DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పండితులు ఉన్న సింహాచలంలో ప్రాయశ్చిత్తం అవసరం ఉందా?

*వైష్ణవ స్వాముల్లోనే తప్పులు చూపించే వీళ్ళు తప్పులు చేస్తారా?* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2021 (డిఎన్ఎస్):* సింహాచల క్షేత్రంలో ప్రాయశ్చిత్తం కోసం జరిగే పవిత్రోత్సవాలు నిర్వహించవలసిన ఆవశ్యకత ఉందా? అంటే లేదు అనే సమాధానమే అధికశాతం వైదిక వర్గాలు, పీఠాధిపతులు నుంచి

వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఈ క్షేత్రంలో అర్చన, వైదిక కార్యక్రమాలను శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రం చెప్పినట్టుగానే, పొల్లు పోకుండా ఆచరిస్తూ, జరిపిస్తున్న ఆలయ స్థానాచార్యులు శ్రీమాన్ ఎస్ టీపీ రాజగోపాలాచార్యులు  వంటి అహితాజ్ఞులు, వైదిక స్రష్ట, శ్రీపాంచరాత్ర ఆగమ నిష్ణాతులు ఉండగా. .ఆలయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ

లోపాలు జరిగే అవకాశం ఉండదు. ఇదే అభిప్రాయం పీఠాధిపతులు సైతం తెలియచేస్తుంటారు. 

ఏడాది కోసారి సహస్ర ఘటాభిషేకానికి ఆలయానికి వచ్చే శ్రీవైష్ణవ స్వాముల్లోనే తప్పులు ఎట్టి చూపించే స్థానాచార్యులు, ఆలయంలోనే నిత్యం ఉండే తానూ తప్పులు చేస్తారు అంటే నమ్మడం  ఎలా? ఎదుటి వారిలో తప్పులు చూపించే వీరు స్వయంగా తప్పులు

చేస్తారా అంటే అనుమానమే. 

ఇక అసలు తప్పులే జరగనప్పుడు ప్రాయశ్చిత్తం అవసరం ఉంటుందా? అనేది కొందరికి వచ్చే సందేహం. 

భక్తుల్లోనే తప్పుడు ఎత్తి చూపించే స్థానాచార్యులు . .భగవంతుని దగ్గర ఆలయంలో పనిచేసే అర్చకులు చేసే తప్పులు, దోషాలను ఒప్పుకుంటారా అంటే కచ్చితంగా ఒప్పుకోరు అని తెలుస్తోంది. అంటే ఆలయంలో

అర్చనలు, వైదిక క్రియలు అన్నీ దోషరహితంగానే జరుగుతున్నప్పుడు ఇక ప్రాయశ్చిత్తం అవసరం ఉంటుందా? 

వైదిక సంప్రదాయ దిట్ట స్థానాచార్యులు ఎస్ టీపీ రాజగోపాలాచార్యులు సింహాచల క్షేత్రానికి ఒక పెద్ద సంపద.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 9, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam