DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోర్టు సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్తా: మంత్రి సీదిరి

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 05, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్ట్  సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు తాము సాయశక్తులా చేస్తారని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు

నిర్వాసితులకు హామీ ఇచ్చారు.  బుధవారం కాశిబుగ్గ శ్రీ చైతన్య కళాశాల ఆవరణలో పోర్ట్ నిర్మాణం తలపెట్టనున్న ప్రాంత నిర్వాసితులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయం చేసేందుకు  ప్రయత్నం చేస్తుందన్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. సాధ్యమైనంత వరకు అందరికీ ఆమోదయోగ్యమైన ప్యాకేజీ

అందిస్తామన్నారు. నిర్వాసితులకు మౌలిక సదుపాయాలు  కల్పించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.  ఈ సందర్భంగా  నిర్వాసితులు  మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరారు.   తామంతా ప్రభుత్వం చెప్పబోయే మాటలు పైనే ఆధారపడి ఉన్నామన్నారు.  మా సమస్యలు

పరిష్కరించిన తర్వాతే పోర్టు నిర్మాణ పనులు చేపట్టాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, ఇంచార్జ్ ఆర్డీఓ ఎం.అప్పారావు, జిల్లా సర్వే, భూరికార్డుల శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకర్ రావు, ఉజ్యానవన శాఖ సహాయ సంచాలకులు ప్రసాద్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 9, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam