DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చెత్త ఎత్తే మున్సిపల్ వ్యాన్ లో వినాయక విగ్రహాల తరలిస్తారా?

*గుంటూరు మునిసిపల్ సిబ్బంది గీత దాటేసారు: బీజేపీ ధార్మిక సెల్*

*తప్పు జరిగింది, బీజేపీ రాష్ట్రధార్మికసెల్ ఫణింద్ర కు కమిషనర్ వివరణ* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం / గుంటూరు, సెప్టెంబర్ 07, 2021 (డిఎన్ఎస్):* కోట్లాది మంది హిందువులు పూజించే వినాయక విగ్రహాలను సోమవారం గుంటూరు

మునిసిపల్ సిబ్బంది చెత్త, మురికి వ్యర్ధాలు తరలించే వ్యాన్ లో తరలించడం పట్ల భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు విజయ్ శంకర్ ఫణింద్ర మండిపడ్డారు. దీనిపై గుంటూరు మునిసిపల్ కమిషనర్ ను ఫోన్ ద్వారా వివరణ కోరినట్టు తెలిపారు. తప్పు జరిగిందని, ఈ విషయాన్నీ తాము కూడా సీరియస్ గానే తీసుకోవడం జరుగుతుందని

తెలిపారన్నారు. ఈ ఘటన తన దృష్టిలోకి సోమవారం సాయంత్రం వచ్చిందని, దీనికి భాద్యులైన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ ఘటనకు భాద్యులైన వారానికి తక్షణం ఉద్యోగం నుంచి తొలగించాలని కోరినట్టు ఫణింద్ర తెలిపారు.   

ఈ ఘటనకు భాద్యులైన  శానిటేషన్ ఇంచార్జి భవాని, ప్రసన్నలతోనూ

మాట్లడడం జరిగింద్దని, తాము కూడా హిందువులమేనని, తాము తప్పు చేశామని చెప్పడం జరిగిందన్నారు. ఈ విగ్రహాలను ఆసుపత్రి ప్రాంగణ సమీపంలో విక్రయం కోసం పెట్టారని, ఆసుపత్రికి వచ్చే వారికీ ఇబ్బందిగా ఉందని, చెప్పడం జరిగిందని, వేరే చోటకు మార్చాలని గత మూడు రోజులుగా కోరుతున్న, పట్టించుకోలేదన్నారు. తప్పని పరిస్థితుల్లో ఈ వాహనం

మార్చేందుకు సిద్దపడ్డామన్నారు. విగ్రహాలను ఈ వాహనంలో తరలించడానికి పెట్టడం తప్పేనని అంగీకరించారని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 8, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam