DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిబ్బంది వెతలు తీరేనా? రేషన్ వాహనం కదిలేనా? 

*ఎం ఆర్ ఓ కార్యాలయాల వద్ద నిలిచిపోయిన రేషన్ వాహనాలు*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 04, 2021  (డి ఎన్ ఎస్):* రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటి వద్దకే రేషన్ పథకం వాహనాల సిబ్బంది కొన్ని డిమాండ్ల కారణంగా విశాఖ లో ఆందోళన

చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితం విశాఖపట్నం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ వాహనదారులు నిరసన చెయ్యగా, గురువారం విశాఖ పట్నం సిటీ లోని టర్నర్ చౌల్ట్రీ లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆ ప్రాంతంవారు నిరసనలు తెలియచేస్తున్నారు. విశాఖ చౌల్ట్రీ ఎం ఆర్ ఓ కార్యాలయం ఎదుట ఇంటి వద్దకే రేషన్ పథకం వాహనదారులు రేషన్

వాహనాలతో ఆందోళన చేపట్టారు. తాము వాహనాలను డ్రైవింగ్ చేస్తూ, సామాను మోసుకుంటూ వెళ్లడం తో పాటు సరఫరా చెయ్యడం తమకు ఇబ్బంది కరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము డ్రైవర్స్ మే కానీ మేము కూలీలం కాదని మండిపడుతున్నారు. తమతో అని పనులు చేయిస్తున్నారని, దీంతో కొంత మంది డ్రైవర్స్ హాస్పిటల్ పాలయ్యారని

తెలియచేస్తున్నారు. మాకు జీతంకూడా సరిపోవడం లేదని మాకు హెల్పేర్స్ ఇస్తేనే పని చేస్తాం అని కొన్నిచోట్ల తేల్చి చెప్పేస్తున్నారు. అంత వరకు వాహనాలు మా దగ్గరే ఉంచుకుంటాం..ముందుగా మా దగ్గర 60 వేలు రూపాయలు తీసుకున్నారని తెలిపారు. ఈ సమస్య పట్ల అధికారులు దృష్టి కి తీసుకొని వెళ్లిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం

చేస్తున్నారు. 

ఇంటి వద్దకే రేషన్ పథకం ద్వారా రేషన్ ను ఇంటికే పంపుతున్నారని ప్రచారం జరగడం తో రేషన్ దుకాణాల్లో అందుబాటులో లేకపోవడం తో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 11, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam