DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడేళ్ళ కు గాను సూర్య దేవాలయ భూముల కౌలు ప్రక్రియ

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 25, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా అరసవల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానమునకు చెందిన వ్యవసాయ భూములను కౌలు కు ఇచ్చే ప్రక్రియను శనివారం ఆలయ ప్రాంగణం లో చేపట్టినట్టు జిల్లా సహాయ కమీషనరు, ఆలయ

కార్యనిర్వాహణాధికారి వి. హరి సూర్య ప్రకాష్ తెలిపారు. ఆలయ నిబంధనల ప్రకారం లీజునకు సేద్యము చేసుకొనుటకు గాను 2020-21 వ సంవత్సరం నుండి 2022-23 వ సంవత్సరం వరకు మూడు సంవత్సరాలు కౌలు హక్కులు ఇవ్వడం జరిగిందన్నారు. టెండర్- కం-బహిరంగ వేలం పాటలు అరసవల్లి, వప్పంగి, వాడాడ, రాయపాడు, చింతాడ గ్రామములలో జరిగినవి. శ్రీ స్వామివారి దేవస్థానంకి

చెందిన వ్యవసాయ భూములు మొత్తం 26.55 సెంట్లు భూమి ఉందన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి భూములు మీద ఒక సంవత్సరంకు వచ్చిన ఆదాయం రూ. 1,75,075/-  కాగా ప్రస్తుతం టెండర్ కమ్ బహిరంగ వేలం ద్వారా ఒక సంవత్సరమునకు వచ్చిన ఆదాయం రూ. 2,00, 600/-. గతం కంటే ఈ సంవత్సరం పాటల ద్వారా పెరిగిన పైకం 25,525/- పెరిగిందన్నారు. 
ఈ కార్యక్రమంలో ఏసీ ఆఫీస్

ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ బాబు, దేవాలయం సర్వేరు టీ.వి. దుర్గా ప్రసాద్, ఆలయ జూనియర్ అసిస్టెంట్ బి. ఎస్. చక్రవర్తి, రికార్డ్ అసిస్టెంట్ ఎన్. లక్ష్మణరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 11, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam