DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రికార్డు స్థాయి సభ్యులతో ఏపీ రాష్ట్ర డిజిపి వీడియో సమావేశం 

*76 వేల పోలీసులకు గౌతం సవాంగ్ దిశానిర్దేశం, హిత భోద* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 26, 2020 (డిఎన్ఎస్):* పోలీసు‌ శాఖలోని అన్ని అంతర్గత విభాగాల అధికారులు, సిబ్బందితో డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పై అందరు పోలీసు అధికారులకు దిశా

నిర్దేశం చేసారు. ఇటీవల జరిగిన శిరోముండనం సంఘటనతో మొత్తం పోలీసులందరికీ ప్రవర్తన నియమావళిపై దిశ నిర్దేశం చేయడం జరిగింది. సుమారు 76 వేలమంది సిబ్బందికి మార్గదర్శకం చేసారు. క్షేత్ర స్ధాయిలో పోలీసు స్టేషన్లకు వస్తున్న బాధితుల పట్ల ఎలా వ్యవహరించాలో వివరించారు. ప్రజలు గౌరవిస్తూ, నేరస్థులు భయపదేవిధంగా పొలీస్ వ్యవస్ధలో

ప్రక్షాళన కావాలన్నారు.

కోవిడ్ సమయంలో పోలీసుల సర్వీసులో చాలా మంచి పేరు తెచ్చుకున్నాం. అయితే ఒక పోలీసు తప్పు చేస్తే పోలీస్ వ్యవస్ధ మొత్తాన్ని తప్పు పడతారన్నారు. తొలిసారి ఇంత పెద్ద సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ ప్రభుత్వానికి మార్పు, పరివర్తన ముఖ్య అజెండా గా సాగుతోందన్నారు. 
సామాన్య ప్రజలకు పోలీసు

సేవలు అందుబాటులో ఉండాలి. గత సంవత్సరంగా అదే ఆలోచనతో పని చేస్తున్నాం. కోవిడ్ సమయంలో మన పోలీసుల సేవలు అభినందనీయం..
అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో కొందరు సామాన్యులు ఇబ్బంది పడ్డారు. న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. నేరం చేస్తే డిపార్ట్మెంట్, న్యాయ పరమైన చర్యలు కచ్ఛితంగా ఉంటాయన్నారు. 
/> పోలీసు సిబ్బంది మీద పోలీసులే చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం.. కానీ తప్పదు
ఆత్మ‌ విమర్శ చేసుకోవడం చాలా అవసరం అన్నారు. మార్పు కోసం చేయాల్సింది చాలా ఉంది, మనం అందరం కలిసి చేద్దాం అని తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు మనకు బాధ్యత అప్పజెప్పారని టీం అందరికీ అర్ధమౌతుందని అనుకుంటానన్నారు. పోలీసు సిబ్బంది మొత్తం రాబోయే రెండు

నెలలో ఓరియంటేషన్ క్లాసులు అటెండ్ అవ్వాలన్నారు. మార్పులు ప్రతీ పోలీసు స్టేషన్లో కనిపించాలని సూచించారు. పోలీసు స్టేషనుకు వచ్చిన వారిని మంచిగా  రిసీవ్ చేసుకొవాలని, పోలీసు స్టేషనుకు వచ్చేవారితో మన ప్రవర్తన స్టేషనులో కనిపించాలని, పోలీసులు ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

కార్యక్రమం లో

పాల్గొన్న సీఐడీ ఏడీజీపీ సునీల్ కుమార్, మాట్లాడుతూ  ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్టు సెక్షన్ 4 ప్రకారం సంబంధిత అధికారి కూడా నేరస్ధుడేనని, సాక్షుల వద్ద తీసుకునే వివరాలు 161crpc ప్రకారం వీడియోగ్రాఫ్ తీసుకుంటాం అన్నారు. సమస్యతో వచ్చిన వారితో దుర్భాషలాడకూడదని, పోలీసులు చట్టానికి సైనికులు మాత్రమేనన్నారు. అవతలి

వ్యక్తిని తమతో సమానంగా గౌరవించలేని మనస్తత్వం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 11, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam