DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రివర్స్ టెండరింగ్ లో మరో రూ.48 కోట్ల ఆదా : మంత్రి బొత్స 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 27, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్

టెండరింగ్ ద్వారా తాజాగా గురువారం నాడు మరో రూ.48 కోట్లను ఆదా చేశారు. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ పనులకు ప్యాకేజిల వారీగా నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్

ప్రక్రియలో భాగంగా కృష్ణా, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలకు సంబంధించిన ప్యాకేజి లో  à°°à±‚. 431.62 కోట్ల అంచనా వ్యయంతో 8448 యూనిట్ల నిర్మాణం కోసం రివర్స్ టెండర్లను

ఆహ్వానించారు. టెండర్ల ప్రక్రియలో ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.384.14 కోట్లకు బిడ్ ను దాఖలు చేసి ఎల్ 1 à°—à°¾ నిల్చింది. 
గతంలో మూడు

విడతల్లో 40,160 యూనిట్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించి రూ.255.94 కోట్ల భారాన్ని తగ్గించామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీంతో

పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పనుల్లో పిలిచిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో 8 ప్యాకేజిల్లో రూ. 2399 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో 48608 యూనిట్ల  à°¨à°¿à°°à±à°®à°¾à°£à°ªà± పనుల్లో రూ. 303.24

కోట్లను ఆదా చేశామని మంత్రి పేర్కొన్నారు.
 à°®à±à°–్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి

నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ సత్ఫలితాలు ఇస్తున్నదని, గృహ నిర్మాణాలకు సంబంధించి మరిన్ని ప్రాజెక్టులకు కూడా రివర్స్ టెండరింగ్ కు

వెళుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam