Apr 29, 2024 11:05 am
పెందుర్తి లో అభ్యర్థులను పరుగులెత్తిస్తున్న పురోహిత మిత్ర రాజేష్
*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*
*విశాఖపట్నం, ఏప్రిల్ 29, 2024 (డి ఎన్ ఎస్):* వచ్చే నెలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో శాసన సభ, లోక్ సభ స్థానాలకు పోటీపడుతున్న రాజకీయ పార్టీల అభ్యర్థులకు బ్రాహ్మణ అభ్యర్థులు ఒణుకు పుట్టిస్తున్నారు. కేవలం కుల పిచ్చితో అభ్యర్థులకు సీట్లు కేటాయించిన రాజకీయ పార్టీలకు ఇతరులు చుక్కలు చూపిస్తున్నారు. అధికార పార్టీ, కూటమి పార్టీ అభ్యర్థులకు అడ్డుపుల్లలు గా స్వతంత్రులు ఎన్నికల బరిలో నిలిచారు. ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం, బిసి సామాజిక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ రెండు వర్గాలకూ ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీల అభ్యర్థులు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క పార్టీ కూడా బ్రాహ్మణా సామాజిక వర్గం వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన వీరు కొందరు అభ్యర్థులను బరిలో నిలిపారు.
వారిలో నేషనలిస్ట్ జనశక్తి పార్టీ తరపున ఏలూరు వెంకట రమణ (రాజేష్) పెందుర్తి నుంచి, వడ్డాది ఉదయ్ కుమార్ పెందుర్తి నుంచి, నూకల సూర్య ప్రకాష్ భీమిలి నుంచి శాసన సభకు పోటీ పడుతున్నారు. చాపక్రింద నీరులా వీరు చేసుకుంటున్న ప్రచారం ఉద్యమంగా సాగుతోంది. పెందుర్తి నియోజక వర్గంలో బ్రాహ్మణా , కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. కూటమి పార్టీల నుంచి అభ్యర్థిగా పంచకర్ల రమేష్ ( కాపు ) బరిలో ఉండగా, బ్రాహ్మణులూ కూడా తమకే ఓటు వేస్తారు అనే ధీమాతో ఉన్నారు. ఒక్కసారిగా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వెయ్యడం తో కూటమి కంగు తింది. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఏమాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇతని పట్ల సొంత పార్టీలోనే పూర్తి వ్యతిరేకత ఉంది. దీంతో కూటమి అభ్యర్ధికి గెలుపు అవకాశం ఉందని అందరూ భావిస్తున్న తరుణంలో బ్రాహ్మణ అభ్యర్థులు అడ్డుకట్ట వేస్తున్నారు.
ఆ అర్చకుడు . .అసామాన్యుడే, . .
పెందుర్తి నియోజక వర్గం నుంచి బరిలో ఉన్న ఏలూరు వెంకట రమణ ఆ ప్రాంతం వారికి సుపరిచితులు. ప్రధానంగా బ్రాహ్మణా సామాజిక వర్గంలోని అన్ని వర్గాలకూ తలలో నాలుకలా మసులుతూ.. ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర గ్రూప్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వృత్తి పరంగా పౌరహితులు అయినా, వాస్తు, జ్యోతిష్యం సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. వ్యాపారం చేసుకునేవారికి ప్రతి నెలా బ్రాహ్మణ బజార్ లు నిర్వహిస్తూ, వారికి ఆర్థిక స్వావలంబన చేకూరే విధంగా సేవ చేస్తున్నారు.
పేద బ్రాహ్మణులకు ఆర్థిక, వ్యాపార, విద్యా, వైద్యం, తదితర రంగాల్లో తగిన విధంగా అండగా నిలబడి సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన బ్రాహ్మణా పురోహిత సంఘం రాష్ట్ర కార్యదర్శిగాను, హ్యూమన్ రైట్స్ సంఘానికి స్థానిక ప్రతినిధిగానూ, భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.
గత ఆరు నెలలుగా పెందుర్తి నియోజక వర్గం లోని ప్రతీ వీధి తిరుగుతూ అందరి సమస్యలూ తెలుసుకుంటున్నారు. ఒక చిన్న ఆటో, సంప్రదాయ వస్త్రధారణలో పదిమంది పురోహితులు ఒక బృందంగా ఏర్పడి ఒక్కో ప్రాంతం లో ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వి ఐదు ఆరు బృందాలు పెందుర్తి నియోజకవర్గం లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.
ఈయనకు డ్రిల్లింగ్ మిషన్ గుర్తు కేటాయించడం కూడా ఈయన ప్రచార శైలి ని తెలియచేస్తోంది. గెలుపు ఓటములతో ప్రమేయం లేకుండా క్షేత్ర స్థాయిలో డ్రిల్లింగ్ చేసి మరీ ఓట్లు కొల్లగొట్టేలా కనపడుతోంది.
ఇప్పడికే ఉత్తరాంధ్ర పురోహిత సంఘం, ఆంధ్ర ప్రదేశ్ విశాఖ కేంద్ర బ్రాహ్మణ పురోహిత సంఘం సమాఖ్య వెంకట రమణ కు మద్దతు ప్రకటించాయి. ఇక ఇదే ప్రాంతంలో సింహాచలం గ్రామం కూడా కలవడంతో అక్కడ పురోహిత, అర్చక సంఘాలు, కూడా ఈయనకు సంఘీభావం తెలిపే అవకాశం ఉంది.
ఇంతకాలం అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేసిన బ్రాహ్మణ సామాజిక వర్గం ఒక్కసారిగా విజృంభించి ప్రచారం చేయడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు నిద్ర పట్టడం లేదంటే అతిశయోక్తి కాదు
Apr 22, 2024 4:23 pm
*కాంగ్రెస్ దరఖాస్తు తిరస్కరణ, ఏకపక్షంగా బీజేపీ అభ్యర్థి ఎన్నిక*
*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*
*విశాఖపట్నం, ఏప్రిల్ 22, 2024 (డి ఎన్ ఎస్):* భారత దేశ చరిత్రలో సంచలనాలు సృష్టిస్తున్న నరేంద్ర మోడీ మరొక రికార్డ్ తన పేరిట వేసుకున్నారు. 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ విజయం ఖాయం అని అందరూ ఊహించినట్టు గానే విజయ ప్రస్థానం మొదలు పెట్టేసారు. ఎన్నికల నామినేషన్ ప్రక్తియ పూర్తి కాకుండానే సూరత్ లోక్ సభ సీటు బీజేపీ అభ్యర్థి ముకేశ్ భాయ్ చంద్రకాంత్ దలాల్ ఏకపక్షంగా గెలిచినట్టు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి.
లోక్సభ ఎన్నికల మధ్య గుజరాత్లో బీజేపీ తొలి విజయాన్ని నమోదు చేసింది. సూరత్లో పార్టీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి దరఖాస్తు సక్రమంగా లేకపోవడంతో దాన్ని తిరస్కరించారు.
నామినేషన్ పత్రాల ఉపసంహరణ చివరి రోజు మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ప్రకటించనుంది. సూరత్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ రద్దయిన ఒకరోజు ముందుగానే సమీకరణాలు మారిపోయాయి. బీఎస్పీ అభ్యర్థి ప్యారే లాల్ భారతి చివరిగా తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ముఖేష్ దలాల్ను బిజెపి రాష్ట్ర చీఫ్ సిఆర్ పాటిల్ సన్నిహితుడు మరియు విశ్వసనీయంగా భావిస్తారు. సూరత్ చరిత్రలో ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి ఎంపీగా దలాల్ నిలిచారు.
గుజరాత్ కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలిన సందర్భంలో, సూరత్లోని ఆ పార్టీ లోక్సభ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలు తిరస్కరించబడ్డాయి, అతని ముగ్గురు ప్రతిపాదకులు అతని నామినేషన్ ఫారమ్పై సంతకం చేయలేదని జిల్లా ఎన్నికల అధికారికి అఫిడవిట్లో పేర్కొన్నారు.
నామినేషన్ ఫారమ్లపై సంతకాలు మరింత నిజమైనవిగా ఉండాలని గుర్తించిన జిల్లా రిటర్నింగ్ అధికారి సౌరభ్ పార్ధి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఫారమ్లపై తాము సంతకం చేయలేదని ప్రతిపాదకులు ఖండించారు.
బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నికల ఏజెంట్ దినేష్ జోధానీ అభ్యంతరం వ్యక్తం చేసిన వెంటనే వివాదం తలెత్తింది.
ప్రతిస్పందనగా, కుంభాని సంతకాల యొక్క ప్రామాణికతను సమర్థించారు, చేతివ్రాత నిపుణుడు మరియు సంతకం చేసినవారు వాటిని ధృవీకరించాలని సూచించారు. ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ, రిటర్నింగ్ అధికారి అఫిడవిట్లు మరియు పరిశీలన సమయంలో సమర్పించిన అదనపు ఆధారాల ఆధారంగా తిరస్కరణలను ధృవీకరించారు.
కాంగ్రెస్ పార్టీ తన న్యాయవాది బాబు మంగూకియా వాదిస్తూ, ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయాలని యోచిస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరించబడినప్పటికీ, వారి నామినేషన్లను వెనక్కి తీసుకున్న ఇతర పోటీదారులు:
లాగ్ పార్టీకి చెందిన సోహీల్ షేక్
గ్లోబల్ రిపబ్లికన్ పార్టీకి చెందిన జయేష్బాహి మేవాడా
భారత్భాయ్ ప్రజాపతి, అజిత్సిన్హ్ భూపత్సిన్హ్ ఉమత్, కిషోర్భాయ్ దయానీ మరియు బరయ్య రమేష్భాయ్ పర్సోత్తంభాయ్తో సహా స్వతంత్రులు
బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్యారేలాల్ భారతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్టీకి చెందిన అబ్దుల్ హమీద్ ఖాన్
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ ఏప్రిల్ 19న, రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న, నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ 1న జరగనుంది.
2024. మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనున్నాయి, అభ్యర్థుల నామినేషన్లకు గడువు మార్చి 27. ఈ ఎన్నికలు 21 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించాయి.
దీని తరువాత, రెండవ దశ ఎన్నికలు ఏప్రిల్ 26న నామినేషన్తో ప్రారంభమవుతాయి. గడువు ఏప్రిల్ 4. ఈ దశ 12 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది.
మూడవ దశకు వెళ్లడం, మే 7న ఎన్నికలు జరగనున్నాయి మరియు నామినేషన్ గడువు ఏప్రిల్ 20. ఈ దశ 12 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా కలుపుతుంది.
నాలుగో దశ ఎన్నికలు మే 13న జరుగుతాయి, నామినేషన్ గడువు ఏప్రిల్ 25న, 10 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది.
ఐదవ దశ మే 20న, నామినేషన్ గడువు మే 3న మరియు 8 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. .
మే 25న, ఆరవ దశ ఎన్నికలు జరుగుతాయి, నామినేషన్ గడువు మే 6న, 7 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉంటుంది.
చివరగా, ఏడవ దశ ఎన్నికలు జూన్ 1న, నామినేషన్ గడువు మే 14న జరగనున్నాయి. , 8 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది.
Date : |
Ruthuva : |
Nakshatram : |
Week : |
Masam : |
Amrithakalam : |
Year : |
Pakshamvarjam : |
Samsthram : |
Ayanam : |
Tithi : |
Durumuhratam : |
*కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య*
*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*
*అమరావతి, నవంబర్ 01, 2021 (డిఎన్ఎస్):* ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. విజయవాడలో అవేరా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ కొత్త వేరియంట్ రెట్రోసాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి వాతావరణ పరిరక్షణకు ఇచ్చిన పిలుపు మేరకు, ఆ దిశగా అవేరా సంస్థ అడుగులు వేయడం శుభపరిణామమన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ఎంచుకున్నందుకు అవేరా బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా అవేరా వ్యవస్థాపకుడు, సీఈవో డా. రమణ, కో ఫౌండర్ చాందిని చందన నాంది పలికారని వెంకయ్య నాయుడు అన్నారు. డా. రమణ మాట్లాడుతూ.. అధునాతన ఫీచర్లతో రూపొందిన రెట్రోసా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 148 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు. బ్లూటూత్ ను అనుసంధానించడం ద్వారా బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్ శాతం, వోల్టేజ్ తదితర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దేశంలోనే ఈ శ్రేణి వాహనాల్లో రెట్రోసా అత్యధిక వేగాన్ని కలిగి ఉందని చెప్పారు. అవేరా ఇప్పటికే యూరప్, ఏషియా పసిఫిక్ దేశాలకు వాహనాల ఎగుమతి చేస్తోందని వివరించారు. 2022 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 140 అవేరా పాయింట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోందని డా. రమణ పేర్కొన్నారు. కార్యక్రమంలో అవేరా ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Oct 1, 2021 2:51 pm
Oct 1, 2021 2:25 pm
Sep 30, 2021 7:44 pm
Feb 14, 2020 11:41 pm
à°¬à±à°°à°¾à°‚à°ªà±à°Ÿà°¾à°¨à± / విశాఖపటà±à°¨à°‚, à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 14, 2020 (à°¡à°¿à°Žà°¨à±à°Žà°¸à±) : ఉతà±à°¤à°° అమెరికా à°–à°‚à°¡à°‚ లోని కెనడాలో à°—à°² à°¬à±à°°à°¾à°‚à°ªà±à°Ÿà°¾à°¨à± (రాజధాని టొరంటో కౠసమీపంలోనే ) నగరం లో à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 14 ఉదయం 6 à°—à°‚à°Ÿà°² సమయానికే à°…à°¤à±à°¯à°‚à°¤ కనిషà±à°Ÿ ఉషà±à°£à±‹à°—à±à°°à°¤à°²à± -21 à°¡à°¿à°—à±à°°à±€à°²à± నమోదౠచేసà±à°•à±‹à°µà°¡à°‚ తో నగరం మంచà±à°ªà°°à±à°µà°¤à°¾à°²à°¤à±‹ à°®à±à°¨à°¿à°—ిపోయింది. తెలà±à°—ౠరాషà±à°Ÿà±à°°à°¾à°²à°•à± చెందిన à°à°¾à°°à°¤à±€à°¯à±à°²à± అధిక శతం ఉండే à°ˆ నగర వీధà±à°²à°¨à±à°¨à±€ మంచౠఖండాలతో నిండి పోవడం తో à°¸à±à°¥à°¾à°¨à°¿à°• à°ªà±à°°à°à±à°¤à±à°µ సిబà±à°¬à°‚ది వీటిని తొలగించే పనిలో పడింది. ఇళà±à°²à°²à±à°²à±‹à°¨à°¿ à°•à±à°³à°¾à°¯à°¿à°²à±à°²à±‹ నీళà±à°²à± సైతం మంచà±à°—à°¾ మారిపోవడం గమనారà±à°¹à°‚. à°ˆ à°•à±à°°à°®à°‚ లో జనజీవన à°¸à±à°°à°µà°‚తి à°•à°¿ ఆటంకం à°à°°à±à°ªà°¡à°¿à°‚ది. విధà±à°²à°•à±, కళాశాలలకౠవెళà±à°²à±‡à°µà°¾à°°à± à°à°¾à°°à±€ à°Žà°¤à±à°¤à±à°¨ ఉనà±à°¨à°¿ à°¦à±à°¸à±à°¤à±à°²à± ధరిసà±à°¤à±‡ గానే ఇంటి à°¨à±à°‚à°šà°¿ కాలౠబయట పెటà±à°Ÿà±† పరిసà±à°¥à°¿à°¤à°¿ లేదà±. వరà±à°·à°‚ à°•à±à°°à°¿à°¨à°Ÿà±à°Ÿà±à°—à°¾ మంచౠà°à°•à°§à°¾à°Ÿà°¿à°—à°¾ పడà±à°¤à±à°‚à°¡à°¡à°‚ గమనారà±à°¹à°‚. ఇళà±à°² బయట పారà±à°•à°¿à°‚గౠచేసే కారà±à°²à± సైతం హిమపాతాలà±à°²à±‹ కూరà±à°•à± పోతà±à°‚à°¡à°¡à°‚ గమనారà±à°¹à°‚. మైదాన à°ªà±à°°à°¾à°‚తాలà±à°²à±‹ à°à°¾à°°à±€à°—à°¾ à°•à±à°°à°¿à°¸à°¿à°¨ మంచౠపలౠఆకారాలౠదరà±à°¶à°¨à°®à°¿à°¸à±à°¤à±‹à°‚ది.
అయితే à°à°¾à°°à°¤à±€à°¯ వాతావరణానికి పూరà±à°¤à°¿à°—à°¾ à°à°¿à°¨à±à°¨à°‚à°—à°¾ ఉండే ఉషà±à°£à±‹à°—à±à°°à°¤à°²à± కావడంతో à°Žà°•à±à°•à±à°µ మంది à°à°¾à°°à°¤à±€à°¯à±à°²à± à°ˆ సమయంలోనే ఇకà±à°•à°¡à°•à± చేరà±à°•à±à°¨à±‡ à°ªà±à°°à°¯à°¤à±à°¨à°‚ చేసà±à°¤à±à°‚టారà±.
May 17, 2024 4:44 pm
*వ్యక్తిగత కక్షలే: పోలీసులు, మండిపడ్డ టిడిపి, జనసేన*
(Report:Sairam CVS, राष्ट्रवादी पत्रकार )
విశాఖపట్నం, మే 17, 2024 (డి ఎన్ ఎస్...
May 14, 2024 3:33 pm
May 8, 2024 2:58 pm
Apr 29, 2024 10:33 pm
Jul 31, 2020 8:26 am
Feb 15, 2020 8:11 am
Feb 13, 2020 9:47 pm
Apr 29, 2024 5:30 pm
*నిన్న సూరత్, నేడు ఇండోర్, చివరకు నిలిచేది ఎందరో?*
*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*
*విశాఖపట్నం, ఏప్రిల్ 29, 2024 (డి ఎన్ ఎస్):* కాంగ్రెస్ అస్తవ్యస్త ఆలోచనలతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు పార్టీని వీడి పోతున్నారు. రెండు రోజుల క్రితం సూరత్ లో కాంగ్రెస్ అభ్యర్థి దరఖాస్తు నిబంధనలకు లోబడి లేకపోవడంతో పోటీ నుంచి తిరస్కరణకు గురయ్యారు. నేడు ఏకంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ తన నామినేషన్ను ఉపసంహరించుకుని బీజేపీ లో చేరడం సంచలనంగా మారింది.
ఆయన బీజేపీ లో చేరిన విషయాన్నీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి మరియు బిజెపి నాయకుడు కైలాష్ విజయవర్గియా తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటో పెట్టి పోస్ట్ చేసే వరకూ ఎవ్వరికీ ఈ విషయం తెలియలేదు. దీంతో కాంగ్రెస్ కు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలా ఒక్కక్కరుగా పార్టీని వీడుతుంటే చివరకు బరిలో నిలిచే వారు ఎందరో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కైలాష్ విజయవర్గియా పెట్టిన పోస్ట్ సారాంశం ఇదే: ఇండోర్ నుండి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ జీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా, చీఫ్ నేతృత్వంలో బిజెపిలోకి స్వాగతించారు.
మంత్రి మోహన్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ. బిజెపి అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది ఈ పరిణామాన్ని ధృవీకరించారు,
కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఇది కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యం. ఇది వారి విధానాల వైఫల్యం. వారి ఓటు బ్యాంకు రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు... వెన్నుపోటు పొడిచాయి. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లిపోగా, ఇప్పుడు నేతలు చేరారు.
బిజెపి అధికార ప్రతినిధి హితేష్ బాజ్పాయ్ మాట్లాడుతూ, బామ్ "కాంగ్రెస్ సీనియర్ నాయకుల దోపిడీ, దోపిడీ మరియు సహాయనిరాకరణతో అసంతృప్తి చెందారు" అని పేర్కొన్నారు.
“లక్ష రూపాయల డిమాండ్ (టికెట్ల కోసం) మరియు జాతీయ కాంగ్రెస్ నాయకులను ఇండోర్కు రానివ్వకపోవడం అతని ఆగ్రహానికి కారణం. అక్షయ్ బామ్ కూడా డబ్బుకు బదులుగా టిక్కెట్లు అమ్మే పద్ధతి గురించి కలత చెందాడు…” అని అతను చెప్పాడు.
దేశవ్యాప్తంగా పది లక్షల మంది నాయకులు పార్టీని విడిచిపెట్టారు మరియు మధ్యప్రదేశ్లోనే దాదాపు 5 లక్షల మంది ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వం విధానపరమైన పక్షవాతానికి గురౌతోందని, మోదీ హామీలను నమ్మి నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆయన అన్నారు.