలేపనాన్ని అలంకరించారు. ఆ తరువాత తులసిమాలలను ధరింపజేసి నక్షత్రహారతి నివేదించారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచసూక్తాలు, ఉపనిషత్తుల్లోని మంత్రాలను

పఠించారు.

వైభవంగా పుష్పాల ఊరేగింపు : . . . 

        à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు ఘనంగా జరిగింది. సోమ‌వారం ఉదయం తిరుమలలోని

కల్యాణవేదిక వద్దగల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో  à°Ž.వి.à°§‌ర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో

హరీంద్రనాధ్‌, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±à°²à± కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. శ్రీవారి ఆలయం వద్ద à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆలయ అర్చకులు పుష్పాలను స్వీకరించారు. పుష్పాల ఊరేగింపులో ఉద్యానవన విభాగం సిబ్బందితో పాటు  200 మందికి పైగా  à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ సేవకులు

పాల్గొన్నారు. 

ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్‌కు సన్మానం : 

      à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు

కృషి చేసిన à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులును à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో, à°…à°¦‌పు ఈవో శాలువతో ఘనంగా సన్మానించారు. à°ˆ సంద‌ర్భంగా ఆర్జిత సేవలైన విశేష

పూజ‌, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవాన్ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ రద్దు చేసింది. à°ˆ కార్యక్రమంలో ఆల‌à°¯ ఏఈవో లోక‌నాథం, ఇత‌à°° అధికారులు,  à°µà°¿à°¶à±‡à°· సంఖ్యలో భక్తులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam