DNS Media | Latest News, Breaking News And Update In Telugu

20 న శ్రీరంగగిరి సన్నిధిలో దేవుడున్నాడు జాగ్రత ఆవిష్కరణ 

*(DNS Report: సాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam )*
విశాఖపట్నం, డిసెంబర్ 18, 2024 (డి ఎన్ ఎస్ ): ప్రఖ్యాత కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల క్షేత్రపు పవిత్రత - నిర్వహణపై పూర్తి విశ్లేషణ పై సీనియర్ పాత్రికేయులు ఎంవిఆర్ శాస్త్రి రచించిన దేవుడున్నాడు జాగ్రత్త పుస్తకం శుక్రవారం ఆవిష్కృతం కానుంది.

భాగ్యనగరం లోని శ్రీరంగగిరి దేవాలయం ధనుర్మాసపు పవిత్ర వేడుకల్లో ఆవిష్కరించనున్నట్టు ఆలయ ట్రస్టీ డా. ధనుంజయ డి ఎన్ ఎస్ కు తెలిపారు. *శతాబ్దాలనాటి చరిత్ర గల విశ్వ విఖ్యాత తిరుమల దివ్య క్షేత్రపు పవిత్రతపై, నిర్వహణపై, రాజకీయాలకు అతీతంగా తిరుమల ఆధ్యాత్మిక విశిష్టతను పరిరక్షించడంపై సంపూర్ణ సంకలనం తో కూడిన రచన చేసిన

పుస్తకం ఇది అన్నారు. పుస్తకంతో మనకు తెలియని ఎన్నో వాస్తవాలు వెలుగులోకి రాబోతున్నాయన్నారు. మంగళవారం ఈ పుస్తకాన్ని శాస్త్రి తిరుమల వేంకటేశుని చరణాల చెంత ఆ పుస్తక ప్రతిని సమర్పించడాం జరిగిందన్నారు.  
శుక్రవారం శ్రీరంగగిరి సన్నిధికి అయన స్వయంగా విచ్చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారని తెలిపారు. ఉదయం 7-30కు

జరిగే ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికేయులు, హైందవ సంప్రదాయ ప్రముఖులు హాజరవుతున్నారన్నారు. 
శ్రీవేంకటేశ్వరుని అత్యంత ఇష్టమైన ధనుర్మాస వేళ ఈ రచన ఆవిష్కరణ కావడం శుభపరిణామం అన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 9, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam